అన్వేషించండి

హిందూమతాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి - బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Indian Constitution: భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరముందంటూ బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

BJP MP Anant Kumar Hegde: కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా తిరిగి రాయాల్సిన అవసరం ఉందని అనడం రాజకీయంగా సంచలనమైంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హిందూమతాన్ని తక్కువ చేస్తూ కుట్రపూరితంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసిందని ఆరోపించారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

"బీజేపీ 400 చోట్ల విజయం సాధించేలా మీరే సహకరించాలి. బీజేపీకి 400కి పైగా స్థానాలు రావాలని కోరుకోడానికి ఓ బలమైన కారణముంది. గతంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంలో చాలా సవరణలు చేశారు. హిందూమతానికి వ్యతిరేకంగా మార్పులు చేర్పులు చేశారు. మన మతాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి రాయాలి. లోక్‌సభలో ఇప్పటికే మాకు మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో తగినంత బలం లేదు. అందుకే 400కి పైగా స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకు అవకాశం వస్తుంది. అలా అయితేనే రాజ్యాంగ సవరణకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. "

- అనంత్ కుమార్ హెగ్డే, బీజేపీ ఎంపీ

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ క్రమంలోనే అనంత్ కుమార్ హెగ్డే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావించారు. రాజ్యాంగం శక్తేమిటో తెలియకుండానే కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. 

"అధికారంలోకి రాగానే రాజ్యాంగంలో పలు సవరణలు చేస్తాం అని చెబుతున్నారు. వాళ్లకి అసలు రాజ్యాంగం ఎంత శక్తిమంతమైందో తెలిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం ఎంత గొప్పదో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం అందుకు తోడ్పడుతుంది"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

గతంలో కొంతమంది సీనియర్ నేతలు ఇవే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగంలో సవరణలు చేసేందుకు కుట్ర చేస్తోందని మండి పడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం...ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అలాంటి ఆలోచనే తమకు లేదని తేల్చిచెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

Women's Kabaddi World Cup | కబడ్డీ వరల్డ్ కప్‌ ఇండియాదే
Karun Nair Crypitc Post Ind vs SA | ట్విట్టర్ వేదికగా కరుణ్ నాయర్ విమర్శలు
India vs South Africa Test Match | కుప్పకూలిన భారత బ్యాట్స్‌మెన్
Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Embed widget