అన్వేషించండి

కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ, తరచూ ఎవరో ఒకరు అదృశ్యం

Kota News: రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి అదృశ్యమవడం సంచలనమవుతోంది.

Student Goes Missing in Kota: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు (Kota Studnets Missing) అదృశ్యమవుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ముగ్గురు ఇలానే మిస్ అయ్యారు. ఇప్పుడు మరో విద్యార్థి కూడా కనిపించకకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. NEET ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న 20 ఏళ్ల తృప్తి సింగ్ అదృశ్యమైంది. యూపీకి చెందిన ఈ యువతి దాదాపు 8 రోజులుగా కనిపించడం లేదు. మూడు రోజుల కిందట పోలీస్‌ కంప్లెయింట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె హాస్టల్‌ పరిసరాల్లోని CC కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. NEET ప్రిపరేషన్‌ కోసం గతేడాది కోటాకి వచ్చిన తృప్తి సింగ్ ఓ పీజీలో ఉంటోంది. ఏప్రిల్ 21వ తేదీన పీజీ నుంచి కోచింగ్‌ సెంటర్‌కి బయల్దేరింది. ఉదయం 7 గంటలకు వెళ్లిన ఆమె ఇంత వరకూ మళ్లీ పీజీకి తిరిగి రాలేదు. ఆమె ఫోన్‌ నంబర్ కూడా ట్రేస్ అవడం లేదు. పీజీ ఓనర్‌ అప్రమత్తమై ఏప్రిల్ 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతానికి ఓ ప్రత్యేక బృందం ఆమె ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. 

తరచూ మిస్సింగ్ కేసులు..

కోటాలో ఇలా విద్యార్థులు అదృశ్యమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తరచూ ఇలా ఎవరో ఒకరు కనిపించకుండా పోతున్నారు. తల్లిదండ్రులు కోటా అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడాదిగా ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలా మిస్సింగ్ కేసులతో పాటు ఆత్మహత్యలూ పెరుగుతున్నాయి. ప్రిపరేషన్‌ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు గదిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. "నేను చదవలేకపోతున్నాను" అంటూ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కోచింగ్ సెంటర్‌లు విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పెట్టకూడదని ఆదేశించింది. పదేపదే టెస్ట్‌ల పేరుతో ఇబ్బంది పెట్టకూడదని సూచించింది. అయితే...అటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నాయి. కొందరు విద్యార్థులు మరీ సున్నితంగా ఉంటున్నారని, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురై ఇలా చేసుకుంటున్నారని వాదిస్తున్నాయి.  

అందుకే ఒత్తిడి..

అయితే...ఈ ఆత్మహత్యల్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోటాలోని అన్ని హాస్టల్స్‌లోని గదుల్లో ఫ్యాన్‌లకు స్ప్రింగ్‌లు ఏర్పాటు చేయించింది. ఇకపై ఎవరూ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే..అప్పటి నుంచి ఇలా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. రోజూ టెస్ట్‌లు ఉండడం, అందులో సరిగ్గా మార్క్‌లు రాకపోతే అందరి ముందూ  గిల్టీగా ఫీల్ అవడం లాంటి సమస్యలతో చాలా మంది విద్యార్థులు బాధ పడుతున్నారు. అందుకే...వాళ్లకి రోజువారీ క్లాస్‌లతో పాటు సైకియాట్రిస్ట్‌లతోనూ కౌన్సిలింగ్‌ క్లాసెస్‌ ఏర్పాటు చేయాలని కొందరి సూచిస్తున్నారు. కానీ...ఈ సూచనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నలుగురు అదృశ్యం కాగా ఇప్పటి వరకూ వాళ్ల జాడ దొరక్కపోవడం ఆందోళనకరంగా మారింది. 

Also Read: రూ.12 కోట్లు పలికిన టైటానిక్ ప్రయాణికుడి గోల్డ్‌వాచ్, వేలంలో రికార్డు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Ind Vs SA W Odi World Cup Final Score Update: టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Ind Vs SA W Odi World Cup Final Score Update: టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు, ఇక బౌల‌ర్ల‌పైనే భారం.. ప్రొటీస్ తో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ 
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
Embed widget