అన్వేషించండి

Bengal Train Tragedy: మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం, బెంగాల్ రైలు ప్రమాదంపై రాహుల్ అసహనం

Kanchenjunga Express Accident: బెంగాల్‌ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వరుస ప్రమాదాలే నిదర్శనమని విమర్శించారు.

Kanchenjunga Express Tragedy: బెంగాల్‌ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రైల్వే సేఫ్‌టీని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండి పడ్డారు. గత పదేళ్లలో ఇలాంటి ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మోదీ సర్కార్‌ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యాక్సిడెంట్‌లలో మోదీ సర్కార్‌కి ట్రాక్ రికార్డ్ ఉందని సెటైర్లు వేశారు.

"బెంగాల్ రైలు ప్రమాదం నన్నెంతో కలిచివేసింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. గత పదేళ్లలో మోదీ హయాంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇవాళ జరిగిన ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. బాధ్యత ఉన్న ప్రతిపక్షంగా దీనిపై మేం పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మోదీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

 

ఒకేట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కాంచజనంగ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై ఉండగా వెనక నుంచి గూడ్స్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ధాటికి బోగీలు చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. గాయపడ్డ వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వీళ్లకి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వేగంగా స్పందించి ఉంటే ప్రాణనష్టం ఇంతగా ఉండేది కాదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై విచారణ మొదలైంది. రెడ్ సిగ్నల్‌ని జంప్ చేసి గూడ్స్ ట్రైన్ వచ్చిందని, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రధాని మంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే..మరి కొన్నింటిని దారి మళ్లించింది. 

Also Read: BJP Election Committee: జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget