By: Ram Manohar | Updated at : 22 Mar 2023 04:22 PM (IST)
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించారు. (Image Credits: ANI)
Innovation Centre in Delhi:
ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం..
ప్రధాని నరేంద్ర మోదీ Call Before u Dig (CBuD) యాప్ను ప్రారంభించారు. తవ్వకాలు జరిపే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా ఈ యాప్ ద్వారా కమ్యూనికేట్ అవచ్చు. ఈ యాప్ను లాంఛ్ చేసే క్రమంలోనే ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్దం టెక్నాలజీదేనని తేల్చి చెప్పారు. 6G గురించి కూడా ప్రస్తావించారు. ఢిల్లీలోని ఇన్నోవేషన్ సెంటర్నూ ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో 6G విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు మోదీ. 2028-29 నాటికి దేశంలో 6G సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
"ఈ దశాబ్దం అంతా టెక్నాలజీదే. 5G లాంచ్ చేసి ఆర్నెల్లు కూడా కాలేదు. ప్రజలు అప్పుడే 6G గురించి మాట్లాడుకుంటున్నారు. భారత్ ఆత్మవిశ్వాసానికి ఇదే నిదర్శనం. టెలికామ్ టెక్నాలజీలో కేవలం వినియోగదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతుల్లోనూ ముందంజలో నిలుస్తోంది. మన దేశంలోని టెలికాం రంగంపై అందరికీ నమ్మకం వచ్చింది. పారదర్శకంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 120 రోజుల్లోనే 125 సిటీల్లో 5G సేవలు మొదలయ్యాయి. త్వరలోనే మన దేశంలో 100 5G ల్యాబ్లు ఏర్పాటవుతాయి. ప్రజలను ఎంపవర్ చేసేందుకే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది."
- ప్రధాని నరేంద్ర మోదీ
Within 6 months of 5G, we are already talking about 6G technology. This shows the confidence of India: PM Narendra Modi
— ANI (@ANI) March 22, 2023
ఇదే సమయంలో G20 గురించీ మాట్లాడారు ప్రధాని మోదీ. డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని, ఈ విషయంలో మిగతా దేశాలకు మనం స్ఫూర్తిగా నిలుస్తున్నామని ప్రశంసించారు.
"G20 సదస్సుకి భారత్ నేతృత్వం వహించే రోజు వచ్చింది. ఇలాంటి కీలక తరుణంలో మా లక్ష్యం ఒకటే. ప్రాంతాల మధ్య అంతరాలను వీలైనంత వరకూ తగ్గించడం. దక్షిణ దేశాలన్నీ కొత్త టెక్నాలజీని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఢిల్లీలోని ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఇందులో ముఖ్య భూమిక పోషిస్తుంది. భారత్లో నెలకు 800 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. రోజుకి కనీసం 7 కోట్లు ఈ-అథెంటికేషన్లు అవుతున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.28 లక్షల కోట్లు ఆయా ఖాతాల్లో జమ అవుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ అన్ని దేశాలకూ స్ఫూర్తిగా నిలుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో భారత్దే పై చేయి"
- ప్రధాని నరేంద్ర మోదీ
Today, when India is presiding over the G20, one of our priorities is to reduce the regional divide. Global South is making major strides in bridging the technological divide. The ITU Area office and Innovation Centre will also play a key role in this: PM Narendra Modi pic.twitter.com/PrpfHL6IwO
— ANI (@ANI) March 22, 2023
For India, telecom technology is not just a mode of power but a mission to empower...India rolled out 5G connections in more than 125 cities within 120 days. India will set up 100 5G labs in the coming years: PM Narendra Modi pic.twitter.com/iMEYHxDKZT
— ANI (@ANI) March 22, 2023
Also Read: Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్పై ఈడీ వివరణ కోరిన కోర్టు
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
థాయ్ల్యాండ్లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!