అన్వేషించండి

pegasus supreme court : విచారణ కాదు పరిశీలన.. పెగాసస్‌పై సుప్రీంకు తెలిపిన కేంద్రం

పెగాసస్ నిఘా వ్యవహారంలో నిపుణులతో పరిశీలన చేయిస్తామని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆరోపణలకు ఆధారాలు లేవని ప్రకటించింది.


పెగాసస్‌పై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించకుండా కేంద్ర ప్రభుత్వం మధ్యే మార్గాన్ని కనిపెట్టింది. పెగాసస్ నిఘా విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన నిఘా ఆరోపణలకు ఒక్కటంటే ఒక్క ఆధారం లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నామని..  మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇవన్నీ కుట్ర పూరితంగా చేసిన ప్రచారాలని.. అందుకే ఆ అంశంపై ఉన్న అనుమానాలన్నింటినీ తొలగించేందుకు నిపుణుల కమిటీన ఏర్పాటు చేస్తామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. 
 
పెగాసస్ నిఘా వ్యవహారం బయటపడిన తర్వాత రాజకీయ దుమారం రేగింది. విచారణ కోసం విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు కూడా అదే కోరుతున్నాయి. పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టాయి. కేంద్రం మాత్రం పెగాసస్ పై విచారణకు అంగీకరించడం లేదు. దేశ సమగ్రతకు భంగం కలిగించే నిఘా ఎవరు పెట్టారో తేల్చాలని నిందితులకు శిక్షలు పడాలని..  విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   "పెగాసస్‌" సాఫ్ట్‌వేర్ సాయంతో దేశంలో కనీసం మూడు వందల మంది ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది  రాజ్యాంగ ఉల్లంఘన.. వ్యక్తిగత స్వేచ్చపై దాడి వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనన్న డిమాండ్లు విపక్ష పార్టీలు చేశాయి.  ఎడిటర్స్ గిల్డ్ వంటి సంస్థలు కూడా.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరాయి. 

ప్రముఖ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.  సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై సీరియస్‌గా స్పందించింది. గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని వ్యాఖ్యానించింది.  కేంద్ర ప్రభుత్వం మాత్రం.. వీలైనంత వరకూ ఈ "పెగాసస్‌" వ్యవహారాన్ని  తక్కువ చర్చకు పరిమితం చేయాలనుకుంటోంది. దర్యాప్తు అనే మాట వినడానికి కూడా సిద్ధపడ లేదు.   "పెగాసస్‌" వ్యవహారంపై అందరి వేళ్లూ.. కేంద్రం వైపునే చూపిస్తున్నాయి. దీంతో నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కేంద్రంపైనే పడింది. తప్పించుకుంటే.. కేంద్రంపై మరిన్ని అనుమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టులో .. మధ్యే మార్గంలో విచారణ కాకండా పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది.  మంగళవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.  

సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా విపక్ష పార్టీలు మాత్రం విచారణకు పట్టు బట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బయటకు చెబుతున్న అంశాల కన్నా.. అనేకం దాచి పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. కేంద్రం విచారణ చేయించకుండా పరిశీలనతో సరి పెడితే.. విమర్శలు అలాగే ఉంటాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Kakinada Fire Cracker Explosion: బాణసంచా పేలుడు బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్
బాణసంచా పేలుడు బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్
Iran Attack Videos: ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్ - గగనతలం మూసివేత - వైరల్ అవుతున్న వీడియోలు
ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్ - గగనతలం మూసివేత - వైరల్ అవుతున్న వీడియోలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Embed widget