అన్వేషించండి

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది.

Independence Day 2022: 

ఆరోగ్య రంగానికి సంబంధించి కొత్త ప్రాజెక్ట్‌లు..? 

ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హెల్త్ సెక్టార్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. "హీల్ ఇన్ ఇండియా", హీల్‌ బై ఇండియా (Heal in India), (Heal by India) ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తారని సమాచారం. వీటితో పాటు 2047 నాటికి దేశంలో సికిల్‌ సెల్ వ్యాధి నిర్మూలించాలనే లక్ష్యాన్నీ నిర్దేశిస్తారని కొందరు అధికారులు చెబుతున్నారు. సర్వికల్ క్యాన్సర్‌ను అరికట్టేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌నూ...నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ ( National Immunisation Programme)లో చేర్చటం, నేషనల్ హెల్త్ మిషన్‌ను విస్తృతం చేస్తూ కొత్తగా "పీఎం సమగ్ర స్వాస్థ్య మిషన్"(PM Samagra Swasthya Mission) గా పేరు మార్చే ప్రకటనలు చేసే అవకాశముంది. మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజంకు భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు హీల్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. 12 రాష్ట్రాల్లోని 37 ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తారని ప్రభుత్వ అధికారులు కొందరు వివరిస్తున్నారు. హీల్ ఇన్ ఇండియాలో భాగంగా...10 విమానాశ్రయాల వద్ద స్పెషల్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ పేషెంట్ల కోసం వీసా నిబంధనలు సులభతరం చేయటం మరో కీలక అంశం. కొన్ని ప్రభుత్వ అధికారిక వర్గాలు పీటీఐకి ఈ వివరాలు వెల్లడించారు.

 

ఈ ప్రకటనలూ ఉంటాయా..? 

ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సార్క్, గల్ఫ్ సహా 44 దేశాల నుంచి పెద్ద ఎత్తున రోగులు భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నట్టు కేంద్రం గుర్తించింది. ఆయా దేశాల్లో వైద్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి..? అక్కడ ఎంత ఖర్చవుతోంది అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుని "హీల్ ఇన్ ఇండియా" ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. ఇక హీల్‌ బై ఇండియాలో భాగంగా...ఆరోగ్య రంగంలో భారత్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది కేంద్రం. నిపుణుల సంఖ్యను పెంచి అంతర్జాతీయ పోటీలో నెంబర్‌ వన్‌ గా నిలపాలని చూస్తోంది. ఇందుకోసం ఆరోగ్య శాఖ ఆన్‌లైన్‌లో డేటా పొందుపరచనుంది. ఇందులో హెల్త్‌కేర్ నిపుణులు, వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్‌ల వివరాలు ఇందులో పొందు పరుస్తారు. వారి ఇష్టానికి అనుగుణంగా ఆయా దేశాలకు వైద్య సేవలు అందించే అవకాశముంటుంది. జిల్లా స్థాయిలో కేర్ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేషనల్ హెల్త్ మిషన్‌ను విస్తృతం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య రంగానికి కేటాయించే వనరుల్లో 5% మేర ఈ కేర్ ఆసుపత్రులకే కేటాయించనున్నట్టు సమాచారం. ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ భాగస్వామ్యంతో 2047 నాటికి దేశంలో సికిల్ సెల్‌ వ్యాధిని నిర్మూలించేందుకు రోడ్‌ మ్యాప్ తయారు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 40 ఏళ్ల లోపు ఉన్న 7 కోట్ల మందిని పరీక్షించనున్నారు. 17 రాష్ట్రాల్లోని 200 జిల్లాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. 9-14 ఏళ్ల మధ్యలో ఉన్న బాలికలకు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ అన్ని అంశాలపైనా ప్రధాని మోదీ ప్రకటనలు చేస్తారని చెబుతున్నారు. 

Also Read: Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?

Also Read: UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP DesamLSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP DesamCSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Abhishek Sharma : అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- హైదరాబాద్‌ ఆటగాడి ముందు రికార్డులు దాసోహం
అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- హైదరాబాద్‌ ఆటగాడి ముందు రికార్డులు దాసోహం
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
Arjun Son Of Vyjayanthi Trailer: ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా? - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ అదుర్స్
Embed widget