అన్వేషించండి

Mann Ki Baat: జాతీయ జెండాను సోషల్ మీడియా డీపీగా పెట్టుకోండి, దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

Mann Ki Baat: మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగష్టు 2-15వ తేదీ వరకూ జాతీయ జెండాను సోషల్ మీడియా డీపీగా పెట్టుకోవాలని సూచించారు.

Mann Ki Baat: 

ఆ తేదీల్లో అదే ప్రొఫైల్‌ పిక్‌గా ఉండాలి.. 

మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆగష్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని DPగా పెట్టుకోవాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా అందరూ ఇది ఆచరించాలని కోరారు. "ఆగష్టు 13-15 వరకూ హర్ ఘర్ తిరంగ ఉద్యమం చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే ఆగష్టు 2-15వ తేదీ వరకూ సోషల్ మీడియాలో అందరూ త్రివర్ణ పతాకాన్నే ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోండి" అని చెప్పారు ప్రధాని మోదీ. ఆగష్టు 2 వ తేదీకి, త్రివర్ణ పతాకానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు. "ఆగష్టు 2 వ తేదీన మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్బంగా ఆయనను నివాళినర్పిస్తున్నాను" అని వెల్లడించారు. ఇదే సమయంలో ఆజాదీ కీ రైల్‌గాడీ ఔర్ రైల్వే స్టేషన్ గురించి కూడా ప్రస్తావించారు. "స్వాతంత్య్రోద్యమంలో రైల్వే ఎలాంటికీలక  పాత్ర పోషించిందో ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశం" అని అన్నారు. ఈ మన్‌కీ బాత్ కార్యక్రమం జరగకముందు ప్రధాని మోదీ ఏ అంశంపై చర్చించాలనుకుంటున్నారో చెప్పండి అంటూ ప్రజలనే సూచనలు అడిగారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నమో యాప్‌ ద్వారా లేదా MyGov సైట్‌ ద్వారా ఈ సూచనలు చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని తన ట్విటర్‌లో షేర్ చేశారు.  

హర్ ఘర్ తిరంగ ఉద్యమం..

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ దేశ వాసులందరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. "హర్‌ ఘర్ తిరంగ" (Har Ghar Tiranga)ఉద్యమంలో భాగంగా ఈ పని చేయాలని కోరారు. 1947లో జులై 22వ తేదీన దేశ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. "దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, స్వేచ్ఛాయుత భారత పతాకాన్నిచూడాలని కలలు కన్న మహనీయులందరినీ తలుచుకోవాల్సిన సందర్భమిది. వారి స్ఫూర్తికి అనుగుణంగా, వారి కలలు నెరవేర్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో హర్‌ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని ఈ ఉద్యమం ఇంకా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్‌లు చేశారు. 

Also Read: Mark Zuckerberg Space Walk: అరుదైన ఘనత సాధించిన Facebook CEO మార్క్ జుకర్ బర్గ్, మెటావర్స్ లో స్పేస్ వాక్

Also Read: Hero Nikhil Controversial Comments: కార్తికేయ-2కు థియేటర్ల విషయంలో హర్ట్ అయిన హీరో నిఖిల్| ABP Desam

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.