అన్వేషించండి

Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు

Petrol Price Hike: కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని రూ.3 మేర పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Karnataka Govt Hikes Petrol Price: వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు అమాంతం పెచింది. ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 మేర ధర పెరిగింది. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. Karnataka Sales Tax (KST)ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ పెట్రోల్‌పై ఈ ట్యాక్స్ 25.92% ఉండగా దాన్ని 29.84%కి పెంచింది. ఇక డీజిల్‌పై 14.3% ఉన్న పన్నుని 18.4%కి పెంచింది. ఈ పెరిగిన ధరల ఆధారంగా చూస్తే బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 పైసలు కాగా డీజిల్‌ లీటర్ ధర రూ.88.94కి చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. కర్ణాటక ఫెడరేషన్‌ ఆఫ్ పెట్రోలియం ఇప్పటికే ఈ ధరల్ని అమల్లోకి తెచ్చింది. అన్ని బంక్‌లలోనూ డిజిటల్ డిస్‌ప్లేలపై ధరలు మార్చింది. 

చివరిసారి 2021 నవంబర్‌లో కర్ణాటకలో బీజేపీ హయాంలో పెట్రోల్ ధరని రూ.13.30, డీజిల్ ధరని రూ.19.40 మేర తగ్గించింది ప్రభుత్వం. కొవిడ్‌ సంక్షోభం నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే ఇలా వడ్డన మొదలైంది. 5 హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ.50-60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. అందుకే పెట్రో ధరలను పెంచిందన్న వాదన వినిపిస్తోంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.2,500-2,800 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు. భారత్‌లో తయారైన లిక్కర్‌పై 20% అదనపు పన్ను విధించింది. కొత్తగా రిజిస్టర్ అయిన వాహనాలపై 3% అదనపు సెస్‌ విధించడంతో పాటు రూ.25 లక్షలకు మించిన విద్యుత్ వాహనాలపైన లైఫ్‌టైమ్ ట్యాక్స్‌ ప్రవేశపెట్టింది. 

ఆదాయం పెంచుకునేందుకు ఇలా రకరకాల మార్గాల్లో ప్రజలపై భారం పెంచుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది లబ్ధిదారులున్నారని అంచనా. వీళ్ల కోసం కనీసం రూ.36 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. సిద్దరామయ్య ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52 వేల కోట్లు కేటాయించారు. అయినా ఈ కేటాయింపులు సరిపోతాయన్న గ్యారెంటీ లేదని కొందరు చెబుతున్నారు. అందుకే పెట్రోల్‌ డీజిల్ ధరలు పెంచింది ప్రభుత్వం. 

Also Read: Suresh Gopi: ఇందిరా గాంధీపై సురేశ్ గోపీ కీలక వ్యాఖ్యలు, మదర్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
Nara Lokesh At Prayagraj: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
Vijay Devarakonda: కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
కుంభమేళాలో తల్లితో కలిసి విజయ్ దేవరకొండ - అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు కూడా.. ఫోటోలు వైరల్
Producer SKN: 'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!
'వినోదం కన్నా వివాదంపైనే ఇంట్రెస్ట్.. ఏం చేస్తాం' - ఆ కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత క్లారిటీ!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.