అన్వేషించండి

Emergency Day: ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినోత్సవం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేంద్రం సంచలన ప్రకటన

Emergency in India: ఏటా జూన్ 24వ తేదీన సంవిధాన్ హత్యా దినోత్సవంగా జరుపుతామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Amit Shah: 1975లో జూన్ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఈ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా (Samvidhaan Hatya Diwas) జరుపుతామని సంచలన ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని తెలిపారు. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నియంతృత్వ వైఖరితో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారని విమర్శించారు. ప్రజాస్వామ్య గొంతుకను అణిచివేసి ఈ దారుణానికి పాల్పడ్డారని మండి పడ్డారు. లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియానీ అణిచివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"1975లో జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లకు పంపారు. మీడియా గొంతుకనూ అణచిపెట్టారు. ఈ చీకటి రోజుకి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా జూన్ 25వ తేదీన సంవిధాన్ హత్యా దినోత్సవ్‌గా జరుపుతాం. అప్పటి అమానవీయ నిర్ణయానికి బలి అయిన వాళ్లను నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నాం"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి 

 

రాజ్యాంగం గురించి బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే బీజేపీ ఈ సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని ఏటా ప్రజలకు గుర్తు చేసేలా వ్యూహం రచించింది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లి ప్రతి చోటా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 400 సీట్ల మెజార్టీ వస్తే బీజేపీ తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటుందని ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇది ఎంతో కొంత ప్రభావం చూపించింది. అయితే...అటు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగింది. అందులో భాగంగానే ఈ సంవిధాన్ హత్యా దివస్‌ని ప్రకటించింది. ఇలా పరోక్షంగా ఆ పార్టీకి చురకలు అంటించింది. ఇకపై కాంగ్రెస్ ఎప్పుడు రాజ్యాంగం గురించి ప్రస్తావించినా బీజేపీ ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకొచ్చి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.అమిత్‌ షా పెట్టిన పోస్ట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని ఎంత అవమానానికి గురైందో గుర్తు చేయడానికే ఈ సంవిధాన్ హత్యా దివస్‌ని జరుపుతున్నట్టు ప్రకటించారు. భారత దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి తెర తీసిందని కాంగ్రెస్‌పై తీవ్రంగా మండి పడ్డారు. 

 

Also Read: IAS Trainee: ఆరోపణలపై స్పందించిన IAS ట్రైనీ, ఆ అధికారం లేదని కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget