అన్వేషించండి

లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన, కాంగ్రెస్‌పై లింగాయత్‌ల అసహనం

Karnataka Caste Survey: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ముందు కులగణన నిర్వహించడం సంచలనమవుతోంది.

Karnataka Caste Survey 2024: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలనానికి తెర తీసింది. Socio-Economic and Education Survey గా చెప్పుకునే కులగణనను పూర్తి చేసింది. ఆ రిపోర్ట్ ఇప్పటికే సిద్దరామయ్య వద్దకు వెళ్లింది. ఇప్పటికే దీనిపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ నివేదికలోని వివరాలు ఇంకా బయటకు రాకపోయినప్పటికీ...అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా కుల గణన చేపట్టడం కీలకంగా మారింది. Karnataka State Commission for Backward Classes ఛైర్మన్ కే జయప్రకాశ్ హెగ్డే ఈ రిపోర్ట్‌ని తయారు చేసి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అందజేశారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం...షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తరవాత ముస్లింలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరవాత లింగాయత్‌లు, వొక్కళిగల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తరవాత కురుబల జనాభా కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. అటు దళితుల సంఖ్య కూడా భారీగానే ఉంది. త్వరలోనే కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ భేటీలోనే ఈ నివేదిరపై చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే వెల్లడించారు. ఆ తరవాతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. 

"ఈ రిపోర్ట్‌లో ఏముందో ఇంత వరకూ తెలియదు. రిపోర్ట్ మాత్రం ప్రభుత్వానికి అందింది. కేబినెట్ సమావేశంలో దీని గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. అక్కడ చర్చించిన తరవాతే ఆ నివేదిక ఆధారంగా ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాం"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

లక్షా 60 వేల మంది అధికారుల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదిక తయారు చేసినట్టు జయప్రకాశ్ హెగ్డే స్పష్టం చేశారు. వీళ్లతో పాటు 1.33 లక్షల ఉపాధ్యాయుల సహకారమూ తీసుకున్నట్టు వెల్లడించారు. అన్ని జిల్లాల డిప్యుటీ కమిషనర్ల నుంచి సమాచారం సేకరించినట్టు తెలిపారు. అయితే...ఈ సర్వే లింగాయత్‌లు, వక్కళిగలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అశాస్త్రీయమైన విధానంలో సర్వే చేశారని మండి పడుతున్నారు. కొత్తగా మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ఆ రిపోర్ట్‌లో ఏముందో ఇంకా తెలియదని, అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతోంది. 

మరో అలజడి..

రూ. కోటి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి ఏటా 10% ట్యాక్స్ వసూలు చేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూవ్యతిరేక ప్రభుత్వం అంటూ బీజేపీ మండి పడింది. అయితే...ఈ విషయంలో చాలా పట్టుదలతో ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేలా చేసుకుంది. శాసనమండలిలో మాత్రం సిద్దరామయ్య సర్కార్‌కి షాక్ తగిలింది. మండలిలో ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార కాంగ్రెస్ కన్నా శాసనమండలిలో బీజేపీకే ఎక్కువ మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కి 30 మంది MLCలు ఉండగా..బీజేపీకి 35 మంది ఉన్నారు. జేడీఎస్ నుంచి 8 మంది ఎమ్‌ఎల్‌సీలు ఉన్నారు. బీజేపీ MLCలు ఈ బిల్‌ని వ్యతిరేకించారు. ప్రభుత్వం Karnataka Hindu Religious Institutions and Charitable Endowment Amendment Bill 2024 పేరిట ఈ బిల్‌ తీసుకొచ్చింది. 

Also Read: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన ప్రతిపక్షాల పొత్తు లెక్కలు, త్వరలోనే అధికారిక ప్రకటన!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Embed widget