అన్వేషించండి

Indian Restaurants: స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉన్న రెస్టారెంట్‌లు ఇవి, ఇప్పటికీ క్యూ కట్టి మరీ తింటారు

Pre Independence Restaurants: స్వాతంత్య్రం రాక ముందు నుంచీ ఇండియాలోని కొన్ని రెస్టారెంట్‌లు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇన్నేళ్లైనా వాటి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

Restaurants in India: వీకెండ్ వస్తే చాలు. ఎక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా ఓ టూర్‌ వేసొస్తారు చాలా మంది. ఇక ఫుడీస్‌ అయితే సిటీలో ఏయే రెస్టారెంట్‌లు కొత్తగా వచ్చాయ్..? రివ్యూస్ ఎలా ఉన్నాయని చూసుకుని అక్కడికి వెళ్లి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇన్‌స్టా రీల్స్‌లో రెస్టారెట్‌ల లిస్ట్‌ చూసుకుని వెళ్తున్న వాళ్లూ ఉన్నారు. అయితే...ఆహార ప్రియులకు ఎన్నో దశాబ్దాలుగా నోరూరిస్తున్న రెస్టారెంట్‌లున్నాయి. స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఇవి ఉన్నాయి. తరాలు ఎన్ని మారుతున్నా ఆ రెస్టారెంట్‌లకు ఉన్న ఫేమ్ మాత్రం తగ్గడం లేదు. 1947కి ముందు నుంచే ఉన్నా ఇప్పటికీ వాటి డిమాండ్ మాత్రం అలాగే కొనసాగుతోంది. పైగా వింటేజ్ ఫీల్ ఇస్తుండడం వల్ల ఫుడీస్‌ అంతా క్యూ కడుతూనే ఉన్నారు. 

ఈ లిస్ట్‌లో మొట్టమొదట చెప్పుకోవాల్సింది కోల్‌కత్తాలోని ఇండియన్ కాఫీ హౌజ్. కాలేజ్‌ స్ట్రీట్‌లో ఉండే హోటల్‌ని 1876లో ప్రారంభించారు. ముందుగా దీన్ని ఆల్బర్ట్ హాల్‌గా పిలుచుకునే వాళ్లు. 1942లో ఇండియన్ కాఫీ హౌజ్‌గా (Indian Coffee House) పేరు మార్చారు. అప్పట్లో ఎంతో మంది మేధావులు, రాజకీయ నేతలు, కళాకారులు ఇక్కడికి వచ్చి కాఫీ తాగేవాళ్లు. వీళ్లలో సుభాష్ చంద్రబోస్‌తో పాటు ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు. కాఫీతో పాటు ఇక్కడ ఇచ్చే స్నాక్స్ నోరూరిస్తాయి. అందుకే..కోల్‌కత్తాకి వెళ్లిన వాళ్లు కచ్చితంగా ఈ కాఫీ హౌజ్‌ని విజిట్ చేసి వస్తారు.

undefined

(Image Credits: Wikipedia)

ఇక కర్ణాటకలోని బెంగళూరులో మావళ్లి టిఫిన్ రూమ్ (MTR) కూడా ఈ జాబితాలో ఉంది. 1924లో మొదలైన ఈ హోటల్ సౌత్ ఇండియన్ ఫుడ్‌కి చాలా ఫేమస్. ముఖ్యంగా ఇడ్లీ, దోశతో పాటు ఫిల్టర్ కాఫీ కోసం ఫుడీస్‌ ఎగబడతారు. వెజిటేరియన్లకూ ఇది మంచి స్పాట్. దాదాపు వందేళ్లుగా ఆహార ప్రియులను ఆకర్షిస్తూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆహార కొరతను తీర్చేందుకు రవ్వ ఇడ్లీని కనిపెట్టింది ఈ MTR హోటలే. టేస్ట్‌, క్వాలిటీలో ఎక్కడా రాజీపడకపోవడం వల్ల ఆ పేరు చెక్కచెదరలేదు. 

Indian Restaurants: స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉన్న రెస్టారెంట్‌లు ఇవి, ఇప్పటికీ క్యూ కట్టి మరీ తింటారు

(Image Credis: cntraveller)

ముంబయిలోని బ్రిటానియా అండ్ కంపెనీని 1923లో స్థాపించారు. పార్శీ వంటకాలకు ఈ హోటల్ చాలా ఫేమస్. బలార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉండే ఈ హోటల్‌లో బెర్రీ పలావ్‌ని ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటారు. వింటేజ్ ఫర్నిచర్‌ అందరినీ అట్రాక్ట్ చేసేస్తుంది. బొమన్ కోహినూర్‌ ఈ హోటల్‌ని స్థాపించాడు. అప్పట్లో అతిథులను ఆయనే ఆహ్వానించి వాళ్లకు ఏం కావాలో అడిగి మరీ ఆర్డర్లు తీసుకునే వారని చెబుతారు. లక్నోలోని తుండే కబాబీ (Tunday Kababi) 1905 నుంచి ఫేమస్. నోరూరించే కబాబ్‌లు ఇక్కడ దొరుకుతాయి. ఈ హోటల్‌ని హాజీ మురద్ అలీ ప్రారంభించాడు. ఓ చేయి లేకపోయినా సరే కబాబ్‌లు చేయడంలో మాత్రం ఆయన స్టైలే వేరట. ఇప్పుడు ఇక్కడ కబాబ్‌లతో పాటు బిర్యానీ కూడా మెనూలో చేర్చారు. ఢిల్లీలోని జామా మసీద్ వద్ద కరీమ్స్‌ రెస్టారెంట్‌లో మొఘలాయ్‌ ఫుడ్ మెనూ ఉంటుంది. మటన్ కూర్మా, కబాల్‌ల కోసం ఫుడీస్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. 

Also Read: Ageing: మనమంతా రెండు సార్లు ముసలి వాళ్లమైపోతామట, మొదటి వృద్ధాప్యం వచ్చేది అప్పుడే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget