అన్వేషించండి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana Government News: కాంగ్రెస్‌ ప్రభుత్వం సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Nirmal BJP MLA Maheshwar Reddy: నిర్మల్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం సభ సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్లనే బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేరని మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో ఎంఐఎం, బీజేపీ దోస్తులని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని, ప్రస్తుతం ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే రక్తమని, మూడు పార్టీలు ఒకే నావపై ప్రయాణం చేస్తున్నాయి ఎద్దేవా చేశారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని కించపరిచిన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ నియమించడాన్ని సహచర సభ్యుడు రాజాసింగ్ వ్యతిరేకించారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రొటెం స్పీకర్ నియమించడంపై వ్యతిరేకించి అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

ఈ నెల 14న దళిత బిడ్డ, స్పీకర్ గా నియమితులైన ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గ చరిత్ర ఎన్నడూ లేని విధంగా 51 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని సమస్యల పరిష్కారానికి దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తో ఊహించని అభివృద్ధి జరిగేదన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ఆశయాలకు అనుగుణంగా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. 
అవినీతి బయటకు తీస్తాం..
నిర్మల్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డీ1 పట్టాలు చేసిన జాబితా సిద్ధంగా ఉందని, ఒక్కొక్కటి బయటకు తీస్తామన్నారు. పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, దీనిపై కమిషన్ వేసి నిజానిజాలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. భూ అక్రమలపై అసెంబ్లీలో గళమెత్తుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసపూరిత మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే హర్షిస్తామని, లేనట్లయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రావుల రామ్ నాథ్, మెడిసెమ్మ రాజు, చందు, ముత్యం రెడ్డి, అర్జున్, జమాల్, వెంకటేష్, రాచకొండ సాగర్, శంకర్ పతి, కొండాజీ శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
Top Automatic Cars Under 6 Lakhs: 6 లక్షల బడ్జెట్ లో టాప్ ఆటోమేటిక్ కార్లు: సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ఇక చాలా ఈజీ.. బెస్ట్ మైలేజ్, మోస్ట్ ఎఫోర్డబుల్ 
6 లక్షల బడ్జెట్ లో టాప్ ఆటోమేటిక్ కార్లు: సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ఇక చాలా ఈజీ.. బెస్ట్ మైలేజ్, మోస్ట్ ఎఫోర్డబుల్ 
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget