అన్వేషించండి

Thackeray vs Shinde: బీజేపీలో చేరే ముందు షిందే ఏడ్చారు, ఉన్నది ఒక్కటే శివసేన - ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు

Thackeray vs Shinde: బీజేపీలో చేరే ముందు షిందే మాతోశ్రీకి వచ్చి ఏడ్చారని ఆదిత్య థాక్రే అన్నారు.

Thackeray vs Shinde:


మాతోశ్రీకి వచ్చారు: ఆదిత్య థాక్రే 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కొడుకు ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిందే వర్గంతో వచ్చిన విభేదాల గురించి ప్రస్తావించారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ఆయనను లాక్కుందని మండి పడ్డారు. బీజేపీలో చేరక ముందు ఏక్‌నాథ్ షిందే పార్టీ కార్యాలయమైన మాతోశ్రీకి వచ్చి ఏడ్చారని, బీజేపీలో చేరకపోతే జైలుకు పంపుతామని బెదిరించారని చెప్పినట్టు సంచలన కామెంట్స్ చేశారు ఆదిత్య. 

"బీజేపీలో చేరక ముందు ఏక్‌నాథ్ షిందే మాతోశ్రీకి వచ్చారు. పార్టీలో చేరకపోతే జైలుకు పంపుతామని బెదిరించినట్టు చెప్పారు. నిస్సహాయ స్థితిలో ఏడ్చారు. 40 మంది ఎమ్మెల్యేలు కేవలం డబ్బు ఆశతోనే ఆ పార్టీలో చేరారు. "

- ఆదిత్య థాక్రే, మహారాష్ట్ర ఎమ్మెల్యే 

ఈ వ్యాఖ్యల్ని సంజయ్ రౌత్ కూడా సమర్థించారు. ఆదిత్య థాక్రే చెప్పిన విషయం నిజమేనంటూ ట్వీట్ చేశారు. 

"ఇది నిజమే. షిందేకు అర్థమయ్యేలా వివరించేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఆయనకు జైలుక వెళ్తానేమో అన్న భయం పట్టుకుంది. అందుకే లొంగిపోయారు. ఆదిత్య థాక్రే చెప్పిన విషయాలు అక్షరాలా నిజం"

- సంజయ్ రౌత్, మహారాష్ట్ర ఎంపీ 

బాలాసాహెబ్ థాక్రే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆదిత్య థాక్రే. షిందేపై తీవ్ర విమర్శలు చేశారు. 

"మహారాష్ట్రలో చాలా మంది నేతలు మా తాతయ్య బాలాసాహెబ్ థాక్రే గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగినట్టు, ఆయన వాళ్లను గౌరవించినట్టు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క శివసేన ఉంది. మిగతావి ఏవైనా అవి నమ్మక ద్రోహం నుంచి పుట్టుకొచ్చినవే. మా నుంచి అంతా కొల్లగొడదామని కుట్ర చేశారు. ఇప్పుడు సీఎం షిందే పదేపదే ఢిల్లీకి వెళ్తున్నారు. బహుశా థాక్రే అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నారేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భయపడి పారిపోయిన వాళ్లకు దొంగ అనే ట్యాగ్‌ మాత్రమే వేస్తారు"

- ఆదిత్య థాక్రే, మహారాష్ట్ర ఎమ్మెల్యే 

శివసేన పార్టీ పేరు, గుర్తుని కోల్పోయిన థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఎన్నికల సంఘం శిందే వర్గానికి వాటిని కేటాయించడంపై మండి పడుతోంది. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన సామ్‌నా పత్రికలో ఎడిటోరియల్ రాసిన థాక్రే...వేరువేరుగా బీజేపీపై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వాన్నీ ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్నీ ఈ సంపాదకీయంలో చర్చించారు థాక్రే. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందామని స్పష్టం చేశారు. ఇది తరవాత నిర్ణయించుకుందామంటూ ప్రతిపక్షాలకు సూచించారు. 

"మనం బీజేపీపై పోరాటం చేయాలంటే ఇలా వేరువేరుగా ఉంటే అది కుదరదు. మనమంతా కలిసి మెరుపు దాడి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేదు. ప్రతిపక్షాలు ఐక్యం కావడమే చాలా కీలకం" 

- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 

Also Read: Rajasthan Congress Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు రానున్నాయా? హైకమాండ్ ప్లాన్ ఏంటి?

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget