అన్వేషించండి

Lok Sabha Elections Phase 6: ముగిసిన ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు, బెంగాల్‌లో అత్యధిక పోలింగ్ - యూపీలో అంతంతమాత్రం

Lok Sabha Elections Phase 6 News: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముగిసింది. అధికారిక లెక్కల ప్రకారం 57.7% పోలింగ్ నమోదైంది.

Lok Sabha Elections Phase 6 2024 Updates: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ ఈసీ (సాయంత్రం 5 గంటల సమయానికి) అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తంగా 57.7% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వెస్ట్ బెంగాల్‌లో 77.99% పోలింగ్‌ రికార్డ్ అయింది. యూపీలో 52% పోలింగ్‌ మాత్రమే నమోదవడం చర్చనీయాంశమైంది. ఇక బిహార్‌లో 52.24% పోలింగ్‌ నమోదైంది. ఉత్కంఠ రేపిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో 53.73% ఓటు శాతం నమోదైనట్టు ఈసీ వెల్లడించింది.

ఇక హరియాణాలో 55.93%, జమ్ముకశ్మీర్‌లో 51.35%,ఝార్ఖండ్‌లో 61.41%,ఒడిశాలో 59.60% పోలింగ్‌ రికార్డైంది. వెస్ట్‌బెంగాల్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదైనప్పటికీ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరగడం కాస్త అలజడి సృష్టించింది. ఇవాళ్టితో (మే 25) మొత్తం 543 సీట్లున్న లోక్‌సభలో 486 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. అక్కడితో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. 

పోలింగ్‌ శాతంపై ఈసీ క్లారిటీ..

అయితే...పోలింగ్ శాతాలు విడుదల చేయడంలో ఈసీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఈసీపై ఓ పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై ఈసీ గట్టిగానే స్పందించారు. మొత్తం ఇప్పటి వరకూ ఐదు విడతల పోలింగ్‌లో నమోదైన ఓటు శాతాలను విడుదల చేసింది. ఈ విషయంలో ఫార్మాట్‌ని మార్చుతున్నట్టు వెల్లడించింది. ఈసీపై ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం ఈ వివరాలు తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో పోలింగ్ శాతానికి సంబంధించిన లెక్కల్ని అప్‌లోడ్ చేసింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎంతెంత ఓటింగ్ నమోదైందో చాలా స్పష్టంగా అందులో పబ్లిష్ చేసింది. ఈ లెక్కల్ని మార్చడం అసాధ్యం అని తేల్చి చెప్పింది.

ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్ని దశలకు సంబంధించిన వివరాలనూ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఈసీ స్పష్టం చేసింది. ఓటరు శాతం విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలనీ కొట్టిపారేసింది. అందరికీ అన్ని సమయాల్లో ఈ డేటా అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు మహువా మొయిత్రా, పవన్‌ ఖేరాతో సహా పలువురు ప్రముఖులు ఓటుశాతం వెల్లడించడంలో మోసం జరుగుతోందని ఆరోపించారు. కావాలనే కొన్ని చోట్ల ఎక్కువ చేసి చూపుతున్నారని మండి పడ్డారు. 

"ఎన్నికల కమిషన్‌ అధికారులు అన్ని రాష్ట్రాల్లోని ఓటింగ్ శాతాన్ని వీలైనంత వరకూ అందరికీ అందుబాటులో ఉంచేందుకే ప్రయత్నిస్తున్నారు. అన్ని ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఈ డేటా విడుదల చేస్తున్నాం. ఇందులో మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం"

- ఎన్నికల సంఘం 

Also Read: BJP MP Candidate Attacked: బీజేపీ ఎంపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టిన ఆందోళనకారులు, రాళ్లు ఇటుకలతో దాడి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Maruti Grand Vitaraపై ఇయర్ ఎండ్ ఆఫర్లు: పెట్రోల్, CNG వేరియంట్లకూ డిస్కౌంట్లు
మారుతి గ్రాండ్ విటారాపై రూ.2.13 లక్షల వరకు లాభం, ఆఫర్‌ మరో రెండు రోజులే!
Rampur Accident: రోడ్డుపైకి వెళ్తే గ్యారంటీ ఉండదు - లగ్జరీ కారులో ఉన్నా సరే -ఈ వీడియో చూస్తే వణికిపోతారు!
రోడ్డుపైకి వెళ్తే గ్యారంటీ ఉండదు - లగ్జరీ కారులో ఉన్నా సరే -ఈ వీడియో చూస్తే వణికిపోతారు!
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget