అన్వేషించండి

వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేశారు, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి - మన్మోహన్ సింగ్‌పై ప్రధాని ప్రశంసలు

PM Modi: పదవీ కాలం ముగిసిన రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు.

PM Modi lauds Manmohan Singh: రాజ్యసభలో పదవీ కాలం ముగిసిన ఎంపీలకు వీడ్కోలు పలుకుతూ కీలక ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. వీల్‌చైర్‌లో నుంచి పరిపాలన అందించారని కొనియాడారు. 

"సభలో ఓటింగ్ జరిగినప్పుడు ట్రెజరీ బెంచ్‌ గెలుస్తుందని తెలిసినా మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేశారు. తన బాధ్యతల పట్ల ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. వీల్‌చైర్‌లో ఉండే ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. ఇవాళ ఆయనను కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అన్ని ఏళ్ల పాటు దేశానికి ఎనలేని సేవలు అందించారు. దేశాన్ని ఆయన నడిపించిన తీరు ప్రశంసనీయం. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, మాకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను"

- ప్రధాని నరేంద్ర మోదీ 

ఆరుసార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ దేశానికి 13వ ప్రధానిగానూ బాధ్యతలు చేపట్టారు. 2004-14 వరకూ పదేళ్ల పాటు ఆయన అదే పదవిలో ఉన్నారు. 1982-1985 మధ్య కాలంలో పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ పని చేశారు. RBI గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సభలో కీలక బిల్లుని ప్రవేశపెట్టింది. ఢిల్లీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో మన్మోహన్ సింగ్‌ వీల్‌చైర్‌లో హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ ఆయన వీల్‌చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందం వ్యక్తం చేశారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 

"మన్మోహన్ సింగ్‌ ఎన్నో మంచి పనులు చేశారు. ప్రధాని మోదీ ఆయనను ప్రశంసించడం చాలా సంతోషం. ప్రధానికి ధన్యవాదాలు. మంచిని పొగడాలి...చెడుని విమర్శించాలి. సభ ఇలా జరగాలని కోరుకుంటున్నాను"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Bruce Lee:  ఒక్క అంగుళంతో ప్రపంచాన్ని గెలిచిన యోధుడు!  బ్రూస్‌ లీ వన్-ఇంచ్ పంచ్ వెనుక రహస్యం ఏంటి..?
ది వన్-ఇంచ్ పంచ్: బ్రూస్‌లీని లెజెండ్‌గా మార్చిన ఒకే ఒక్క కిక్..! 
Fact Check: టాటా కంపెనీ కేవలం రూ.18 వేలకే హైబ్రిడ్ బైక్‌ తెచ్చిందా?, వైరల్ వార్తల వెనుకున్న నిజాలు బయటకు
టాటా హైబ్రిడ్ బైక్ ధర కేవలం రూ.18 వేలే! సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్‌ న్యూస్‌ నిజమేనా?
Embed widget