అన్వేషించండి

IT Working Hours: ఉద్యోగులు ఇకపై రోజూ 14 గంటల పాటు పని చేయాలట, ఐటీ కంపెనీల కొత్త ప్రతిపాదన

IT Employees: ఉద్యోగులు రోజుకు 14 గంటల పాటు పని చేసేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించడం సంచలనమవుతోంది.

14 Hour Workday: ఐటీ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్‌పై చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి ఆ మధ్య కొన్ని కామెంట్స్ చేశారు. పని గంటల గురించి పట్టించుకోవద్దని, ప్రొడక్టివిటీ గురించి మాత్రమే ఆలోచించాలని అన్నారు. అంతే కాదు. అప్పట్లో వారానికి 70 గంటలు పని చేసే వాళ్లమని, ఇప్పుడు ఉద్యోగులంతా దీన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి పని గంటల గురించి డిబేట్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఈ చర్చ జరిగేలా చేస్తోంది. ఐటీ ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో వెంటనే ఐటీ ఉద్యోగులు తీవ్రంగా మండి పడ్డారు. అంత కన్నా అమానుషం ఇంకోటి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని గంటలు పని చేస్తే తమ ఆరోగ్యం ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. Karnataka Shops and Commercial Establishments Act చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే...ఇందులో ఐటీ కంపెనీలూ కొన్ని ప్రతిపాదనలు చేశాయి. వర్కింగ్ అవర్స్‌ని అధికారికంగా 14 గంటలకు పెంచాలని కోరాయి. 12 గంటల్ని  వర్కింగ్‌ అవర్స్‌గా ప్రకటించి మిగతా 2 గంటల్ని ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తామని వెల్లడించాయి. ప్రస్తుతానికి లేబర్ లా ప్రకారం 12 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉండాలి. అందులో 10 గంటలు నార్మల్ వర్కింగ్ అవర్స్ కాగా, మిగతా రెండు గంటలు ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తున్నారు. 

ఉద్యోగుల అసహనం..

ఐటీ కంపెనీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే..త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్‌లోనూ దీనిపై చర్చ జరగనుంది. ఐటీ ఉద్యోగులు మాత్రం ఈ ప్రతిపాదనలపై తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రస్తుతానికి ఐటీ కంపెనీలు మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నాయి. ఇలా పని గంటలు పెంచడం వల్ల రెండు షిఫ్ట్‌లకే పరిమితమయ్యే అవకాశముంది. ఈ షిఫ్ట్‌లపైనే ఆధారపడిన క్యాబ్‌ సర్వీస్‌లు సహా మరి కొన్ని విభాగాలపై ప్రభావం పడనుంది. పైగా ఉద్యోగుల ఆరోగ్యంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్ని గంటల పాటు పని చేస్తే మేమైపోవాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఇప్పటికే ఐటీ సెక్టార్‌లో ఉన్న వాళ్లలో కనీసం 45% మంది మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు. 55% మంది శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ పని గంటలు పెంచితే ఇంకా ఇబ్బందులు తప్పవని తేల్చి చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని, ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఏ ప్రకటనా చేయలేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగులను ఈ ప్రతిపాదనలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే లేఆఫ్‌ల టెన్షన్‌తో సతమతం అవుతున్న ఉద్యోగులు ఇప్పుడీ కొత్త తలనొప్పేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందో చూడాలి. 

Also Read: Serial Killer: 42 మంది మహిళల్ని చంపి ముక్కలు చేసి, ఒక్కో అవయవం ఒక్కో సంచిలో కుక్కి - సైకో కిల్లర్‌ సంచలనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget