By: Ram Manohar | Updated at : 12 Apr 2023 03:27 PM (IST)
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖర్గేతో భేటీ అయ్యారు.
Nitish Kumar Kharge Meet:
విపక్షాల ఐక్యత..
విపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశమయ్యారు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్తో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సమావేశం ముగిసిన తరవాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదో చరిత్రాత్మక భేటీ అని, ఎన్నో సమస్యలపై చర్చ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఒక్కటిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
"ఇవాళ చరిత్రాత్మక సమావేశం జరిగింది. చాలా సమస్యలు చర్చించాం. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
#WATCH | Today we had a historic meeting here and discussed many issues. We all have decided to unite all (opposition) parties and fight the upcoming elections unitedly: Congress President Mallikarjun Kharge pic.twitter.com/ds4ljcHsBZ
— ANI (@ANI) April 12, 2023
ఈ భేటీపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్పందించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో తమ వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు.
"వీలైనంత వరకూ అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. కలిసి కట్టుగా ముందుకెళ్లి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాం"
- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
#WATCH | "We will try to unite as many political parties as we can and move forward together," says Bihar CM Nitish Kumar pic.twitter.com/Qfa5LRPxYU
— ANI (@ANI) April 12, 2023
ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం అంతా ఒక్కటిగా నిలబడతామని తెలిపారు. విపక్షాలను ఏకం చేసేందుకు ఇదో కీలక అడుగుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
"ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు ఇదో కీలక అడుగుగా భావిస్తున్నాం. ప్రతిపక్షాల విజన్ ఏంటో త్వరలోనే వెల్లడిస్తాం. ఆ విజన్తోనే కలిసికట్టుగా ముందుకెళ్తాం. దేశం కోసం నిలబడతాం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
#WATCH | This is a historic step to unite the opposition. We will develop the vision of the opposition parties and move forward; we will all stand together for the country: Congress leader Rahul Gandhi pic.twitter.com/S5iEupslzL
— ANI (@ANI) April 12, 2023
స్టాలిన్తోనూ మైత్రి..
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. విపక్షాలు ఒకేతాటిపైకి రావడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న కాంగ్రెస్...క్రమంగా అన్ని పార్టీలతో మైత్రి పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే...కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు కాల్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు రావాలని ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలో ఓ సారి సమావేశం జరిగింది. ఈ సారి ఖర్గే ఆధ్వర్యంలో భేటీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో డీఎమ్కేతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. జాతీయ స్థాయిలోనూ ఇదే విధంగా కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read: Delhi Liquor Scam: విచారణలో ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Coin Deposit: బ్యాంక్ అకౌంట్లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Andhra Politics : వైఎస్ఆర్సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?