అన్వేషించండి

Pakistan economic crisis: ఒక్క సిలిండర్ ధర పది వేలు, బ్రెడ్డు కూడా కొనలేని గడ్డుకాలం - మరో శ్రీలంకలా పాకిస్థాన్

Pakistan economic crisis: పాకిస్థాన్‌ ఆర్థికంగా దారుణంగా పతనమైంది.

Pakistan Economic Crisis:

15 కిలోల పిండి రూ.2,050. 
బ్రెడ్ ప్యాకెట్ రూ.200
లీటర్ పాలు రూ.190
కిలో టమాటా రూ.240
లీటర్ ఆయిల్ రూ.580
సిలిండర్ ధర రూ.10,000

అప్పుల కుప్పలు..

చూస్తుంటేనే దిమ్మ తిరిగిపోతోంది కదా. ఈ ధరల పట్టిక శ్రీలంకలోది కాదు. మన దాయాది దేశం పాక్‌లోది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోయింది పాకిస్థాన్. కరెంట్ బిల్స్ కట్టలేక దేశంలోని చాలా చోట్ల షాపింగ్ మాల్స్‌ని బంద్ చేయించింది ప్రభుత్వం. అంతే కాదు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కడా విద్యుత్‌ని  వాడడం లేదు. పిండి, చక్కెర, నెయ్యి..ఇలా ఏది కొందామన్నా ధరలు భగ్గుమంటున్నాయి. తీసుకున్న అప్పులు కట్టలేక, కొత్త అప్పు పుట్టక నానా అవస్థలు పడుతోంది పాకిస్థాన్‌. ఇక విదేశీ మారక నిల్వలూ అడుగంటుతున్నాయి. రాజకీయ అనిశ్చితి ఇప్పటికే కొనసాగుతోంది. జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ మధ్యే పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం 1,167 ఖాళీలకు ఎగ్జామ్ పెడితే...30 వేల మంది హాజరయ్యారు. కాలేజీల్లో చోటు సరిపోక ఓ స్టేడియంలో ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. 
అంటే...అక్కడి యువత ఉద్యోగాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. పాక్ తన ఎంబసీ కార్యాలయాన్ని అమెరికాకు అమ్ముకునేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశ పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇదొక్కటే కాదు. ఇంకెన్నో ఉదాహరణలున్నాయి. 

ఇవీ కారణాలు..

పాక్ ప్రజలు కనీస సౌకర్యాలకూ అల్లాడిపోతున్నారు. మ్యారేజ్‌ హాల్స్‌, మార్కెట్‌లు, వ్యాపార సముదాయాలు అన్నీ బంద్ చేశారు. ఇక చమురు ధర కూడా అక్కడి ప్రజలకు చురకలు అంటిస్తోంది. చమురు వినియోగం కోసం దిగుమతులపైనే ఆధార పడుతోంది పాక్. ఫలితంగా...పెట్రో ధరలూ మండి పోతున్నాయి. అన్ని ఆఫీస్‌ల్లో విద్యుత్ వినియోగాన్ని 30% వరకూ తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశీ మారక నిల్వలు అనూహ్య స్థాయిలో పడిపోయాయి. దాదాపు 6.7 బిలియన్ డాలర్ల మేర కోత పడింది. పాక్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనా కూడా ఈ మధ్య కాలంలో వెనక్కి తగ్గింది. ఫలితంగా...పరిస్థితులు మరింత దిగజారాయి. రాజకీయంగానూ స్థిరత్వం లేకపోవడం మరో సవాలు. విద్యుత్‌ని ఆదా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాత్రి 8.30గంటల కల్లా మార్కెట్‌లు బంద్ చేయాలని ఆదేశించింది. కొన్ని చోట్ల మాత్రమే మ్యారేజ్‌ హాల్స్‌కు అనుమతి ఇస్తున్నారు.

ఇక ఫ్యాన్‌లు, లైట్‌లు వెలగడంపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఏడాది జులై వరకూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. వీధి దీపాలూ వెలగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలూ అందడం లేదు. పేదరికంతో విలవిలలాడుతున్నారు ప్రజలు. రెండేళ్లలో పేదల సంఖ్య 35.7% మేర పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో 92వ స్థానంలో ఉంది పాక్. అమెరికన్ డాలర్‌తో పోల్చి చూస్తే పాకిస్థాన్ కరెన్సీ రూ. 49.31కి పడిపోయింది. ద్రవ్యోల్బణం 30-40% మధ్యలో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాక్‌...కొవిడ్ తరవాత మరింత పతనమైంది. ప్రజల ఆదాయం పడిపోయింది. చెల్లింపులు తగ్గిపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రభావం చూపించింది. దిగుమతుల వ్యయం పెరిగిపోయింది. ముఖ్యంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఆహార అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటమూ ఇబ్బందికరంగా మారింది. ట్రేడ్ డెఫిసిట్ 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 16% మేర పడిపోయాయి. ఈ సమస్యల వల్ల పాకిస్థాన్‌కు దుర్భర స్థితిలో ఉంది. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. 

Also Read: Air India Urination Case: విమానంలో మహిళపై యూరినేట్ చేసిన వ్యక్తి అరెస్ట్, ఢిల్లీ పోలీసుల పక్కా స్కెచ్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget