అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిపోయిన కూరగాయల ధరలు - సామాన్యులకు చుక్కలు!

కూరగాయలు కొందామని వెయ్యిరూపాయలు పట్టుకెళ్తే కిలో చొప్పున గట్టిగా 10 రకాల కూరగాయాలు కొనే పరిస్థితి లేదు. అందుకే చాలా మంది అర్థకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు.

టమోటా సామాన్యుడికి టాటా చెబుతోంది. పచ్చిమిర్చి ధర వింటేనే గొంతు మండిపోయేలా ఉంది. ఇలా ఏ కూరగాయ ధర చూసుకున్నా గుండె ధడ మొదలవుతోంది. ప్రస్తుతం టమోటా వంద రూపాయలకుపైగానే పలుకుతోంది. పచ్చిమిర్చి 150 రూపాయలకు సమీపంలో ఉంది. కిలో 50 రూపాయల కంటే తక్కువ ఏదీ లేదు. ఉల్లి మాత్రమే వందకు మూడు నాలుగు కిలోలు ఇస్తున్నారు. అది ఒక్కటి మినహా వేరే ఏ కూగాయలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. 

వెయ్యి తీసుకెళ్తే

కూరగాయలు కొందామని వెయ్యిరూపాయలు పట్టుకెళ్తే కిలో చొప్పున గట్టిగా 10 రకాల కూరగాయాలు కొనే పరిస్థితి లేదు. అందుకే చాలా మంది అర్థకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. మంచి కారం ఉన్న పచ్చి మిర్చి 150 రూపాయల వరకు ఉంది. ఒకానొక దశలో ఇది 200 రూపాయల వరకు వెళ్లి రెండు రోజులుగా కాస్త తగ్గింది. టమోటా అయితే పెట్రోల్‌లా మండుతోంది. ప్రస్తుతం వంద రూపాయల వద్ద ఉంది. ఇది మరింత పెరిగే అవకాశందని సమాచారం. 

అందని ఆకు కూరలు

అరటి కాయలు ఒక్కొక్కటి 20 రూపాయలు చెబుతున్నారు. మునక్కాయలు అయితే ఒకటి పది రూపాయలు చెబుతున్నారు. ఆకు కూరల సంగతి సరే సరి. ఒకప్పుడు 20 రూపాయలు ఇస్తే ఇంటిళ్లపాది ఏదైనా ఆకుకూర తినేటోళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు చిన్న చిన్న కట్టలు కట్టి 20 రూపాయలు చెబుతున్నారు. గట్టిగా తింటే ఒకరి కూడా సరిపోని పరిస్థితి ఉంది. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇలా ఏ ఆకు కూర తీసుకున్నా ఇదే పరిస్థితి. కొత్తిమీర, పుదీనా అయితే వాసన చూడటానికి కూడా వీల్లేనంతగా పెరిగిపోయింది. 

తగ్గిన సరఫరా

మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు సరఫరా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే కూరయగాయల ధరలు ఇంతలా మండిపోతున్నాయని అంటున్నారు. మరో నెల రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

ప్రస్తుతం అమల్లో ఉన్న కూరగాయల ధరలు

టమోట- 100
పచ్చిమిర్చి 120
కాకరకాయ- 70
దొండకాయ- 50
బెండకాయ-50
బీన్స్‌-80
క్యారెట్‌-60
వంకాయ-50
బీరకాయ- 60
గోరుచిక్కుడు- 60


చివరకు నాన్‌వెజ్‌ ధరలు మండిపోతున్నాయి. కోడిగుడ్డు ధర 7 రూపాయలకు చేరుకుంది. చికెన్‌ 300 వరకు ఉంది. మటన్ ఎప్పుడో ఉన్నత వర్గాల వస్తువుగా మారిపోయింది. 

కోడి గుడ్డు- 7 రూపాయలు
చికెన్-300
మటన్ - 800

పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్‌, క్యాప్సికమ్‌  కర్ణాటక నుంచి రావాల్సి ఉంది. బంగాళదుంపలు గుజరాత్‌ నుంచి రావాల్సి ఉంది. మరికొన్ని కూరగాయలు కర్నూలు నుంచి రావాల్సి ఉంది. వాతావరణం పరిస్థితులు,  స్థానికంగా ఉన్న డిమాండ్ మేరకు అక్కడి నుంచి సరఫరా తగ్గిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. అందుకే వంటింట్లో మంటలు వస్తున్నాయని అంటున్నారు వ్యాపారులు. 

టమోటా ధరల పెరుగుదలకు కారణం 

మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్ కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా రూ.5కు పడిపోయింది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget