అన్వేషించండి

ఎర్ర సముద్రంలో సంక్షోభం, మండిపోతున్న పండ్ల ధరలు - ఈ ఏడాదంతా ఇంతేనట!

Red Sea crisis: ఎర్ర సముద్రంలో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా యాపిల్స్ ధరలు పెరుగుతున్నాయి.

Red Sea: ఎర్ర సముద్రంలో సంక్షోభం (Red Sea Crisis) కొనసాగుతూనే ఉంది. హౌతీ ఉగ్రవాదుల దాడులతో సరుకుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫలితంగా చాలా వరకూ వెజిల్స్ సౌతాఫ్రికా మీదుగా తమ దారిని మళ్లించుకుంటున్నాయి. ఇది దూరాభారంతో పాటు ధరాభారాన్ని పెంచనుంది. ముఖ్యంగా యాపిల్స్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే భారత్‌లో వాతావరణ మార్పుల కారణంగా యాపిల్స్‌,నారింజ పండ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు భారత్‌కి వచ్చే దిగుమతుల ఖర్చులూ పెరగడం వల్ల ధరలు మరింత భారం కానున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా కాకుండా సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ మీదుగా ఈ కంటెయినర్‌లు వస్తున్నాయి. ఇవి ముంబయికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దూరం కూడా ఎక్కువే. 21 టన్నుల యాపిల్స్ మోసుకొచ్చే ఒక్కో వెజిల్‌కి కనీసం 2-3వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాపిల్స్‌పై ప్రభుత్వం 50% దిగుమతి సుంకం వేస్తోంది. ఇది కలుపుకుని ఆ 21 టన్నుల యాపిల్స్ ఖర్చు 4,500 డాలర్లకు పెరుగుతుంది. 

ఇక యాపిల్స్ ఎక్కువగా పండే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సారి వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఈ పంటసాగుపై ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి సమయాల్లోని భారత్ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. టర్కీ, అమెరికా, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే యాపిల్స్ ధరలు మండి పోతున్నాయి. అటు నారింజ పండ్ల ధరలూ ఇదే విధంగా పెరుగుతున్నాయి. ఈజిప్ట్, టర్కీ నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. టర్కీ నుంచి యాపిల్స్‌ విషయానికొస్తే 18కిలోల బాక్స్‌ ధర రూ.2,200-2,300 వరకూ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో కిలో యాపిల్స్ ధర రూ.200 కిలోల వరకూ పలుకుతోంది. ఈ సారి దేశీయంగా పడిన నారింజ పండ్లకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల విక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో నారింజ పండ్ల కిలో ధర రూ.150-180 వరకూ ఉంటోంది. ఈ ఏడాదంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 

ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. 

Also Read: Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కార్, అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget