అన్వేషించండి

India Modi: ఏ ప్రధానికీ దక్కని అరుదైన ఘనత.. మరోసారి హాట్ టాపిక్‌గా ప్రధాని మోడీ

భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్‌కు నెల పాటు నాయకత్వం అవకాశం. ఈ నెలలో జరగనున్న సమావేశానికి నాయకత్వం వహించనున్న ప్రధాని మోడీ.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి.. ఇంత వరకూ భారత ప్రధానులెవరికీ దక్కని గౌరవం దక్కనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఇంత వరకూ భారత ప్రధాని ఎవరూ ఈ మండలికి నాయకత్వం వహించలేదు. ఆగస్టు 9న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రపంచ శాంతి, కౌంటర్ టెర్రరిజం వంటి సమస్యలపై వంటి సమస్యలపై చర్చించనున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ ఆగస్టు ఒకటో తేదీన చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్‌ ఈ పదవిలో ఉంటుంది.  భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్య దేశం కాదు. తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోన్న భారత్‌..  అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 

వచ్చే ఏడాది డిసెంబర్‌లోనూ మరోసారి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టనుంది. ప్రధాని మోడీ శాంతి స్థాపన, ఉగ్రవాదంపై పోరు, సముద్ర తీర భద్రత అంశాలను అజెండాగా సమావేశాల్లో చర్చకు ప్రతిపాదించే అవకాశం ఉంది.  ఉగ్రవాదంపై పోరులో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని.. ఇకపై కూడా ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని భారత్ అధికారికంగా ప్రకటించింది.   భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టడంపై అనేక దేసాలు హర్షం వ్యక్తంచేశాయి. భారత్‌ అజెండాలోని మూడు అంశాలపై కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి.   భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో.. ఇతర సభ్యదేశాలతోనూ కలిసి ముందుకు సాగుతామని భారత విదేశాంగమంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. 

Also Read: e-RUPI : ఇండియా ఎలక్ట్రానిక్ "రూపీ" వచ్చేస్తోంది.. ఇది బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీనా.. ఇవిగో వివరాలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శాశ్వత సభ్య దేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్,  ప్రాన్స్​ఉన్నాయి.  శాశ్వత సభ్య దేశాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి.  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా. జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశంగా భారత్​కు గుర్తింపు ఉంది.  భారత్​కు శాశ్వత సభ్యత్వంపై ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ముందడుగు పడలేదు. భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని భారత ప్రధాని సహా పలు దేశాలు డిమాండ్​ను తెరమీదకు తెస్తున్నాయి. 

భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే మొదటగా సాధారణ సభలో తీర్మానం చేసి, ఐక్యరాజ్య సమితి చార్టర్​ను మార్చి కొత్త దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించే నిబంధనను చేర్చాల్సి ఉంటుంది.  శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​, రష్యాలు భారత్​ శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు ఒప్పుకుంటే సభ్యత్వం వచ్చేది. కానీ చైనాతోపాటు మరికొన్ని దేశాలు ప్రతీసారి అడ్డుపడుతున్నాయి. తాత్కలిక సభ్య దేశంగా మాత్రం అవకాశం దక్కుతోంది. భారత్ అంది వచ్చిన అవకాశాన్ని శాశ్వతసభ్యదేశంగా మారేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. 

Also Read: Karnataka Cabinet : బొమ్మై కేబినెట్‌లో "సీడీ" సమీకరణాలు.. ఆ ఆరుగురికి చోటు లభిస్తుందా..

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget