అన్వేషించండి

Modi Surname Row: పట్నా కోర్టుకు రాహుల్ గాంధీ, పరువు నష్టం కేసు విచారణ

Modi Surname Row: పరువు నష్టం దావా కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ పట్నా కోర్టులో హాజరు కానున్నారు.

Modi Surname Row:

2019లో పిటిషన్ 

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పట్నా కోర్టులో హాజరు కానున్నారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రాహుల్‌కు నోటీసులు పంపింది కోర్టు. ఈ మేరకు ఆయన విచారణకు రానున్నారు. 2019లో అప్పటి బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే రాహుల్‌పై దాదాపు 6  పరువు నష్టం దావా కేసులు నమోదయ్యాయి. వరుసగా వీటిపై విచారణ జరుగుతోంది. ఇటీవలే సూరత్‌ కోర్టులో విచారణ పూర్తైంది. రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఆ వెంటనే 30 రోజుల పాటు బెయిల్‌ ఇచ్చింది. ఈ లోగా పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్‌కు అవకాశముంది. హైకోర్టులో పిటిషన్ వేసేందుకు రాహుల్ రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకైతే దీనిపై పూర్తి స్థాయి సమాచారం లేదు. ఎప్పుడు ఆయన న్యాయపోరాటం మొదలు పెడతారన్న క్లారిటీ రావడం లేదు. ఒకవేళ హైకోర్టులో కూడా రాహుల్‌కు ప్రతికూలంగా తీర్పు వస్తే దాదాపు 8 ఏళ్ల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అసహనంతో ఉంది. ఉద్దేశపూర్వకంగా రాహుల్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారని మండి పడుతోంది. అటు బీజేపీ నేతలు మాత్రం ఇదంతా రాహుల్ చేతులారా చేసుకున్నారంటూ తేల్చి చెబుతోంది. ఎంపీలకు రక్షణ కల్పించే ఆర్డినెన్స్‌ను ఆయనే పార్లమెంట్‌లో చించేశారని, కర్మ అనుభవిస్తున్నారని విమర్శిస్తోంది. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. యూపీలో కౌశంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అమిత్‌షా ఆ తరవాత బహిరంగ సభలో ప్రసంగించారు. 2024 ఎన్నికల్లోనూ దేశ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. 

"రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినందుకు విపక్షాలు ఆందోళన చేశాయి. పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా  చేశాయి. ప్రజలు ఆ పార్టీలను ఎప్పటికీ క్షమించరు"

- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 

కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చేసిన వ్యాఖ్యలపైనా అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల కుటుంబం ప్రమాదంలో ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శించారు. 

"ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు. వాళ్ల కుటుంబం, కులవాదం, వారసత్వ రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ల నిరంకుశత్వం ప్రమాదంలో ఉంది. ప్రజలు ఇలాంటి వాళ్లను కోరుకోవడం లేదు. ప్రధాని మోదీ ఇలాంటి కుల రాజకీయాలను చిత్తుగా ఓడించారు. అందుకే..ఎస్‌పీ, బీఎస్‌పీ లాంటి పార్టీలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. అందుకే విపక్షాలు ఇంతగా భయపడుతున్నాయి"

- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 

Also Read: Nirmala Sitharaman on Muslims: భార‌త్‌లోనే ముస్లింల‌కు భ‌ద్ర‌త‌-పెరిగిన జ‌నాభానే రుజువు: నిర్మ‌లా సీతారామ‌న్‌

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget