అన్వేషించండి

Kanwar Yatra: కన్వార్‌ యాత్ర వివాదంలో యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, ఉత్తర్వులు ఆపేయాలని నోటీసులు

Kanwar Yatra Row: కన్వార్ యాత్ర వివాదంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Kanwar Yatra Controversy: కన్వార్ యాత్ర వివాదంపై (Kanwar Yatra Row) సుప్రీంకోర్టు యోగి సర్కార్‌కి షాక్ ఇచ్చింది. యాత్ర జరిగే దారిలో షాప్‌లు కచ్చితంగా నేమ్‌బోర్డ్‌లు పెట్టుకోవాలని, ఓనర్ల పేర్లు కూడా రాయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై అసహనం వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని తేల్చి చెప్పింది. ఫుడ్‌ షాప్‌లలో నేమ్ బోర్డ్‌లలో కేవలం మెనూ మాత్రమే డిస్‌ప్లే చేస్తారని, పేర్లతో పనేముందని ప్రశ్నించింది. జస్టిస్ రుషికేశ్ రాయ్‌, జస్టిస్ SVN భట్టితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీతో పాటు ఇవే ఉత్తర్వులు ఇచ్చిన ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరిపింది. ఈ విచారణ సమయంలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ఎలాంటి అధికారం లేకుండానే ఈ ఉత్తర్వులు జారీ చేశారని, చట్టపరంగా ఇలాంటివి ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని తేల్చి చెప్పారు. 

"ఇవి పూర్తిగా ప్రజల్ని తప్పుదోవపట్టించే ఉత్తర్వులు. హోటల్ యజమానులు పేర్లు డిస్‌ప్లే చేయకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. వేలాది కిలోమీటర్ల పొడవునా యాత్ర జరుగుతుంది. ఆ దారిలో ఎన్నో దుకాణాలున్నాయి. వాళ్లంతా ఎలా బోర్డ్‌లు పెడతారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతుకున్న వాళ్లున్నారు. ఓ హోటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి మెనూని చూస్తాం కానీ మనకి సర్వ్ చేసే వాళ్లు ఎవరని ఆలోచిస్తామా. ఓ వర్గంపై కావాలని వివక్ష చూపించినట్టే అవుతోంది. ఇది ఏ మాత్రం రాజ్యాంగబద్ధం కాదు"

- అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ అడ్వకేట్ 

ఎన్నో దశాబ్దాలుగా ఈ యాత్ర జరుగుతోందని, అన్ని వర్గాలూ ఒకరికొకరు సాయం చేసుకుని యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నాయని సింఘ్వీ వివరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ పోలీస్‌ కమిషనర్‌కీ ఈ అధికారాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కన్వార్ యాత్ర జరిగే దారిలో అన్ని షాప్‌లు ఓనర్ పేర్లు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఆ తరవాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాల నుంచే కాకుండా NDA మిత్రపక్షాలైన RLD, JDU నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. 

Also Read: Viral News: అదిరేటి డ్రెస్ మీరేస్తే - ర్యాంప్ వాక్ చేస్తున్న మోదీ, కిమ్‌ని చూశారా - AI ఫ్యాషన్‌ షో మాయ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget