By: ABP Desam | Updated at : 07 Sep 2021 07:27 PM (IST)
Edited By: Murali Krishna
బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అరెస్ట్
కొత్త సాగు చట్టాలపై రైతుల అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వేలాది మంది అన్నదాతలు హరియాణాలోని వివిధ ప్రాంతాల నుంచి కర్నాల్ లో ఏర్పాటు చేసిన కిసాన్ మాహా పంచాయత్ కు హాజరయ్యేందుకు తరలివెళ్తున్నారు. వందలాది మంది పారామిలిటరీ దళాలు, పోలీసులను మోహరించింది సర్కార్. అయినప్పటికీ రైతులు.. బైక్ లు, ట్రాక్టర్లు సహా ఏది దొరికితే ఆ వాహనంపై కర్నల్ కు చేరుకుంటున్నారు. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా కర్నాల్ చేరితీరతామని చెబుతున్నారు.
#WATCH | Following Kisan Mahapanchayat at Anaj Mandi, protesting farmers now head to Mini Secretariat in Karnal, Haryana. pic.twitter.com/6CQaKSQ7hZ
— ANI (@ANI) September 7, 2021
అయితే ఈ సందర్భంగా 11 మంది రైతు నేతలతో కూడిన బృందం జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలమైనట్లు రైతులు తెలిపారు.
The talk (between farmer leaders & Karnal district administration) has failed. We will decide the next strategy in the (Anaj) Mandi: Bharatiya Kisan Union (Chaduni) chief Gurnam Singh Chaduni in Karnal, Haryana https://t.co/xXXr7xsmOt pic.twitter.com/3dlaF3mjOS
— ANI (@ANI) September 7, 2021
టికాయత్ అరెస్ట్..
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల రైతు సంఘాల నేతలు యోగెంద్ర యాదవ్, రాకేశ్ టికాయత్ సహా సంయుక్త కిసాన్ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.
करनाल प्रशासन के साथ किसानों के साथ बातचीत विफल।
— Yogendra Yadav (@_YogendraYadav) September 7, 2021
पुलिस ने मुझे, राकेश टिकैत सहित संयुक्त किसान मोर्चा के सभी नेताओं को नमस्ते चौक से हिरासत में ले लिया है। #KarnalProtest_AgainstLathicharge
భారీ భద్రత..
ఆగస్టు 28 కర్నాల్ లో రైతులపై జరిగిన లాఠీ ఛార్జిని నిరసిస్తూ అన్నదాతలు హరియాణాలోని మినీ సెక్రటేరియట్ ను ముట్టడించాలని ఆలోచిస్తున్నారు. కర్నాల్ లో పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించింది సర్కార్. మొత్తం 40 కంపెనీల బలగాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
రైతుల డిమాండ్..
కర్నాల్ లో ఇటీవల రైతులపై లాఠీ ఛార్జికి ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు.
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల
Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు
Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!
Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్గా రిజెక్ట్ చేసిన వసుధార