అన్వేషించండి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana Government News: కాంగ్రెస్‌ ప్రభుత్వం సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Nirmal BJP MLA Maheshwar Reddy: నిర్మల్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం సభ సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్లనే బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేరని మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో ఎంఐఎం, బీజేపీ దోస్తులని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని, ప్రస్తుతం ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే రక్తమని, మూడు పార్టీలు ఒకే నావపై ప్రయాణం చేస్తున్నాయి ఎద్దేవా చేశారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని కించపరిచిన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ నియమించడాన్ని సహచర సభ్యుడు రాజాసింగ్ వ్యతిరేకించారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రొటెం స్పీకర్ నియమించడంపై వ్యతిరేకించి అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

ఈ నెల 14న దళిత బిడ్డ, స్పీకర్ గా నియమితులైన ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గ చరిత్ర ఎన్నడూ లేని విధంగా 51 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని సమస్యల పరిష్కారానికి దశలవారీగా పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తో ఊహించని అభివృద్ధి జరిగేదన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ఆశయాలకు అనుగుణంగా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. 
అవినీతి బయటకు తీస్తాం..
నిర్మల్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డీ1 పట్టాలు చేసిన జాబితా సిద్ధంగా ఉందని, ఒక్కొక్కటి బయటకు తీస్తామన్నారు. పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, దీనిపై కమిషన్ వేసి నిజానిజాలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. భూ అక్రమలపై అసెంబ్లీలో గళమెత్తుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసపూరిత మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే హర్షిస్తామని, లేనట్లయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రావుల రామ్ నాథ్, మెడిసెమ్మ రాజు, చందు, ముత్యం రెడ్డి, అర్జున్, జమాల్, వెంకటేష్, రాచకొండ సాగర్, శంకర్ పతి, కొండాజీ శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  
PM Modi vs Mete: ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపండి, చర్యలు తీసుకోవద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపండి, చర్యలు తీసుకోవద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget