అన్వేషించండి

Manda Krishna Madiga : మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?

SC Sub Categorization : ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మూడు దశాబ్దాల కిందట నాంది పలికి ఇప్పటికి విజయం సాధించారు మంద కృష్ణ. ఈ కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మరి తర్వాత ఏం చేయబోతున్నారు ?

Manda Krishna Madiga Struggle For SC Sub Categorization :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్‌లో ఎమ్మార్సీఎస్ బహిరంగసభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధాని మోదీ  హాజరయ్యారు. ఆ వేదికపై ప్రధాని మోదీ మంద కృష్ణను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప పెద్దగా ఇతర రాష్ట్రాల వారికి తెలియని ఓ నేతపై మోదీ ఇంత అభిమానం చూపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మోదీ అంత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వారిలో అంతర్జాతీయ నేతలు.. ఇస్రో మాజీ చైర్మన్ శివన్ వంటి వారు ఉన్నారు. వారి జాబితాలో మంద కృష్ణ చేరారు. మోదీ ఇంత అభిమానం  చూపడానికి కారణం మందకృష్ణ పోరాట నేపధ్యమే.
Manda Krishna Madiga : మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?

ఎస్సీ వర్గీకరణ పోరాటం కోసం జీవితం కేటాయించిన మంద కృష్ణ

మంద కృష్ణ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదని.. మాదిగ వర్గాలకు అన్యాయం జరుగుతోందని గుర్తించిన తర్వాత ఆయన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభించారు.  1994, జూలై 7న ఈదుముడిలో  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మంద కృష్ణ ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్‌ మొదటి సమావేశం 1995 మే 31న ఒంగోలులో జరిగింది.  1996 మార్చి 2న హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో మందకృష్ణ నేతృత్వంలో సుమారు 5 లక్షల మంది మాదిగలతో తొలి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ తర్వాత ముఫ్పై ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పోరాటంలో ఎంతో మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చనిపోయారు. అయినా ఎమ్మార్పీఎస్ ఉద్యమం పక్కదోవ పట్టకూడదని ప్రతీకార రాజకీయాల వైపు చూడలేదని మంద కృష్ణ చెబుతారు.
Manda Krishna Madiga : మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?

ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ప్రాణత్యాగాలు

30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ సారి గాంధీభవన్‌ ముట్టడిలో ఎమ్మార్పీఎ్‌సకు చెందిన నలుగురు నాయకులు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడగా... వారిలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన కారణంగా గాంధీభవన్‌కు రావాల్సిన సోనియా గాంధీ తన పర్యటన వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. మంద కృష్ణ చేసిన పోరాటంలో ప్రాణభయం అనేది ఎప్పుడూ చూపించలేదు. పెట్రోలు బాటిళ్లు పట్టుకుని దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. రాజకీయ పార్టీల వ్యూహాల్లో చిక్కుకుతుంది. అయితే మందకృష్ణ ఎప్పుడూ తన లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు.
Manda Krishna Madiga : మూడు దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధన - మంద కృష్ణ తర్వాత లక్ష్యం ఏమిటి ?

పదవులను తిరస్కరించి ఉద్యమం

మంద కృష్ణ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం. అందుకే ఆయనకు రాజకీయ పార్టీలు ఎన్నో సార్లు పదవులను ఆఫర్ చేశాయి. చంద్రబాబునాయుడు మొదట పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారు. కానీ వద్దనుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ సీటును ఆఫర్ చేసింది. వైఎస్ హయాంలో ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని ప్రతిపాదన పెట్టారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని కబురు చేసింది. అయితే అన్నింటినీ మందకృష్ణ వద్దనుకున్నారు. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా స్వతంత్రంగానే పోటీ చేసి. ఏదైనా రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తే తన ఉద్యమం ఆ పార్టీకి అనుకూలంగా మారినట్లవుతుందని ఆయన చెబుతారు. 

ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రతి రాజకీయ పార్టీకి మందకృష్ణ మద్దతు తెలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోనివారిని వ్యతిరేకించారు. ఇప్పుడు మందకృష్ణ ఏం చేయబోతున్నారంటే.. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కారం కోసం పోరాడతానని అంటున్నారు. మందకృష్ణ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆయవ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
America stops attacks on Iran: ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
Prime Minister Modi Parliament Speech: 41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
Legend of Durga Bhabhi: విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..
విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
Embed widget