అన్వేషించండి

ఎర్ర సముద్రంలో సంక్షోభం, మండిపోతున్న పండ్ల ధరలు - ఈ ఏడాదంతా ఇంతేనట!

Red Sea crisis: ఎర్ర సముద్రంలో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా యాపిల్స్ ధరలు పెరుగుతున్నాయి.

Red Sea: ఎర్ర సముద్రంలో సంక్షోభం (Red Sea Crisis) కొనసాగుతూనే ఉంది. హౌతీ ఉగ్రవాదుల దాడులతో సరుకుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫలితంగా చాలా వరకూ వెజిల్స్ సౌతాఫ్రికా మీదుగా తమ దారిని మళ్లించుకుంటున్నాయి. ఇది దూరాభారంతో పాటు ధరాభారాన్ని పెంచనుంది. ముఖ్యంగా యాపిల్స్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే భారత్‌లో వాతావరణ మార్పుల కారణంగా యాపిల్స్‌,నారింజ పండ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు భారత్‌కి వచ్చే దిగుమతుల ఖర్చులూ పెరగడం వల్ల ధరలు మరింత భారం కానున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా కాకుండా సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ మీదుగా ఈ కంటెయినర్‌లు వస్తున్నాయి. ఇవి ముంబయికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దూరం కూడా ఎక్కువే. 21 టన్నుల యాపిల్స్ మోసుకొచ్చే ఒక్కో వెజిల్‌కి కనీసం 2-3వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాపిల్స్‌పై ప్రభుత్వం 50% దిగుమతి సుంకం వేస్తోంది. ఇది కలుపుకుని ఆ 21 టన్నుల యాపిల్స్ ఖర్చు 4,500 డాలర్లకు పెరుగుతుంది. 

ఇక యాపిల్స్ ఎక్కువగా పండే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సారి వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఈ పంటసాగుపై ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి సమయాల్లోని భారత్ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. టర్కీ, అమెరికా, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే యాపిల్స్ ధరలు మండి పోతున్నాయి. అటు నారింజ పండ్ల ధరలూ ఇదే విధంగా పెరుగుతున్నాయి. ఈజిప్ట్, టర్కీ నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. టర్కీ నుంచి యాపిల్స్‌ విషయానికొస్తే 18కిలోల బాక్స్‌ ధర రూ.2,200-2,300 వరకూ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో కిలో యాపిల్స్ ధర రూ.200 కిలోల వరకూ పలుకుతోంది. ఈ సారి దేశీయంగా పడిన నారింజ పండ్లకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల విక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో నారింజ పండ్ల కిలో ధర రూ.150-180 వరకూ ఉంటోంది. ఈ ఏడాదంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 

ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. 

Also Read: Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కార్, అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget