By: ABP Desam | Updated at : 24 Sep 2021 12:34 AM (IST)
Edited By: Murali Krishna
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఈ భేటీ జరిగింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినట్లు పీఎఓ తెలిపింది.
Advancing friendship with Australia.
— PMO India (@PMOIndia) September 23, 2021
PM @ScottMorrisonMP held talks with PM @narendramodi. They discussed a wide range of subjects aimed at deepening economic and people-to-people linkages between India and Australia. pic.twitter.com/zTcB00Kb6q
ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని పేర్కొంది.
కొవిడ్ 19, వాణిజ్యం, రక్షణ సహా కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంచేలా ఇరువురు చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Prime Minister Narendra Modi and Australian PM Scott Morrison discussed regional & global developments as well as ongoing bilateral cooperation in areas related to Covid-19, trade, defence, clean energy & more: Ministry of External Affairs
— ANI (@ANI) September 23, 2021
గ్లోబల్ సీఈఓలతో భేటీ..
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ఆ దేశానికి చెందిన 5 దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా, 5జీ సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ.. సీఈఓలకు పిలుపునిచ్చారు.
క్వాల్కమ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్, అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్, ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్ విడ్మార్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్లాల్, బ్లాక్స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఎ ష్వార్జ్మెన్.. మోదీతో భేటీ అయినవారిలో ఉన్నారు.
"Through the morning, had extensive discussions with top CEOs and business leaders on investment in India. They were appreciative of India’s reform trajectory. Closer economic linkages between India and USA benefit the people of our nations," tweets PM Modi pic.twitter.com/fRGBGImRLP
— ANI (@ANI) September 23, 2021
Also Read:PM Modi US Visit: క్వాల్కమ్ సీఈఓ, అడోబ్ ఛైర్మన్తో మోదీ భేటీ.. 'డిజిటల్ ఇండియాకు' జై
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!