అన్వేషించండి

IT Working Hours: ఉద్యోగులు ఇకపై రోజూ 14 గంటల పాటు పని చేయాలట, ఐటీ కంపెనీల కొత్త ప్రతిపాదన

IT Employees: ఉద్యోగులు రోజుకు 14 గంటల పాటు పని చేసేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించడం సంచలనమవుతోంది.

14 Hour Workday: ఐటీ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్‌పై చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి ఆ మధ్య కొన్ని కామెంట్స్ చేశారు. పని గంటల గురించి పట్టించుకోవద్దని, ప్రొడక్టివిటీ గురించి మాత్రమే ఆలోచించాలని అన్నారు. అంతే కాదు. అప్పట్లో వారానికి 70 గంటలు పని చేసే వాళ్లమని, ఇప్పుడు ఉద్యోగులంతా దీన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి పని గంటల గురించి డిబేట్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఈ చర్చ జరిగేలా చేస్తోంది. ఐటీ ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో వెంటనే ఐటీ ఉద్యోగులు తీవ్రంగా మండి పడ్డారు. అంత కన్నా అమానుషం ఇంకోటి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని గంటలు పని చేస్తే తమ ఆరోగ్యం ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. Karnataka Shops and Commercial Establishments Act చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే...ఇందులో ఐటీ కంపెనీలూ కొన్ని ప్రతిపాదనలు చేశాయి. వర్కింగ్ అవర్స్‌ని అధికారికంగా 14 గంటలకు పెంచాలని కోరాయి. 12 గంటల్ని  వర్కింగ్‌ అవర్స్‌గా ప్రకటించి మిగతా 2 గంటల్ని ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తామని వెల్లడించాయి. ప్రస్తుతానికి లేబర్ లా ప్రకారం 12 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉండాలి. అందులో 10 గంటలు నార్మల్ వర్కింగ్ అవర్స్ కాగా, మిగతా రెండు గంటలు ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తున్నారు. 

ఉద్యోగుల అసహనం..

ఐటీ కంపెనీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే..త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్‌లోనూ దీనిపై చర్చ జరగనుంది. ఐటీ ఉద్యోగులు మాత్రం ఈ ప్రతిపాదనలపై తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రస్తుతానికి ఐటీ కంపెనీలు మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నాయి. ఇలా పని గంటలు పెంచడం వల్ల రెండు షిఫ్ట్‌లకే పరిమితమయ్యే అవకాశముంది. ఈ షిఫ్ట్‌లపైనే ఆధారపడిన క్యాబ్‌ సర్వీస్‌లు సహా మరి కొన్ని విభాగాలపై ప్రభావం పడనుంది. పైగా ఉద్యోగుల ఆరోగ్యంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్ని గంటల పాటు పని చేస్తే మేమైపోవాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఇప్పటికే ఐటీ సెక్టార్‌లో ఉన్న వాళ్లలో కనీసం 45% మంది మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు. 55% మంది శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ పని గంటలు పెంచితే ఇంకా ఇబ్బందులు తప్పవని తేల్చి చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని, ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఏ ప్రకటనా చేయలేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగులను ఈ ప్రతిపాదనలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే లేఆఫ్‌ల టెన్షన్‌తో సతమతం అవుతున్న ఉద్యోగులు ఇప్పుడీ కొత్త తలనొప్పేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందో చూడాలి. 

Also Read: Serial Killer: 42 మంది మహిళల్ని చంపి ముక్కలు చేసి, ఒక్కో అవయవం ఒక్కో సంచిలో కుక్కి - సైకో కిల్లర్‌ సంచలనం

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Maoists Peace Talks: శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు
శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు
Pahalgam Terror Attack: పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
పాకిస్థాన్‌లో భయం భయం- విదేశాలకు చెక్కేసిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబం
Koragajja: 'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
'కాంతార'కు భిన్నంగా సుధీర్ అత్తవర్ కొత్త సినిమా 'కొరగజ్జ'...
Embed widget