అన్వేషించండి

Kanwar Yatra: కన్వార్‌ యాత్ర వివాదంలో యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, ఉత్తర్వులు ఆపేయాలని నోటీసులు

Kanwar Yatra Row: కన్వార్ యాత్ర వివాదంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Kanwar Yatra Controversy: కన్వార్ యాత్ర వివాదంపై (Kanwar Yatra Row) సుప్రీంకోర్టు యోగి సర్కార్‌కి షాక్ ఇచ్చింది. యాత్ర జరిగే దారిలో షాప్‌లు కచ్చితంగా నేమ్‌బోర్డ్‌లు పెట్టుకోవాలని, ఓనర్ల పేర్లు కూడా రాయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై అసహనం వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని తేల్చి చెప్పింది. ఫుడ్‌ షాప్‌లలో నేమ్ బోర్డ్‌లలో కేవలం మెనూ మాత్రమే డిస్‌ప్లే చేస్తారని, పేర్లతో పనేముందని ప్రశ్నించింది. జస్టిస్ రుషికేశ్ రాయ్‌, జస్టిస్ SVN భట్టితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీతో పాటు ఇవే ఉత్తర్వులు ఇచ్చిన ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరిపింది. ఈ విచారణ సమయంలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ఎలాంటి అధికారం లేకుండానే ఈ ఉత్తర్వులు జారీ చేశారని, చట్టపరంగా ఇలాంటివి ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని తేల్చి చెప్పారు. 

"ఇవి పూర్తిగా ప్రజల్ని తప్పుదోవపట్టించే ఉత్తర్వులు. హోటల్ యజమానులు పేర్లు డిస్‌ప్లే చేయకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. వేలాది కిలోమీటర్ల పొడవునా యాత్ర జరుగుతుంది. ఆ దారిలో ఎన్నో దుకాణాలున్నాయి. వాళ్లంతా ఎలా బోర్డ్‌లు పెడతారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతుకున్న వాళ్లున్నారు. ఓ హోటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి మెనూని చూస్తాం కానీ మనకి సర్వ్ చేసే వాళ్లు ఎవరని ఆలోచిస్తామా. ఓ వర్గంపై కావాలని వివక్ష చూపించినట్టే అవుతోంది. ఇది ఏ మాత్రం రాజ్యాంగబద్ధం కాదు"

- అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ అడ్వకేట్ 

ఎన్నో దశాబ్దాలుగా ఈ యాత్ర జరుగుతోందని, అన్ని వర్గాలూ ఒకరికొకరు సాయం చేసుకుని యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నాయని సింఘ్వీ వివరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ పోలీస్‌ కమిషనర్‌కీ ఈ అధికారాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కన్వార్ యాత్ర జరిగే దారిలో అన్ని షాప్‌లు ఓనర్ పేర్లు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఆ తరవాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాల నుంచే కాకుండా NDA మిత్రపక్షాలైన RLD, JDU నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. 

Also Read: Viral News: అదిరేటి డ్రెస్ మీరేస్తే - ర్యాంప్ వాక్ చేస్తున్న మోదీ, కిమ్‌ని చూశారా - AI ఫ్యాషన్‌ షో మాయ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget