అన్వేషించండి

Bengal Train Tragedy: మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం, బెంగాల్ రైలు ప్రమాదంపై రాహుల్ అసహనం

Kanchenjunga Express Accident: బెంగాల్‌ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వరుస ప్రమాదాలే నిదర్శనమని విమర్శించారు.

Kanchenjunga Express Tragedy: బెంగాల్‌ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రైల్వే సేఫ్‌టీని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండి పడ్డారు. గత పదేళ్లలో ఇలాంటి ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మోదీ సర్కార్‌ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యాక్సిడెంట్‌లలో మోదీ సర్కార్‌కి ట్రాక్ రికార్డ్ ఉందని సెటైర్లు వేశారు.

"బెంగాల్ రైలు ప్రమాదం నన్నెంతో కలిచివేసింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. గత పదేళ్లలో మోదీ హయాంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇవాళ జరిగిన ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. బాధ్యత ఉన్న ప్రతిపక్షంగా దీనిపై మేం పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మోదీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

 

ఒకేట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కాంచజనంగ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై ఉండగా వెనక నుంచి గూడ్స్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ధాటికి బోగీలు చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. గాయపడ్డ వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వీళ్లకి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వేగంగా స్పందించి ఉంటే ప్రాణనష్టం ఇంతగా ఉండేది కాదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై విచారణ మొదలైంది. రెడ్ సిగ్నల్‌ని జంప్ చేసి గూడ్స్ ట్రైన్ వచ్చిందని, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రధాని మంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే..మరి కొన్నింటిని దారి మళ్లించింది. 

Also Read: BJP Election Committee: జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
IPL 2025 SRH VS GT Result Update: తీరు మారని సన్ రైజర్స్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
తీరు మారని సన్ రైజర్స్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Peddi First Shot Reaction | రంగ స్థలాన్ని మించేలా Ram Charan పెద్ది గ్లింప్స్SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP DesamJofra Archer Bowling vs PBKS IPL 2025 | నిద్ర పవర్ ఏంటో చాటి చెప్పిన జోఫ్రా ఆర్చర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
KTR Open Letter: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ, కలిసి పోరాటం చేద్దామని పిలుపు
IPL 2025 SRH VS GT Result Update: తీరు మారని సన్ రైజర్స్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
తీరు మారని సన్ రైజర్స్.. వరుసగా నాలుగో పరాజయం.. సత్తా చాటిన గిల్, సుందర్.. గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు
Vijay Deverakonda: బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
RRB Exam: అసిస్టెంట్ లోకో పైలట్‌ స్టేజ్-2 పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే
అసిస్టెంట్ లోకో పైలట్‌ స్టేజ్-2 పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే
AP Weather Updates: ఏపీ ప్రజలకు చల్లని వార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
ఏపీ ప్రజలకు చల్లని వార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
Embed widget