అన్వేషించండి

Agnipath Protest: హైదరాబాద్ ప్రయాణికుల కష్టాలు, ధరలు పెంచేసిన క్యాబ్‌లు

మెట్రో, ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసుల రద్దుతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రయాణికులు.

ప్రయాణికులకు తప్పని తిప్పలు 

సికింద్రాబాద్ ఆందోళనలతో ఒక్కసారిగా సిటీ అంతా అలజడి రేగింది. హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పలు ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసులు సహా, మెట్రోలనూ అప్పటికప్పుడు నిలిపివేశారు. ఫలితంగా నిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలువురు ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. సర్వీసులు పునరద్ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే మెట్రో అధికారులు మాత్రం అది తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు. ఏం చేయాలో అర్థం కాక ప్రజలు వెనుదిరుగుతున్నారు. రోజూ వేలాది మంది మెట్రో సర్వీస్‌లను వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు పూర్తిగా మెట్రోపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి సర్వీస్‌ ఆపేయటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే షిఫ్ట్‌ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి తిప్పలు తప్పటం లేదు. 

మనీ రీఫండ్ చేస్తామని చెప్పిన రైల్వే అధికారులు 

ఓలా, ఊబర్ లాంటి సంస్థలూ రైడ్ ఛార్జెస్‌ని విపరీతంగా పెంచేశాయి. సమస్యాత్మక ప్రాంతాల్లోకి బైక్‌లు, క్యాబ్‌లు అసలు బుక్ కావటం లేదు. మిగతా ప్రాంతాల్లోనూ మునుపటి కంటే రెట్టింపుగా ఛార్జ్ చేస్తున్నాయి. 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు వెళ్లాలన్నా రూ.100 వరకూ ఛార్జ్ చూపిస్తోందని కొందరు సిటిజన్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో మెట్రో నడుస్తుండటం వల్ల కొంతలో కొంత రోడ్ ట్రాఫిక్ కంట్రోల్అవుతోంది. మెట్రో రద్దవటం వల్ల సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే ప్లాట్‌ఫామ్‌లపైనే తల దాచుకోవాల్సి వచ్చింది. చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కళ్లముందే ఆందోళనకారులు బోగీలు తగలబెడుతుండటాన్ని చూసి భయపడిపోయారు. రైళ్లూ రద్దు కావటం వల్ల
ఏం చేయాలో పాలుపోక స్టేషన్‌లోనే చిక్కుకున్నారు. అయితే ఇప్పటికే టికెట్‌లు బుక్‌ చేసుకున్న వాళ్లకు మనీ రీఫండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.

చర్చలకు రావాలంటున్న పోలీసులు, వెనక్కి తగ్గని నిరసనకారులు 

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఆందోళనకారులు బీభత్సం సృష్టించటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను కట్టడి చేసే ప్రయత్నం చేసినా అది సాధ్య పడలేదు ఫలితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు అల్లర్లు ఆపలేదు. పైగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితులు చేయి దాటిపోవటం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే యువకులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఈ తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే ఒకరు మృతి చెందారు. ఆందోళనకారులు వెంటనే వెనక్కి తగ్గాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా నిరసనకారులు మాత్రం వెనకడుగు వేయటం లేదు. 10 మంది ముందుకు వచ్చి తమతో చర్చించాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ ఆర్మీ అభ్యర్థులు అందుకు అంగీకరించటం లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
West Asia Tensions: గల్ఫ్‌లో యుద్ధం భారత్‌కు నష్టకాలం! నాలుగు రోజుల్లో ఎంత లాస్‌ అయ్యామంటే? 
గల్ఫ్‌లో యుద్ధం భారత్‌కు నష్టకాలం! నాలుగు రోజుల్లో ఎంత లాస్‌ అయ్యామంటే? 
Iran Israel War 2026: భారత్‌లో చమురు సంక్షోభం రాబోతోందా? కేంద్రం ఏం చెప్పింది?
భారత్‌లో చమురు సంక్షోభం రాబోతోందా? కేంద్రం ఏం చెప్పింది?
Iran Israel War 2026:ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తున్నట్టు? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తున్నట్టు? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Embed widget