News
News
X

Rahul Gandhi: రాహుల్ ఇంకొంత టైమ్ కావాలని అడిగారు, నోటీసులైతే ఇచ్చాం - ఢిల్లీ పోలీసులు

Rahul Gandhi: శ్రీనగర్ వ్యాఖ్యలపై వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరికొంత సమయం కోరినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

Rahul Gandhi:

పోలీసుల విచారణ 

శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో రాహుల్ వ్యాఖ్యలపై విచారణ పూర్తి చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా దీనిపై స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరి కొంత సమయం అడిగినట్టు వివరించారు. జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని, ఎవరు ఏం చెప్పారో గుర్తు చేసుకోవడానికి సమయం కావాలని కోరినట్టు వెల్లడించారు. 

"రాహుల్ గాంధీతో సమావేశమయ్యాం. మేం అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని అడిగారు. ప్రస్తుతానికి మేం ఆయనకు నోటీసులు జారీ చేశాం. ఆ నోటీసులకు ఆయన అంగీకరించారు. ఒకవేళ మరోసారి ప్రశ్నించాల్సి వస్తే మేం అందుకు అనుగుణంగానే నడుచుకుంటాం. భారత్ జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని రాహుల్ చెప్పారు. మేం అడిగిన వివరాలను తప్పకుండా ఇస్తానని అన్నారు. ఆ తరవాతే మా ప్రొసీడింగ్స్‌ కొనసాగుతాయి"

- సాగర్ ప్రీత్ హుడా, ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్

కాంగ్రెస్ ఆగ్రహం..

దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వచ్చారని మండి పడింది. అమిత్‌ షా ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ ఆరోపించారు. ఈ విచారణ పూర్తైన వెంటనే  రాహుల్ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు. మీడియా ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నించినా...ఆగలేదు. 

"అమిత్‌ షా ఆదేశాలివ్వకుండా ఇదంతా జరిగేదే కాదు. ఏ కారణం లేకుండా పోలీసులు ఇలా రాహుల్ ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పటికే నోటీసులు ఇచ్చారని రాహుల్ చెప్పారు. అందుకు సమాధానం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అయినా పోలీసులు లోపలకు వచ్చారు"

- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి 

 

Published at : 19 Mar 2023 02:56 PM (IST) Tags: Delhi Police Rahul Gandhi Speech Rahul Gandhi Rahul Gandhi Residence

సంబంధిత కథనాలు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Accenture Layoffs: అసెంచర్‌లోనూ లేఆఫ్‌లు, ఏకంగా 19 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ

Accenture Layoffs: అసెంచర్‌లోనూ లేఆఫ్‌లు, ఏకంగా 19 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ

Coronavirs Cases India: మళ్లీ టెన్షన్ పెడుతున్న కరోనా, కొత్త స్ట్రాటెజీ ప్రకటించిన కేంద్రం

Coronavirs Cases India: మళ్లీ టెన్షన్ పెడుతున్న కరోనా, కొత్త స్ట్రాటెజీ ప్రకటించిన కేంద్రం

Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!

Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!

Unesco Report: మరో పాతికేళ్ల తర్వాత భారత్‌లో నీళ్లు దొరకవట - భయపెడుతున్న యునెస్కో రిపోర్ట్

Unesco Report: మరో పాతికేళ్ల తర్వాత భారత్‌లో నీళ్లు దొరకవట -  భయపెడుతున్న యునెస్కో రిపోర్ట్

టాప్ స్టోరీస్

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు