అన్వేషించండి

NGT Fire on AP Govt : పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టులా..? మరోసారి ఎన్జీటీ ఆగ్రహం..!

పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పోలవరం ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా నిర్మించడంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


పర్యావరణ అనుమతులు లేకుండా  ప్రభుత్వమే ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. ఏపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేసింది. పోలవరంతో పాటు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీవలో విచారణ జరిగింది. గతంలోనే వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి లోపించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పట్టిసీమ, పురుషోత్తమట్నంలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషన్లు..! 

పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు విషయంపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. మూడేళ్ల నుంచి అక్కడ ముంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా  ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కేసు ముగించాలన్న ఆత్రుతలోనే ఉంది కనీ పర్యావరణంపై పట్టింపు లేదని మండిపడింది. పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్మించింది. ఉత్తరాంధ్రకు...విశాఖకు మంచినీటిని తరలించేందుకు  పురుషోత్తమ పట్నం ప్రాజెక్టును  కూడా గత ప్రభుత్వమే నిర్మించింది. 

ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గండం..! 

ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలు కావడంతో వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని...  జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతలకూ ఇదే తరహా ఎన్జీటీ చిక్కులు వచ్చాయి. ఈ అంశంపై చెన్నై బెంచ్‌లో ప్రస్తుతం పిటిషన్లు ఉన్నాయి. సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ సహకరించకపోతూండటంతో పరిశీలన జరగడం లేదు. 

చర్యలు తీసుకుంటామన్న ఎన్జీటీ..!

ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారం.. పోలవరంలో.. అంతర్భాగంగానే..పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించారు. పోలవరం అందుబాటులోకి వచ్చిన వెంటనే... ఆ ప్రాజెక్టుల అవసరం తీరిపోతుంది. అందుకే పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం ద్వారా వాడుకోవాల్సిన నీటిని  పట్టిసీమ ద్వారా ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి ఆ ప్రాజెక్టులను నిర్మిచామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎన్జీటీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల భవితవ్యం.. బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget