News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lakhimpur Kheri Incident: 'నేను, నా కుమారుడు ఆ కారులో లేం.. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం'

లఖింపుర్ ఘటనలో తనపై వస్తోన్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు. ఎలాంటి దర్యాప్తుకైనా తాను సిద్ధమన్నారు.

FOLLOW US: 
Share:

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను మొదటి నుంచి కేంద్రమంత్రి ఖండించారు. ఎలాంటి దర్యాప్తు ప్యానల్ ముందైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 

ఘటన జరిగిన సమయంలో తాను కానీ తన కుమారుడు కానీ అక్కడ లేమని ఆయన పునరుద్ఘాటించారు.

" లఖింపుర్ ఖేరీలో ఆదివారం ఘటన జరిగిన సమయంలో నేను, నా కుమారుడు అక్కడ లేము. మా కారును వేరే దారిలో మళ్లించారు. ఎలాంటి ప్యానెల్ ముందైనా సాక్ష్యం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఘటనను అన్ని కోణాల నుంచి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయి. నిజాలు బయటకి వస్తాయి. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు.                                           "
-  అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందని అజయ్ మిశ్రా వెల్లడించారు. అయితే తన పేరు ఎఫ్ఐఆర్‌లో నమోదైందని వస్తోన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. న్యాయ విధానాల గురించి తనకు తెలుసని.. ఓ సాధారణ పౌరుడిలానే విధానాలను గౌరవిస్తానన్నారు.

రాజీనామా వార్తలపై..

ఈ ఘటన కారణంగా తన పదవికి రాజీనామా చేయమని ప్రతిపక్షాలు కోరడం సమంజసం కాదన్నారు అజయ్ మిశ్రా.

" ప్రపంచంలో మన దేశ ఖ్యాతి పెరుగుతోంది. ప్రధాని మోదీ, భాజపాకు మంచి ప్రచారం జరుగుతోంది. మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేని ప్రతిపక్షాలు ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.                                             "
-అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

తన కుమారుడికి భద్రత కోరారా అన్న ప్రశ్నకు మిశ్రా స్పందిస్తూ తాను తన కుమారుడికి ఎలాంటి భద్రత కోరలేదని.. తన జిల్లాలో ఎలాంటి సమస్యలు లేవన్నారు.

ఈ రోజు ఉదయం హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాతో అజయ్ మిశ్రా సమావేశమయ్యారు. లఖింపుర్ ఘటన గురించి అమిత్ షా కు ఆయన వివరించినట్లు సమచాారం.

ఆశిష్ మిశ్రాపై కేసు..

ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతులపై దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో అజయ్ మిశ్రా పేరు కూడా ఉంది.

రూ.50 లక్షల సాయం..

లఖింపుర్ ఘటనలో మరణించిన రైతులు, జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ప్రకటించాయి ఛత్తీస్‌గఢ్, పంజాబ్ ప్రభుత్వాలు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.

 Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 06 Oct 2021 07:42 PM (IST) Tags: BJP Amit Shah Narendra Modi Prime Minister Union Home Minister FIR Lakhimpur Kheri incident Ajay Kumar Mishra Minister of State for Home Affairs North Block investigating agencies

ఇవి కూడా చూడండి

Nara Lokesh: రేపు ఢిల్లీ నుంచి ఏపీకి నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్

Nara Lokesh: రేపు ఢిల్లీ నుంచి ఏపీకి నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్

Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Constable Results: తెలంగాణ  కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!