By: Ram Manohar | Updated at : 10 Mar 2023 03:13 PM (IST)
ఆస్ట్రేలియాలోని భారతీయులకు భద్రత కల్పిస్తామని ఆ దేశ ప్రధాని వెల్లడించారు.
Indian Community In Australia:
భద్రతకు భరోసా..
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోని ఆల్బనీస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రధాని మోదీ అడిగారు. ఇందుకు ఆ దేశ ప్రధాని హామీ ఇచ్చారు. కొద్ది నెలలుగా ఆస్ట్రేలియాలోని పలు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. గోడలపై అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు. దీనిపై చాలా రోజులుగా భారతీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
"ఆస్ట్రేలియాలో కొన్ని ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రధాని ఆంథోని అల్పనీస్తో చర్చించాను. భారతీయుల భద్రతకు భరోసా ఇస్తామని నాకు హామీ ఇచ్చారు. ఇదే మా ప్రాధాన్యత అని కూడా చెప్పారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సమావేశంలో ద్వైపాక్షిక బంధంపై చర్చలు జరిపారు ఇద్దరు ప్రధానులు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలోనూ రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు.
"రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది చాలా కీలకం. భద్రతా పరంగానూ పరస్పరం సహకరించుకోవాలి. అందుకే ఇండో పసిఫిక్ రీజియన్లో రక్షణకు సంబంధించిన అంశాన్ని చర్చించాం. ఆర్థికపరమైన ఒప్పందాలు జరిగేందుకూ ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి"
- ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi raises temple attacks issue with Anthony Albanese, says Aussie PM assures safety of Indian community
— ANI Digital (@ani_digital) March 10, 2023
Read @ANI Story | https://t.co/Jun1AClXRY#India #Australia #PMModi #IndianCommunity #TempleAttacks #AustralianPM #AnthonyAlbanese pic.twitter.com/XXCMaZIWL4
#WATCH | PM Modi says Australian PM Albanese has assured the safety of the Indian community after reports of attacks on temples pic.twitter.com/20swtPDZWk
— ANI (@ANI) March 10, 2023
ఆస్ట్రేలియాలోని ఓ ఆలయానికి ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవాలంటే "ఖలిస్థాన్ జిందాబాద్" అని నినాదాలు చేయాలని హెచ్చరించారు ఆగంతకులు. వేడుకలు ప్రశాంతంగా జరగాలంటే ఈ స్లోగన్స్ ఇవ్వాల్సిందేనని బెదిరించారు. బ్రిస్బేన్లోని గాయత్రి మందిరానికి ఈ కాల్స్ వచ్చాయి. గతంలోనూ ఆస్ట్రేలియాలో పలు హిందూ ఆలయాలపై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొందరు ఇలాగే కాల్స్ చేసి బెదిరించారు. ముఖ్యంగా విక్టోరియా ప్రావిన్స్లోని హిందూ ఆలయాలపై దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఆలయ గోడలపై అసభ్యకరంగా రాయడం అలజడి సృష్టించింది. ఆస్ట్రేలియా టుడే చెప్పిన వివరాక ప్రకారం..గాయత్రి మందిర్ అధ్యక్షుడు జై రామ్, ఉపాధ్యక్షుడు ధర్మేశ్ ప్రసాద్కు కాల్స్ చేసి బెదిరించాడో వ్యక్తి,. అంతే కాదు తన పేరు గురువదేశ్ సింగ్ అని కూడా చెప్పాడు. హిందువులంతా ఖలిస్థాన్కు మద్దతుగా ఉండాల్సిందేనని చెప్పాడు. ఆలయానికి వచ్చిన వాళ్లందరూ ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయాలని అని డిమాండ్ చేశాడు. అటు మెల్బోర్న్లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఓ ఆలయ పూజారికి కాల్ చేసిన ఖలిస్థాన్ మద్దతు దారులు బెదిరించారు. ఆలయం మూసేయాలని, పూజలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
Also Read: H3N2 Influenza Deaths: దేశంలో ఇన్ఫ్లుయెంజా కలకలం, ఇద్దరు మృతి - అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Ysrcp Meeting : రేపే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం, 45 మందిపై సీఎం అసంతృప్తి!
Heat Wave in India: ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, ఆ పది రాష్ట్రాలకు గండం - హెచ్చరించిన IMD
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్రైజర్స్ టార్గెట్ 204
Thalapathy Vijay in Insta : ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్
Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్