అన్వేషించండి

ప్రధాని పదవికే మచ్చ తెచ్చారు, ప్రసంగాల్లో మరీ అంత విద్వేషమా - మోదీకి మన్మోహన్ చురకలు

Manmohan Singh: ప్రధాని పదవికి మోదీ మచ్చ తెచ్చి పెట్టారని విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారని మన్మోహన్ సింగ్‌ మండి పడ్డారు.

Manmohan Singh Slams Modi: ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా మండి పడ్డారు. ప్రధాని పదవికే ఆయన మచ్చ తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకు పంచి పెడుతుందని ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మన్మోహన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ ఓటర్లకు రాసిన బహిరంగ లేఖలో ఈ విషయం ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న సమయంలో మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. మోదీ ప్రచారాన్ని తాను ముందు నుంచీ గమనిస్తూనే ఉన్నానని చెప్పిన ఆయన ప్రజల్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో విషం చిమ్మారని అసహనం వ్యక్తం చేశారు. 

"ప్రజల గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీయే. ఆ పదవికీ మచ్చ తెచ్చి పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఏ ప్రధానమంత్రి కూడా ఈ స్థాయిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు. సమాజంలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అలా మాట్లాడడం ఆందోళన కలిగించింది"

- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

దేశంలోని అన్ని వనరులపై మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ చెప్పారంటూ మోదీ విమర్శించారు. ఈ విమర్శలపై మన్మోహన్ స్పందించారు. ఇదంతా అవాస్తవం అని కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన చేయలేదని, ఇలాంటివి చేయడంలో బీజేపీకి మాత్రమే కాపీరైట్ ఉందని చురకలు అంటించారు. పదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి ఉన్న ఆదాయాన్ని పోగొట్టారని మండి పడ్డారు మన్మోహన్ సింగ్. రైతు చట్టాల్ని నిలదీస్తూ పంజాబ్ రైతులు రోడ్లపైకి వస్తే వాళ్లని ఆందోళనకారులు అనే ముద్ర వేశారని విమర్శించారు. వాళ్లపై లాఠీఛార్జీలు చేయడంతో పాటు బులెట్‌ల వర్షం కురిపించారని ఫైర్ అయ్యారు. తమను సంప్రదించకుండానే చట్టాలు ఎందుకు చేశారని నిలదీసిన పాపానికి అంత దారుణంగా వ్యవహరించారని మన్మోహన్ తన లేఖలో ప్రస్తావించారు. 

"గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ముందు వెనకా ఆలోచించకుండా GST అమలు చేశారు. కొవిడ్‌ సంక్షోభాన్నీ సరైన విధంగా హ్యాండిల్ చేయలేకపోయారు. జీడీపీ కూడా అనుకున్న స్థాయిలో నమోదు కావడం లేదు. రైతు చట్టాల్ని వ్యతిరేకించినందుకు ఢిల్లీ సరిహద్దుల్లో కనీసం 750 మంది పంజాబ్ రైతుల్ని బలి తీసుకున్నారు. ఇంత కన్నా దారుణం ఏముంటుంది"

- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

Also Read: Naveen Patnaik: నేను ఆరోగ్యంగా ఉన్నా, ఓట్ల కోసమే ఈ పుకార్లు - మోదీకి నవీన్ పట్నాయక్ కౌంటర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
Priya Prakash Varrier: ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
Embed widget