అన్వేషించండి

AI Ministers: ప్రత్యేకంగా AI శాఖ - మంత్రులు కూడా - తమిళనాడు, కేరళ సీఎంల సంచలన నిర్ణయాలు

Artificial Intelligence Portfolio: కేరళ , తమిళనాడు ప్రభుత్వాలు సాంకేతిక రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసి మంత్రులను నియమించారు

First AI Ministry in India:    కేరళ, తమిళనాడుల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కేరళ సీఎం సతీశన్, తమిళనాడు సీఎం విజయ్  సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో, కేవలం ఐటీ శాఖకు పరిమితం కాకుండా  ఏఐ కోసం ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కేటాయించడం ద్వారా తమ దూరదృష్టిని చాటుకున్నారు.  తమిళనాడు మంత్రివర్గ విస్తరమలో వేళచ్చేరి నియోజకవర్గ ప్రతినిధి కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా యువతకు ,టెక్నాలజీకి పెద్దపీట వేసినట్లయింది. భవిష్యత్తులో ఉద్యోగాల సృష్టి, డేటా సెంటర్లు , స్మార్ట్ గవర్నెన్స్‌లో ఈ శాఖ కీలక పాత్ర పోషించనుంది.

 ఏఐ శాఖ పనులు - లక్ష్యాలు 

కొత్తగా నియమితులైన ఏఐ మంత్రుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.  తమిళనాడు ఏఐ మంత్రి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరవేయడానికి ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం, భాషా అడ్డంకులను తొలగించడానికి తమిళ భాషా ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేయడం ఈ శాఖ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా వ్యవసాయం, విద్య,  వైద్య రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం సాంకేతిక శాఖ మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఇంజిన్‌గా మారబోతోంది.

 పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన అజెండా  

ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. తమిళనాడును ఏఐ హబ్‌గా మార్చడం ద్వారా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడం మంత్రి కుమార్ ప్రాథమిక బాధ్యత. ఇప్పటికే చెన్నై ఐటీ రంగానికి నిలయంగా ఉంది, ఇప్పుడు ప్రత్యేక ఏఐ శాఖ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏఐ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం ద్వారా లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది.   

 నైపుణ్యాభివృద్ధి - భవిష్యత్తు సవాళ్లు 

ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళనల మధ్య, ఈ మంత్రిత్వ శాఖ మానవ వనరులను రీ-స్కిల్లింగ్  చేయడంపై దృష్టి సారించనుంది. కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ లో శిక్షణ ఇవ్వడం, నిరుద్యోగులను ఏఐ నిపుణులుగా మార్చడం వంటి కీలక నిర్ణయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. మంత్రి కుమార్ తన బాధ్యతలను ఎలా నిర్వహిస్తారు? ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను తమిళనాడుకు ఎలా అన్వయిస్తారు? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 

 దక్షిణాది రాష్ట్రాల మధ్య పోటీ 

కేరళ ఇప్పటికే ఏఐ కాన్క్లేవ్‌లు నిర్వహిస్తూ ఈ రంగంలో ముందుండాలని చూస్తోంది. ఇప్పుడు తమిళనాడు కూడా పోటీలోకి రావడంతో దక్షిణాది రాష్ట్రాలు టెక్నాలజీ పరంగా దేశానికే దిక్సూచిగా మారుతున్నాయి. ఏఐ శాఖ ద్వారా పారదర్శకమైన పాలనను అందిస్తూనే, ప్రైవేట్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రాజెక్టులకు కుమార్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget