By: Ram Manohar | Updated at : 06 May 2023 11:26 AM (IST)
జమ్ముకశ్మీర్కు రాజ్నాథ్ సింగ్ బయల్దేరారు. (Image Credits: ANI)
Rajouri Encounter:
కశ్మీర్లో రాజ్నాథ్ సింగ్
జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర కదలికలు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో మరోసారి అలజడి రేపింది ఈ ఘటన. దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే జమ్ముకశ్మీర్ పర్యటన వెళ్లారు. అక్కడి పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా సమీక్షించనున్నారు. నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇప్పటికే ఈ సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ చేపట్టే ఆపరేషన్లపై రాజ్నాథ్ సింగ్కు కమాండర్లు వివరించనున్నారు. గ్రౌండ్ జీరో వద్ద కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బారాముల్లాతో పాటు రాజౌరిలో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని హతమార్చారు. పేలుడు పదార్థాలతో పాటు AK 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని సహించేదే లేదని తేల్లి చెబుతున్న కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇండియన్ ఆర్మీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఉగ్రస్థావరాలను గుర్తించి వారిని మట్టుబెడుతోంది.
#WATCH | Defence Minister Rajnath Singh leaves for Jammu
5 soldiers lost their lives in an explosion during an encounter with terrorists in Jammu's Rajouri district yesterday pic.twitter.com/UjpbLBTd86— ANI (@ANI) May 6, 2023
Northern Army Commander Lt Gen Upendra Dwivedi is at Ground Zero, to review the operational situation on the ongoing operations at Kandi in Rajouri where contact was re-established with militants. He was briefed on all aspects of the operations by ground commanders. pic.twitter.com/2rQTPLs2fW
— ANI (@ANI) May 6, 2023
ఎన్కౌంటర్..
జమ్ముకశ్మీర్లోని రాజౌరిలో జరిగిన ఎన్కౌంటర్లో 5గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేయాలనే లక్ష్యంతో నిత్యం నిఘా పెడుతోంది ఇండియన్ ఆర్మీ. నిఘా వర్గాల సమాచారం మేరకు ఆపరేషన్లు చేపడుతోంది. ఈ క్రమంలోనే రాజౌరిలోని కండి ఫారెస్ట్లో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. మే 3వ తేదీన జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు జవాన్లు. ఓ ట్రక్లో వెళ్తుండగా ఉన్నట్టుండి ముష్కరులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినా...లాభం లేకుండా పోయింది. కాసేపటికే వాళ్లూ మృతి చెందారు. దీనికి బదులు తీర్చుకునేందుకు సైనికులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రకదలికలను గమనించిన ఆర్మీ...మొత్తానికి వాళ్ల స్థావరాన్ని కనుగొంది. ఓ గుహలో వాళ్లు దాక్కున్నట్టు గుర్తించింది. చుట్టూ కొండలు,గుట్టలు ఉన్నాయి. ఇంతలో సైనికుల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇరువైపులా ఎన్కౌంటర్ మొదలు కాగా...అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బాంబు దాడి చేశారు. ఈ బాంబు ధాటికి ఇద్దరు జవాన్లు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Europa Clipper: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహంపైకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ నాసా ఆఫర్ మీకోసమే
Delivery Man Letter: ఫ్లవర్ పాట్ పగులగొట్టాడు, ఇంటర్నెట్లో హీరో అయిపోయాడు- ఎలాగంటే!
EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్పూర్లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు