అన్వేషించండి

Thackeray vs Shinde: బీజేపీలో చేరే ముందు షిందే ఏడ్చారు, ఉన్నది ఒక్కటే శివసేన - ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు

Thackeray vs Shinde: బీజేపీలో చేరే ముందు షిందే మాతోశ్రీకి వచ్చి ఏడ్చారని ఆదిత్య థాక్రే అన్నారు.

Thackeray vs Shinde:


మాతోశ్రీకి వచ్చారు: ఆదిత్య థాక్రే 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కొడుకు ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. షిందే వర్గంతో వచ్చిన విభేదాల గురించి ప్రస్తావించారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ఆయనను లాక్కుందని మండి పడ్డారు. బీజేపీలో చేరక ముందు ఏక్‌నాథ్ షిందే పార్టీ కార్యాలయమైన మాతోశ్రీకి వచ్చి ఏడ్చారని, బీజేపీలో చేరకపోతే జైలుకు పంపుతామని బెదిరించారని చెప్పినట్టు సంచలన కామెంట్స్ చేశారు ఆదిత్య. 

"బీజేపీలో చేరక ముందు ఏక్‌నాథ్ షిందే మాతోశ్రీకి వచ్చారు. పార్టీలో చేరకపోతే జైలుకు పంపుతామని బెదిరించినట్టు చెప్పారు. నిస్సహాయ స్థితిలో ఏడ్చారు. 40 మంది ఎమ్మెల్యేలు కేవలం డబ్బు ఆశతోనే ఆ పార్టీలో చేరారు. "

- ఆదిత్య థాక్రే, మహారాష్ట్ర ఎమ్మెల్యే 

ఈ వ్యాఖ్యల్ని సంజయ్ రౌత్ కూడా సమర్థించారు. ఆదిత్య థాక్రే చెప్పిన విషయం నిజమేనంటూ ట్వీట్ చేశారు. 

"ఇది నిజమే. షిందేకు అర్థమయ్యేలా వివరించేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఆయనకు జైలుక వెళ్తానేమో అన్న భయం పట్టుకుంది. అందుకే లొంగిపోయారు. ఆదిత్య థాక్రే చెప్పిన విషయాలు అక్షరాలా నిజం"

- సంజయ్ రౌత్, మహారాష్ట్ర ఎంపీ 

బాలాసాహెబ్ థాక్రే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆదిత్య థాక్రే. షిందేపై తీవ్ర విమర్శలు చేశారు. 

"మహారాష్ట్రలో చాలా మంది నేతలు మా తాతయ్య బాలాసాహెబ్ థాక్రే గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగినట్టు, ఆయన వాళ్లను గౌరవించినట్టు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క శివసేన ఉంది. మిగతావి ఏవైనా అవి నమ్మక ద్రోహం నుంచి పుట్టుకొచ్చినవే. మా నుంచి అంతా కొల్లగొడదామని కుట్ర చేశారు. ఇప్పుడు సీఎం షిందే పదేపదే ఢిల్లీకి వెళ్తున్నారు. బహుశా థాక్రే అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నారేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భయపడి పారిపోయిన వాళ్లకు దొంగ అనే ట్యాగ్‌ మాత్రమే వేస్తారు"

- ఆదిత్య థాక్రే, మహారాష్ట్ర ఎమ్మెల్యే 

శివసేన పార్టీ పేరు, గుర్తుని కోల్పోయిన థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఎన్నికల సంఘం శిందే వర్గానికి వాటిని కేటాయించడంపై మండి పడుతోంది. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన సామ్‌నా పత్రికలో ఎడిటోరియల్ రాసిన థాక్రే...వేరువేరుగా బీజేపీపై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వాన్నీ ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్నీ ఈ సంపాదకీయంలో చర్చించారు థాక్రే. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందామని స్పష్టం చేశారు. ఇది తరవాత నిర్ణయించుకుందామంటూ ప్రతిపక్షాలకు సూచించారు. 

"మనం బీజేపీపై పోరాటం చేయాలంటే ఇలా వేరువేరుగా ఉంటే అది కుదరదు. మనమంతా కలిసి మెరుపు దాడి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేదు. ప్రతిపక్షాలు ఐక్యం కావడమే చాలా కీలకం" 

- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 

Also Read: Rajasthan Congress Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు రానున్నాయా? హైకమాండ్ ప్లాన్ ఏంటి?

టాప్ హెడ్ లైన్స్

Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపాలి, ఇప్పుడే చర్యలొద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
విద్యార్థుల నిరసనపై విచారణ జరపాలి, ఇప్పుడే చర్యలొద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget