అన్వేషించండి

ఎర్ర సముద్రంలో సంక్షోభం, మండిపోతున్న పండ్ల ధరలు - ఈ ఏడాదంతా ఇంతేనట!

Red Sea crisis: ఎర్ర సముద్రంలో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా యాపిల్స్ ధరలు పెరుగుతున్నాయి.

Red Sea: ఎర్ర సముద్రంలో సంక్షోభం (Red Sea Crisis) కొనసాగుతూనే ఉంది. హౌతీ ఉగ్రవాదుల దాడులతో సరుకుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫలితంగా చాలా వరకూ వెజిల్స్ సౌతాఫ్రికా మీదుగా తమ దారిని మళ్లించుకుంటున్నాయి. ఇది దూరాభారంతో పాటు ధరాభారాన్ని పెంచనుంది. ముఖ్యంగా యాపిల్స్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే భారత్‌లో వాతావరణ మార్పుల కారణంగా యాపిల్స్‌,నారింజ పండ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు భారత్‌కి వచ్చే దిగుమతుల ఖర్చులూ పెరగడం వల్ల ధరలు మరింత భారం కానున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా కాకుండా సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ మీదుగా ఈ కంటెయినర్‌లు వస్తున్నాయి. ఇవి ముంబయికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దూరం కూడా ఎక్కువే. 21 టన్నుల యాపిల్స్ మోసుకొచ్చే ఒక్కో వెజిల్‌కి కనీసం 2-3వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాపిల్స్‌పై ప్రభుత్వం 50% దిగుమతి సుంకం వేస్తోంది. ఇది కలుపుకుని ఆ 21 టన్నుల యాపిల్స్ ఖర్చు 4,500 డాలర్లకు పెరుగుతుంది. 

ఇక యాపిల్స్ ఎక్కువగా పండే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సారి వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఈ పంటసాగుపై ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి సమయాల్లోని భారత్ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. టర్కీ, అమెరికా, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే యాపిల్స్ ధరలు మండి పోతున్నాయి. అటు నారింజ పండ్ల ధరలూ ఇదే విధంగా పెరుగుతున్నాయి. ఈజిప్ట్, టర్కీ నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. టర్కీ నుంచి యాపిల్స్‌ విషయానికొస్తే 18కిలోల బాక్స్‌ ధర రూ.2,200-2,300 వరకూ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో కిలో యాపిల్స్ ధర రూ.200 కిలోల వరకూ పలుకుతోంది. ఈ సారి దేశీయంగా పడిన నారింజ పండ్లకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల విక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో నారింజ పండ్ల కిలో ధర రూ.150-180 వరకూ ఉంటోంది. ఈ ఏడాదంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 

ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. 

Also Read: Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కార్, అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget