అన్వేషించండి

Nepal Currecy Note: భారత్‌ భూభాగంలోని ప్రాంతాలతో నేపాల్ కరెన్సీ నోటు, స్పందించిన జైశంకర్

Nepal Currency: నేపాల్ కొత్త కరెన్సీ నోటుపై భారత భూభాగంలోని ప్రాంతాల మ్యాప్ ఉండడం సంచలనం అవుతోంది.

Nepal Currency Row: నేపాల్ కొత్తగా తీసుకొచ్చిన రూ.100 కరెన్సీ నోటు భారత్, నేపాల్ మధ్య కొత్త (Nepal New Currency Note) వివాదానికి దారి తీసింది. ఆ నోటుపై ఉన్న నేపాల్ మ్యాప్‌లో కొన్ని భారత్‌ భూభాగంలోని ప్రాంతాలూ ఉన్నాయి. మూడు వివాదాస్పద ప్రాంతాలు తమవే అన్నట్టుగా మ్యాప్‌లో కలిపేసుకుంది నేపాల్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక మైత్రిపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న చర్చ మొదలైంది. ఈ మ్యాప్ ద్వారా (Lipulekh) లిపులేఖ్, లింపియదుర, కాలాపనీ ప్రాంతాలు తమ భూభాగంలోనివే అని పరోక్షంగా నేపాల్‌ తేల్చి చెప్పింది. నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచండ నేతృత్వంలో కేబినేట్ మీటింగ్ జరగ్గా..అందులోనే ఈ కరెన్సీ నోటు ముద్రణకు ఆమోదం తెలిపారు. పాత మ్యాప్‌ స్థానంలో ఈ కొత్త మ్యాప్‌ని ప్రింట్ చేసేందుకు అంగీకరించారు. నిజానికి 2020 జూన్‌లోనే నేపాల్ తమ దేశ మ్యాప్‌లో మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగానే లిపులేఖ్, కాలాపానీ సహా లింపియదుర ప్రాంతాలను తమ టెరిటరీలో కలుపుకుంది. అలా కొత్త మ్యాప్‌ని ప్రింట్ చేయించింది. దీనిపై అప్పుడే భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యని ఖండించింది. అయితే...ఇప్పుడు ఏకంగా కరెన్సీ నోటుపైనా ప్రింట్ చేయడం సంచలనమైంది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని అనవసరంగా చెడగొట్టద్దు అని తేల్చి చెప్పారు. అయితే...ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవని, ఏదేమైనా నిజాన్ని మాత్రం మార్చలేరని స్పష్టం చేశారు. 

"ఈ సమాచారం నాకు తెలిసింది. పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. కానీ ఈ విషయంలో భారత్‌ స్టాండ్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. సరిహద్దు వివాదాలపై నేపాల్‌తో చర్చలు జరుగుతున్నాయి. చర్చల మధ్యలో ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోడం సరికాదు. ఇలాంటివి చేయడం ద్వారా నిజాలను మార్చలేరు"

- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

2020లో ఎప్పుడైతే నేపాల్ మ్యాప్ అప్‌డేట్ అయిందో అప్పటి నుంచే రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. అన్ని కొలతలు తీసుకున్న తరవాతే అవి తమ దేశంలో భాగమే అని గుర్తించామని నేపాల్ వాదిస్తోంది. 2020లో మే నెలలో కైలాశ్ మానససరోవర్‌కి లిపులేఖ్‌ మీదుగా రోడ్‌ని భారత్ నిర్మించడాన్ని నేపాల్ తప్పుబట్టింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. 

Also Read: Gaza News: గాజా నుంచి వెళ్లిపోండి, లేకపోతే యుద్ధం ఆపే ప్రసక్తే లేదు - ఇజ్రాయేల్‌కి హమాస్ హెచ్చరిక

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Iran reverse attack: ఇరాన్ రివర్స్ ఎటాక్ ప్రారంభం - ఒకే సారి ఎనిమిది దేశాలపైకి మిస్సైళ్లు - మూడో ప్రపంచ యుద్ధమే !
ఇరాన్ రివర్స్ ఎటాక్ ప్రారంభం - ఒకే సారి ఎనిమిది దేశాలపైకి మిస్సైళ్లు - మూడో ప్రపంచ యుద్ధమే !
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Iran America War Gold Prices Effect: ఉఫ్.. ఇక బంగారం ధరలకు పట్టపగ్గాలుండవు - ఎంత పని చేశావు ట్రంప్ !
ఉఫ్.. ఇక బంగారం ధరలకు పట్టపగ్గాలుండవు - ఎంత పని చేశావు ట్రంప్ !

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget