అన్వేషించండి

ఆకలితో అలమటిస్తుంటే దీపావళి చేసుకోమంటారా - ప్రధాని మోదీపై ప్రతిపక్షాల ఆగ్రహం

Shri Ram Jyoti: జనవరి 22న దేశమంతా దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలువునివ్వడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.

Ayodhya Ram Mandir Opening:

శ్రీరామ జ్యోతి..

వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించారు. అక్కడ అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్‌తో పాటు కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న జరిగే కార్యక్రమానికి అందరూ హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. అందుకే...దేశ ప్రజలంతా తమ ఇళ్లలోనే దీపాలు వెలిగించి (Shri Ram Jyoti) భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోజు మరోసారి దీపావళి జరుపుకోపాలని అన్నారు. ఆ రోజు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముందని..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే...ఈ వేడుక ముగిసిన తరవాత కాస్త రద్దీ తగ్గుతుందని అప్పుడు అందరూ వచ్చి రాముడి దర్శనం చేసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించి రాముడికి నీరాజనం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతే కాదు మకర సంక్రాంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను శుభ్రం చేసుకోవాలని కోరారు. దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. రామ మందిర నిర్మాణాన్ని ఇప్పటికే బీజేపీ రాజకీయం చేస్తోందని మండి పడుతున్న ప్రతిపక్షాలు. దీనికి తోడు దీపావళి చేసుకోవాలని మోదీ చెప్పడంపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌ ప్రతినిధి X వేదికగా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఓ వైపు దేశంలో చాలా మంది పౌరులు ఆకలితో అలమటిస్తుంటే ఇలాంటివి అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు. 

"భారత్‌లో 97 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం లేదు. లక్షలాది మందికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది మంది మురికి వాడల్లోనే ఉంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అఛ్చేదిన్ పేరుతో సెల్ఫీ బూత్‌లు పెడుతున్నారు"

- తృణమూల్ కాంగ్రెస్ నేత 

రాముడి పేరుతో రాజకీయాలు: అధిర్ రంజన్ 

హైస్పీడ్ రైళ్లను తీసుకొచ్చినంత మాత్రాన సరిపోదని, ప్రయాణికుల భద్రతపైనా దృష్టి పెట్టాలని మండి పడుతున్నాయి ప్రతిపక్షాలు. అయోధ్యలో ప్రధాని 6 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన నేపథ్యంలో ఈ విమర్శలు చేశాయి. ప్రతి మతానికీ గౌరవం ఇవ్వాలన్న ప్రాథమిక సూత్రాన్ని బీజేపీ మరిచిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మతాన్ని, రాజకీయాన్ని కలుపుతున్నారని అన్నారు. రాముడి పేరుతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

అయోధ్యలో పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరవాత ఓ సభలో పాల్గొన్నారు. అయోధ్య ప్రజలు తనకు ఘన స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వందల సంవత్సరాల కల జనవరిలో నెరవేరబోతుందని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలలాగే తానూ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. జనవరి 22న జరిగే ఆ మహత్తర  ఘట్టం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని అన్నారు. ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందని స్పష్టం చేశారు. 

Also Read: Mann Ki Baat: అయోధ్య రాముడి కోసం భజనలు చేయండి, భక్తిని చాటుకోండి - మన్‌కీ బాత్‌లో ప్రధాని

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
CM Chandrababu: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
CM Chandrababu: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
CM Chandrababu: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
CM Chandrababu: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
Betting Apps Promotion Case: విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
Embed widget