అన్వేషించండి

Karnataka Elections 2023: సిలిండర్‌లకు దండలు వేసి పూజలు, బీజేపీకి కాంగ్రెస్ కార్యకర్తల కౌంటర్

Karnataka Elections 2023: కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

 Karnataka Elections 2023: 


గెలిచేది ఎవరో..? 

కర్ణాటకలో పోలింగ్ కొనసాగుతోంది. కీలక నేతలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గెలుపుపై బీజేపీ కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. ఎప్పుడూ కింగ్‌మేకర్‌గా ఉండే జేడీఎస్ కూడా ఈ సారి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రచారం చేసింది. మరోసారి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది  తామేనని బీజేపీ చాలా ధీమాగా ఉంది. 61 సీట్లలో జేడీఎస్‌కి పట్టు ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ స్థానాలే కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో అందరికన్నా ముందే ఓటు వేసిన ఆయన...బీజేపీ తప్పకుండా గెలుస్తుందని తేల్చి చెప్పారు. 75-80% ఓటర్లు తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. 

"మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చి తీరుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. 130-135 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాను"

- బీఎస్ యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి 

బొమ్మై ధీమా..

ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఓటు వేసిన తరవాత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన నేతలందరూ ప్రచారం చేయడం తమకు కలిసొస్తుందని అన్నారు. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతునిచ్చారని వెల్లడించారు. కర్ణాటక అభివృద్ధి కోసం అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అటు కాంగ్రెస్ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. "40%" కమీషన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయాలంటే అందరూ ఓటు వేయాలని సూచించారు రాహుల్ గాంధీ. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాము ఇచ్చిన 5 హామీలను ప్రస్తావిస్తూ...వాటిన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. 
 
"కర్ణాటక అభివృద్ధి కోసం మేం 5 హామీలు ఇచ్చాం.  మహిళల హక్కులు కాపాడటం, ఉద్యోగాలు, పేద ప్రజలు సంక్షేమ పథకాలు..ఇలా ఎన్నో వాటికి మేం కట్టుబడి ఉన్నాం. అందుకే కర్ణాటక అభివృద్ధికి మీరంతా కలిసి ఓటు వేయండి"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

జోరుగా ప్రచారం..

ప్రచారం విషయానికొస్తే...ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 19 పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడారు. 6 రోడ్‌షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ 12 రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించారు. ఈ సారి బీజేపీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 4% ముస్లింల రిజర్వేషన్‌ను రద్దు చేయడంపైనా ఓ వర్గం బీజేపీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అదీ కాకుండా...బీజేపీలోని ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కూడా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముంది. పైగా ధరల పెరుగుదల విషయాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. ఓటు వేసే ముందు పలు నియోజకవర్గాల్లో సిలిండర్‌కు దండలు వేసి పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget