అన్వేషించండి

NGT Fire on AP Govt : పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టులా..? మరోసారి ఎన్జీటీ ఆగ్రహం..!

పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పోలవరం ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా నిర్మించడంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


పర్యావరణ అనుమతులు లేకుండా  ప్రభుత్వమే ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. ఏపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేసింది. పోలవరంతో పాటు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీవలో విచారణ జరిగింది. గతంలోనే వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి లోపించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పట్టిసీమ, పురుషోత్తమట్నంలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషన్లు..! 

పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు విషయంపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. మూడేళ్ల నుంచి అక్కడ ముంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా  ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కేసు ముగించాలన్న ఆత్రుతలోనే ఉంది కనీ పర్యావరణంపై పట్టింపు లేదని మండిపడింది. పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్మించింది. ఉత్తరాంధ్రకు...విశాఖకు మంచినీటిని తరలించేందుకు  పురుషోత్తమ పట్నం ప్రాజెక్టును  కూడా గత ప్రభుత్వమే నిర్మించింది. 

ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గండం..! 

ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలు కావడంతో వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని...  జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతలకూ ఇదే తరహా ఎన్జీటీ చిక్కులు వచ్చాయి. ఈ అంశంపై చెన్నై బెంచ్‌లో ప్రస్తుతం పిటిషన్లు ఉన్నాయి. సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ సహకరించకపోతూండటంతో పరిశీలన జరగడం లేదు. 

చర్యలు తీసుకుంటామన్న ఎన్జీటీ..!

ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారం.. పోలవరంలో.. అంతర్భాగంగానే..పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించారు. పోలవరం అందుబాటులోకి వచ్చిన వెంటనే... ఆ ప్రాజెక్టుల అవసరం తీరిపోతుంది. అందుకే పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం ద్వారా వాడుకోవాల్సిన నీటిని  పట్టిసీమ ద్వారా ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి ఆ ప్రాజెక్టులను నిర్మిచామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎన్జీటీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల భవితవ్యం.. బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget