అన్వేషించండి

పట్టుదలకు పోవద్దు, భారత్‌తో మాట్లాడండి - మాల్దీవ్స్ అధ్యక్షుడికి కీలక నేతల హితబోధ

Mohamed Muizzu: భారత్‌తో విభేదాలు పక్కన పెట్టి మాట్లాడాలని మాల్దీవ్స్ ప్రెసిడెంట్‌ ముయిజూకి కొందరు నేతలు సలహా ఇస్తున్నారు.

India Maldives Ties: భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత మాల్దీవ్స్ మంత్రులు భారత్‌పై నోరు పారేసుకోవడం నుంచి మొదలైన వివాదం సద్దుమణగడం లేదు. పైగా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ (Mohamed Muizzu) కూడా భారత్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మరింత దూరాన్ని పెంచింది. అయితే...అధ్యక్షుడి తీరుపై కొందరు నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. భారత్‌తో మైత్రిని చెడగొట్టుకోవద్దంటూ సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు బహిరంగంగానే ముయిజూపై విమర్శలు చేశారు. భారత్‌తో ఎన్నో ఏళ్లుగా ఉన్న బంధాన్ని కాదనుకుంటే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. గతేడాది సెప్టెంబర్‌లో మాల్దీవ్స్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ రేసులో ముయిజూకి ప్రత్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ సోలిహ్‌ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కూడా భారత్-మాల్దీవ్స్ విభేదాలపై స్పందించారు. ఓ ర్యాలీలో పాల్గొన్న సోలిహ్ ముయిజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన మాల్దీవ్స్‌ని కాపాడాలని కోరడానికైనా ముయిజూ భారత్‌తో మాట్లాడాల్సిన అవసరం వస్తుందని అన్నారు. ఇదే సమయంలో చైనా నుంచి తీసుకున్న అప్పుల గురించీ ప్రస్తావించారు. ప్రస్తుతానికి చైనాకి 18 బిలియన్ రుఫియాల మేర మాల్దీవ్స్ రుణం చెల్లించాల్సి ఉంది. ఇటు భారత్‌కి 8 బిలియన్ రుఫియాల మేర అప్పు పడింది. ఇలాంటి సమయంలో అనవసరంగా విభేదాలు పెట్టుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోలిహ్ స్పష్టం చేశారు. 

"ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాల్దీవ్స్‌కి పొరుగు దేశాలు సాయం చేస్తాయనే అనుకుంటున్నాను. పట్టుదలకు పోవడం మంచిది కాదు. మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. మనకి సాయం చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ముయిజూ మాత్రం మొండివైఖరితో ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే బహుశా పరిస్థితి అర్థం అవుతుందేమో"

- మహమ్మద్ సోలిహ్

 

టాప్ హెడ్ లైన్స్

Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget