By: ABP Desam | Updated at : 08 Oct 2021 02:26 PM (IST)
Edited By: Murali Krishna
యూపీ సర్కార్పై సుప్రీం ఫైర్
లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా శనివారం ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరవుతారని సాల్వే కోర్టుకు తెలిపారు.
Supreme Court says it is not satisfied with the steps taken by the Uttar Pradesh government in the investigation of the Lakhimpur Kheri violence case pic.twitter.com/C76nuN9Dyr
— ANI (@ANI) October 8, 2021
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. అయితే ఆయనను ఈ రోజు 10 గంటలకు తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆశిష్.. హాజరుకాకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశిష్పై ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైనవని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఈ సందర్భంగా తుపాకీ తూటా గాయాలైనట్లు ఆరోపణలు వస్తే.. నిందితులకు ఇలాగే నోటీసులు పంపిస్తారా? అని సుప్రీం ప్రశ్నించింది. అయితే పోస్టుమార్టం నివేదికలో ఎవరికీ తుటాల గాయాలు కాలేదని తేలినట్లు కోర్టుకు తెలిపారు సాల్వే. అందుకే అతనికి నోటీసులు పంపించామని చెప్పారు.
ఆశిష్ పరారీ..
ఆశిష్ మిశ్రాను ప్రశ్నించేందుకు ఈ కేసు దర్యాప్తు చేపడుతున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉపేంద్ర అగర్వాల్ ఇప్పటికే లఖింపుర్ చేరుకుని వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆశిష్ నేపాల్ పారిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
పరారీలో ఉన్నది నిజమే అయితే.. కేంద్రం కలుగజేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి నేపాల్ నుంచి రప్పించాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read: IAF Foundation Day: విదేశీ శక్తులను భారత గడ్డపై అడుగుపెట్టనివ్వం: వాయుసేన అధిపతి
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Traffic Challans: సామాన్యుడికి ఓ న్యాయం - సార్లకో న్యాయమా ? బోత్ ఆర్ నాట్ సేమ్ ఎందుకు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్