అన్వేషించండి

Prakasam TDP Leaders : వెలిగొండ ప్రాజెక్టును నోటిఫై చేయండి... షెకావత్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల విజ్ఞప్తి..!

వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలో నోటిఫై చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. అన్ని అనుమతులు ఉన్నప్రాజెక్టును తక్షణం గెజిట్‌లో పెట్టాలని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు.


ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు తమ జిల్లా నీటి వనరుల కోసం ప్రత్యేకమైన పోరాటం చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసలే కరువు జిల్లా అయిన ప్రకాశం ఎడారిగా మారిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లేఖలు రాసిన వారు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రితో సమావేశమై తమ జిల్లా పరిస్థితిని వివరించారు. అన్యాయం చేయవద్దని కోరారు. 

వెలిగొండ ప్రాజెక్టు కేఆర్ఎంబీ పరిధిలో లేకపోవడంతో ప్రకాశం జిల్లాకు నీటి కష్టాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇటీవల కేంద్రం తీసుికుంటున్న నిర్ణయాలు కూడా ప్రకాశం జిల్లా సాగునీటి రంగానికి ఇబ్బందికరంగా మారాయి. ఆ నిర్ణయాలు అమలు జరిగితే ప్రకాశం జిల్లా రైతులకు చుక్క నీరు అందవని వారు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో చేర్చకపోవడం.  విభజన చట్టంలో  వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల తరహాలోనే వెలిగొండకూ అనుమతులు ఉన్నాయన్నారు. కానీ ఇటీవల కేఆర్ఎంబీని నోటిఫై చేసిన గెజిట్‌లో  వెలిగొండ ప్రస్తావన లేదు. దీంతో ప్రకాశం జిల్లా రైతుల గుండెల్లో రాయిపడినట్లయింది. అయితే కేంద్రం ఈ ప్రాజెక్టును గుర్తించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ చూపడంతో ఏఐబీపీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఇంత కాలం ఈ ప్రాజెక్టు గురించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం చేయని తెలంగాణ .. కేంద్రం నిధులు మంజూరు చేయగానే కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. అనుమతి లేని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడం సరి కాదని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. బహుశా.. కేఆర్ఎంబీ వివరణ అడిగితే అప్పుడు స్పందించే అవకాశం ఉంది. టీడీపీ నేతలు ఈ లోపే తెలంగాణ సీఎంకు లేఖ రాశారు.  ప్రకాశం జిల్లా రైతులకు అంతో ఇంతో నీరు అందించే ప్రాజెక్టు వెలిగొండ అని దానిపై ఫిర్యాదులు చేయడం సరి కాదన్నారు. విభజన చట్టాన్ని గౌరవించి లేఖను వెనక్కి తీసుకోవాలని కోరారు.
Prakasam TDP Leaders : వెలిగొండ ప్రాజెక్టును నోటిఫై చేయండి...  షెకావత్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల విజ్ఞప్తి..!

రాయలసీమ ఎత్తిపోతలతో  ఆయుకట్టుకు ఆగిపోనున్న నీరు..!
 
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై కూడా ప్రకాశం జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . అ ప్రాజెక్టు నిర్మిస్తే శ్రీశైలం నుంచి దిగువకు నీరు రావని అదే జరిగితే సాగర్ ఆయుకట్టు కింద చివరిలో ఉండే ప్రకాశం జిల్లా పొలాలకు నీరు అందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రాయలసీమ ఎత్తిపోతల నిర్మించి తీరాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికీ కీలకమైన పనులు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు సాగర్ ఆయుకట్టుకు నీరందే పరిస్థితి లేకపోవడం.. మరో వైపు దాదాపుగా పూర్తయిన వెలిగొండ ప్రాజెక్టును ఉపయోగించుకోకుండా చేయడం వంటి పరిణామాలతో ప్రకాశం జిల్లా రైతులు చిక్కుల్లో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో కామ్‌గా ఉండటం కన్నా ఏదో ఓ పోరాటం చేయదన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
Prakasam TDP Leaders : వెలిగొండ ప్రాజెక్టును నోటిఫై చేయండి...  షెకావత్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల విజ్ఞప్తి..!

ప్రకాశం జిల్లా ఎడారి కాకుండా కాపాడాలంటున్న టీడీపీ నేతలు

కృష్ణా బోర్డు గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం అసలు అన్ని ప్రాజెక్టుల్ని నోటిఫై చేయాడాన్ని వ్యతిరేకిస్తోంది. వివాదంలో ఉన్నప్రాజెక్టుల్ని మాత్రమే నోటిఫై చేయాలని కోరుతోంది. అందుకే వెలిగొండ ప్రాజెక్టును ప్రత్యేకంగా గెజిట్‌లో పెట్టాలని కోరడం లేదు. దీంతో ఒక వేళ  కేంద్రం ఎవరి డిమాండ్లను పట్టించుకోకపోతే వెలిగొండ ప్రాజెక్టు.. నిరుపయోగంగా మిగిలిపోతుంది. అంతే కాదు అక్రమ ప్రాజెక్ట్ గా ముద్రపడే ప్రమాదం ఉంది. అధికారంలో ఉండటం వల్ల వైసీపీ నేతలు గొంతెత్తలేకపోతున్నారు. టీడీపీ నేతలు ఢిల్లీ వరకూ వెళ్లి ప్రకాశం జిల్లా ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.  

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

100 Most Powerful Indians: దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
100 Most Powerful Indians: దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
Embed widget