By: ABP Desam | Updated at : 09 Aug 2021 02:31 PM (IST)
ఎన్జీటీ కార్యాలయం ( ఫైల్ ఫోటో )
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రభుత్వమే ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. ఏపీ సర్కార్పై అసహనం వ్యక్తం చేసింది. పోలవరంతో పాటు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీవలో విచారణ జరిగింది. గతంలోనే వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి లోపించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పట్టిసీమ, పురుషోత్తమట్నంలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషన్లు..!
పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు విషయంపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. మూడేళ్ల నుంచి అక్కడ ముంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కేసు ముగించాలన్న ఆత్రుతలోనే ఉంది కనీ పర్యావరణంపై పట్టింపు లేదని మండిపడింది. పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్మించింది. ఉత్తరాంధ్రకు...విశాఖకు మంచినీటిని తరలించేందుకు పురుషోత్తమ పట్నం ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వమే నిర్మించింది.
ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గండం..!
ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలు కావడంతో వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని... జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతలకూ ఇదే తరహా ఎన్జీటీ చిక్కులు వచ్చాయి. ఈ అంశంపై చెన్నై బెంచ్లో ప్రస్తుతం పిటిషన్లు ఉన్నాయి. సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ సహకరించకపోతూండటంతో పరిశీలన జరగడం లేదు.
చర్యలు తీసుకుంటామన్న ఎన్జీటీ..!
ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారం.. పోలవరంలో.. అంతర్భాగంగానే..పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించారు. పోలవరం అందుబాటులోకి వచ్చిన వెంటనే... ఆ ప్రాజెక్టుల అవసరం తీరిపోతుంది. అందుకే పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ద్వారా వాడుకోవాల్సిన నీటిని పట్టిసీమ ద్వారా ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి ఆ ప్రాజెక్టులను నిర్మిచామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎన్జీటీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల భవితవ్యం.. బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Viral News : టీవీ పెట్టిన చిచ్చు, రీఛార్జ్ చేయించలేదని విడాకులు కోరిన భార్య!
BJP Meeting : కాషాయ ఫైర్ బ్రాండ్స్, నోరు విప్పారో మాటల తూటాలే!
Viral Video : సాఫ్ట్వేర్ కన్నా స్పీడ్ - ఈ రైల్వే ఎంప్లాయి ఇప్పుడు సోషల్ మీడియాకు హాట్ ఫేవరేట్
Congress Internal Fight : టీకాంగ్రెస్ లో చిచ్చురేపిన యశ్వంత్ సిన్హా పర్యటన, మళ్లీ రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి
Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
Jagan Daughter Harsha : కుమార్తె విజయంపై సంతోషం - ప్యారిస్ నుంచి సీఎం జగన్ ట్వీట్ వైరల్