By: ABP Desam | Updated at : 12 Aug 2023 01:16 PM (IST)
Edited By: jyothi
నాణ్యమైన మందులు అందిచడమే లక్ష్యంగా రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు
Janaushadhi Kendras: రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇండియన్ రైల్వేస్ ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల ఏర్పాటుకు నూతన విధానాన్ని రూపొందించింది. రైల్వే స్టేషన్ల ప్రాంగణ ప్రాంతాల్లో ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో సహా దేశవ్యాప్తంగా ఉన్న 50 రైల్వే స్టేషన్లు పైలట్ ప్రాజెక్టు కోసం గుర్తించారు. రోజువారీ మిలియన్ల కొద్దీ ప్రయాణించే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు నాణ్యమైన మందులు, వినియోగ వస్తువులు అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే భారత ప్రభుత్వ మిషన్ ను ప్రచారం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు, సందర్శకులు జనౌషధి ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరసమైన ధరలకే మందులను అందించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాల్లో ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందించనున్నారు. అలాగే ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఈ కేంద్రాలను తెరవడానికి వ్యవస్థాపకులకు మార్గాలను రూపొందిస్తున్నారు.
"Pradhan Mantri Jan Bhartiya Janaushadhi Kendras to be Established at #Secunderabad and #Tirupati Railway Stations"@RailMinIndia @drmsecunderabad @drmgtl pic.twitter.com/8Dl949qMV7
— South Central Railway (@SCRailwayIndia) August 11, 2023
వాస్తవానికి ఇది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే అత్యవసరమైన సౌకర్యంగా పరిగణించబడుతోంది. తదనుగుణంగా రైల్వే లైసెన్సుల ద్వారా వాణిజ్య మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు, ప్రయాణ ప్రాంగణంలో, స్టేషన్లలో ఫ్యాబ్రికేటెడ్ అవుట్ లెట్ లను అందిస్తోంది. అవుట్ లెట్లు సౌకర్యవంతమైన ప్రదేశాల్లో సర్క్యులేటింగ్ ప్రాంతాలు ఉంటాయి. తద్వారా సందర్శించే ప్రయాణికులు ప్రయోజనాలు పొందుతారు. అయితే రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించబడిన ప్రదేశాల్లో పి.ఎమ్.బి.జే.కెలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. ఐఆర్ఈపీఎస్ ద్వారా సంబంధిత రైల్వే డివిజన్ ల మాదిరిగానే ఈ వేలం స్టాల్స్ అందించబడతాయి. ఈ స్టాల్స్ ను ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తోంది. అవుట్ లెట్ల విజయవంతమైన బిడ్డర్లు ఔషధ దుకాణాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందాలి. అలాగే ఔషధాల నిల్వ కోసం అన్ని రకాల చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలి. జనౌషధి స్కీమ్ పి.ఎమ్.బి.జే.కే చే నిర్దేశించినట్లుగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి.
PM Janaushadhi Kendras to be set up at Sec❜bad, Tirupati rly stations@RailMinIndia @MoHFW_INDIA pic.twitter.com/pRKdtpevlb
— South Central Railway (@SCRailwayIndia) August 12, 2023
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లు ఇవే..!
Minister KTR: 75 ఏళ్లలో సాధ్యం కానిది కేవలం ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశాడు : మంత్రి కేటీఆర్
2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?
Telangana Elections: కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు, కాంగ్రెస్ కు 75కు పైగా సీట్లు: ప్రేమ్ సాగర్ రావు
Suicide Blast: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి
Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్డెవలప్మెంట్ కేసుల్లో బెయిల్కు ప్రయత్నాలు
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ చూశారా?
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
/body>