అన్వేషించండి

Mann Ki Baat: జాతీయ జెండాను సోషల్ మీడియా డీపీగా పెట్టుకోండి, దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

Mann Ki Baat: మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగష్టు 2-15వ తేదీ వరకూ జాతీయ జెండాను సోషల్ మీడియా డీపీగా పెట్టుకోవాలని సూచించారు.

Mann Ki Baat: 

ఆ తేదీల్లో అదే ప్రొఫైల్‌ పిక్‌గా ఉండాలి.. 

మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆగష్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని DPగా పెట్టుకోవాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా అందరూ ఇది ఆచరించాలని కోరారు. "ఆగష్టు 13-15 వరకూ హర్ ఘర్ తిరంగ ఉద్యమం చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే ఆగష్టు 2-15వ తేదీ వరకూ సోషల్ మీడియాలో అందరూ త్రివర్ణ పతాకాన్నే ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోండి" అని చెప్పారు ప్రధాని మోదీ. ఆగష్టు 2 వ తేదీకి, త్రివర్ణ పతాకానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు. "ఆగష్టు 2 వ తేదీన మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్బంగా ఆయనను నివాళినర్పిస్తున్నాను" అని వెల్లడించారు. ఇదే సమయంలో ఆజాదీ కీ రైల్‌గాడీ ఔర్ రైల్వే స్టేషన్ గురించి కూడా ప్రస్తావించారు. "స్వాతంత్య్రోద్యమంలో రైల్వే ఎలాంటికీలక  పాత్ర పోషించిందో ప్రజలకు అవగాహన కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశం" అని అన్నారు. ఈ మన్‌కీ బాత్ కార్యక్రమం జరగకముందు ప్రధాని మోదీ ఏ అంశంపై చర్చించాలనుకుంటున్నారో చెప్పండి అంటూ ప్రజలనే సూచనలు అడిగారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నమో యాప్‌ ద్వారా లేదా MyGov సైట్‌ ద్వారా ఈ సూచనలు చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని తన ట్విటర్‌లో షేర్ చేశారు.  

హర్ ఘర్ తిరంగ ఉద్యమం..

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ దేశ వాసులందరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. "హర్‌ ఘర్ తిరంగ" (Har Ghar Tiranga)ఉద్యమంలో భాగంగా ఈ పని చేయాలని కోరారు. 1947లో జులై 22వ తేదీన దేశ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. "దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, స్వేచ్ఛాయుత భారత పతాకాన్నిచూడాలని కలలు కన్న మహనీయులందరినీ తలుచుకోవాల్సిన సందర్భమిది. వారి స్ఫూర్తికి అనుగుణంగా, వారి కలలు నెరవేర్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో హర్‌ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని ఈ ఉద్యమం ఇంకా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్‌లు చేశారు. 

Also Read: Mark Zuckerberg Space Walk: అరుదైన ఘనత సాధించిన Facebook CEO మార్క్ జుకర్ బర్గ్, మెటావర్స్ లో స్పేస్ వాక్

Also Read: Hero Nikhil Controversial Comments: కార్తికేయ-2కు థియేటర్ల విషయంలో హర్ట్ అయిన హీరో నిఖిల్| ABP Desam

 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget