అన్వేషించండి

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి కేవలం అక్కడ పర్యాటకులపై కాదు.. దేశ పర్యాటకం, కశ్మీరీల ఉపాధిపై జరిగిన దాడి!

Pahalgam Attack: పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలోని ఉన్న బైసరన్ ప్రాంతంలో జరిగింది ఉగ్రదాడి. టూరిస్టులను టార్గెట్ చేసుకుంటూ జరిగిన ఈ దాడి వాస్తవానికి కశ్మీరీల ఉపాధిపై ప్రభావం చూపనుంది

 Pahalgam Terror Attack:  జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి. పచ్చదనం పరుచుకున్నట్టు ఆహ్లాదకరంగా  ఉండే ఈ ప్రాంతం మనదేశీయులనే కాదు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

అక్టోబరు నుంచి ఫిబ్రవరి నుంచి పూర్తిగా మంచుతో కప్పిఉండే పహల్గాం మార్చి నుంచి జూన్ వరకూ సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలా అనిపించడంతో పహల్గాంని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు.

పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఇలాంటి ప్రదేశంలో ఉగ్రదాటి అంటే ఇది టూరిస్టులపై కాదు కాశ్మీరీల ఉపాధిపై, ఆర్థికవ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలంటారు విశ్లేషకులు.  

భూతలస్వర్గంగా పిలిచే కశ్మీర్లో నివసించేవారికి పర్యాటకమే ప్రధాన ఆదాయవనరు. ఈ ప్రదేశంలో జరిగిన దాడివల్ల టూరిస్టులు ఇక్కడకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఉగ్రదాడి ఘటన పర్యాటకుల్లో నమ్మకాన్ని కోల్పోవడమే కాదు కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన టూరిజం ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టేసింది. పర్యాటకులపై దూసుకెళ్లిన ఒక్కోతూటా కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్ల వెనక్కు తీసుకెళ్లిపోయింది.

ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రభావంతో ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమేకాదు..స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా రద్దు చేసుకున్నారు.  

కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారిక లెక్కలప్రకారం గతేడాది కశ్మీర్ లో 35 లక్షల మంది పర్యటించారు. 2020లో ఈ సంఖ్య 34 లక్షలు ఉండేది..2021 నాటికి  కోటి 13 లక్షలుకి చేరింది. 2022 లో కోటి 88 లక్షలు, 2023 లో 2 కోట్ల 11 లక్షలు, 2024 లో ఈ లెక్క 2 కోట్ల 36 లక్షలకి చేరింది.

కేవలం పర్యాటకం వల్ల కశ్మీర్ కి ఏడాదికి 12 వేలకోట్లు ఆదాయం వస్తుందని అధికారిక అంచనా.  2030 నాటికి ఈ ఆదాయం 25 నుంచి 30 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో ఈ అంచనాలు అందుకోవాలంటే మరికొన్నేళ్లు పట్టేస్తుందన్నది విశ్లేషకుల  అభిప్రాయం.

వాస్తవానికి మార్చి నుంచి పహల్గాంలో మొదలయ్యే సందడి మే నాటికి భారీగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే సెలవులు ప్రారంభం కావడంతో పర్యాటకుల సందడి మొదలవుతోంది.  మే నెలలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సీజన్ ప్రారంభంలోనే ఈ దాడి జరగడంతో ఇక ఈ ఏడాది మొత్తం ఆ ప్రభావం కశ్మీర్ పర్యాటకంపై పడుతుందంటున్నారు  విశ్లేషకులు.

పహల్గాంలో వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశాలు  చందన్‌వరీ, బైసరన్, శేష్‌నాగ్ లేక్, పంచతర్ణి, అమర్‌నాథ్ గుహ, అరు వ్యాలీ, లిడ్డర్‌వాట్. దాల్ సరస్సులో ఈ సీజన్లో 15వందల కన్నా ఎక్కువ హౌస్ బోట్లు పనిచేస్తాయ్. ఉగ్రదాడికి భయపడి ఇప్పటికే కశ్మీర్లో ఉన్న పర్యాటకులంతా హోటల్స్, బోట్ హౌస్ లు ఖాళీ చేసి తిరుగుప్రయాణం అయ్యారు. దేశ విదేశాల నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారంతా వెనక్కు తగ్గారు. ఈ భయం పర్యాటకులను ఎన్నాళ్లు వెంటాడుతుందో..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget