అన్వేషించండి

NGT Fire on AP Govt : పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టులా..? మరోసారి ఎన్జీటీ ఆగ్రహం..!

పట్టిసీమ, పురుషోత్తమపట్నం, పోలవరం ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా నిర్మించడంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


పర్యావరణ అనుమతులు లేకుండా  ప్రభుత్వమే ప్రాజెక్టులు చేపట్టడం ఏమిటని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. ఏపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేసింది. పోలవరంతో పాటు పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీవలో విచారణ జరిగింది. గతంలోనే వీటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలికి లోపించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పట్టిసీమ, పురుషోత్తమట్నంలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషన్లు..! 

పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు విషయంపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. మూడేళ్ల నుంచి అక్కడ ముంపు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా  ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కేసు ముగించాలన్న ఆత్రుతలోనే ఉంది కనీ పర్యావరణంపై పట్టింపు లేదని మండిపడింది. పట్టిసీమ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్మించింది. ఉత్తరాంధ్రకు...విశాఖకు మంచినీటిని తరలించేందుకు  పురుషోత్తమ పట్నం ప్రాజెక్టును  కూడా గత ప్రభుత్వమే నిర్మించింది. 

ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గండం..! 

ఈ రెండింటికీ పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్లు దాఖలు కావడంతో వాటిని నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని...  జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతలకూ ఇదే తరహా ఎన్జీటీ చిక్కులు వచ్చాయి. ఈ అంశంపై చెన్నై బెంచ్‌లో ప్రస్తుతం పిటిషన్లు ఉన్నాయి. సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ సహకరించకపోతూండటంతో పరిశీలన జరగడం లేదు. 

చర్యలు తీసుకుంటామన్న ఎన్జీటీ..!

ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారం.. పోలవరంలో.. అంతర్భాగంగానే..పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించారు. పోలవరం అందుబాటులోకి వచ్చిన వెంటనే... ఆ ప్రాజెక్టుల అవసరం తీరిపోతుంది. అందుకే పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం ద్వారా వాడుకోవాల్సిన నీటిని  పట్టిసీమ ద్వారా ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి ఆ ప్రాజెక్టులను నిర్మిచామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎన్జీటీ ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల భవితవ్యం.. బాధ్యులైన వారిపై తీసుకునే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget