అన్వేషించండి

Lok Sabha Elections Phase 6: ముగిసిన ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు, బెంగాల్‌లో అత్యధిక పోలింగ్ - యూపీలో అంతంతమాత్రం

Lok Sabha Elections Phase 6 News: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముగిసింది. అధికారిక లెక్కల ప్రకారం 57.7% పోలింగ్ నమోదైంది.

Lok Sabha Elections Phase 6 2024 Updates: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ ఈసీ (సాయంత్రం 5 గంటల సమయానికి) అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తంగా 57.7% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వెస్ట్ బెంగాల్‌లో 77.99% పోలింగ్‌ రికార్డ్ అయింది. యూపీలో 52% పోలింగ్‌ మాత్రమే నమోదవడం చర్చనీయాంశమైంది. ఇక బిహార్‌లో 52.24% పోలింగ్‌ నమోదైంది. ఉత్కంఠ రేపిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో 53.73% ఓటు శాతం నమోదైనట్టు ఈసీ వెల్లడించింది.

ఇక హరియాణాలో 55.93%, జమ్ముకశ్మీర్‌లో 51.35%,ఝార్ఖండ్‌లో 61.41%,ఒడిశాలో 59.60% పోలింగ్‌ రికార్డైంది. వెస్ట్‌బెంగాల్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదైనప్పటికీ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరగడం కాస్త అలజడి సృష్టించింది. ఇవాళ్టితో (మే 25) మొత్తం 543 సీట్లున్న లోక్‌సభలో 486 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. అక్కడితో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. 

పోలింగ్‌ శాతంపై ఈసీ క్లారిటీ..

అయితే...పోలింగ్ శాతాలు విడుదల చేయడంలో ఈసీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఈసీపై ఓ పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై ఈసీ గట్టిగానే స్పందించారు. మొత్తం ఇప్పటి వరకూ ఐదు విడతల పోలింగ్‌లో నమోదైన ఓటు శాతాలను విడుదల చేసింది. ఈ విషయంలో ఫార్మాట్‌ని మార్చుతున్నట్టు వెల్లడించింది. ఈసీపై ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం ఈ వివరాలు తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో పోలింగ్ శాతానికి సంబంధించిన లెక్కల్ని అప్‌లోడ్ చేసింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎంతెంత ఓటింగ్ నమోదైందో చాలా స్పష్టంగా అందులో పబ్లిష్ చేసింది. ఈ లెక్కల్ని మార్చడం అసాధ్యం అని తేల్చి చెప్పింది.

ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్ని దశలకు సంబంధించిన వివరాలనూ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఈసీ స్పష్టం చేసింది. ఓటరు శాతం విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలనీ కొట్టిపారేసింది. అందరికీ అన్ని సమయాల్లో ఈ డేటా అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు మహువా మొయిత్రా, పవన్‌ ఖేరాతో సహా పలువురు ప్రముఖులు ఓటుశాతం వెల్లడించడంలో మోసం జరుగుతోందని ఆరోపించారు. కావాలనే కొన్ని చోట్ల ఎక్కువ చేసి చూపుతున్నారని మండి పడ్డారు. 

"ఎన్నికల కమిషన్‌ అధికారులు అన్ని రాష్ట్రాల్లోని ఓటింగ్ శాతాన్ని వీలైనంత వరకూ అందరికీ అందుబాటులో ఉంచేందుకే ప్రయత్నిస్తున్నారు. అన్ని ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఈ డేటా విడుదల చేస్తున్నాం. ఇందులో మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం"

- ఎన్నికల సంఘం 

Also Read: BJP MP Candidate Attacked: బీజేపీ ఎంపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టిన ఆందోళనకారులు, రాళ్లు ఇటుకలతో దాడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Chilkuru Balaji Rangarajan Attack case: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
PM Modi In Paris: ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్‌, పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం Viral Video
ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్‌, పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం Viral Video
SBI Clerks Halltickets: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget