అన్వేషించండి

AP DSC: డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స క్లారిటీ - అంగన్వాడీల జీతాల పెంపుపైనా కీలక వ్యాఖ్యలు

Andhra News: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై చర్చలు జరగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

Minister Botsa Clarity on DSC Notification: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహణపై (DSC Notification) మంత్రి బొత్స (Minister Botsa) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, 2, 3 రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తుందని స్పష్టం చేశారు. 'డీఎస్సీ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సీఎం జగన్ (CM Jagan) విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు.' అని తెలిపారు. అటు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని అన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె విరమించాలని కోరారు.

జీతాల పెంపుపై ఏమన్నారంటే.?

రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇచ్చిన హామీ మేరకు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం మొదటి ఏడాది రూ.11 వేలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు అంగన్వాడీలతో చర్చలు జరిపామని, వారి 10 డిమాండ్లకు అంగీకరించామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని, పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచీ మేనిఫెస్టోలో పొందు పరిచిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

టీడీపీపై విమర్శలు

ప్రభుత్వ హామీల అమలుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స మండిపడ్డారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన, టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సహజమని అన్నారు. స్థానిక పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగానే మార్పులు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల పని తీరు బాగుందని, మార్పు ఉండబోదనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Vasantha Krishna Prasad : మళ్లీ మొదటికి మైలవరం పంచాయతీ - తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్న వసంత కృష్ణ ప్రసాద్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Hyderabad News: 'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
Embed widget