అన్వేషించండి

IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి

IRCTC Compensation : ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం ఇచ్చే పథకాన్ని నిలిపివేనట్టు IRCTC తెలిపింది. ఐదేళ్ల క్రితం నుంచే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పింది.

IRCTC Compensation : ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం ఇచ్చే పథకాన్ని ఐదేళ్ల క్రితమే నిలిపివేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద వార్తా సంస్థ పీటీఐ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా రైల్వే మొత్తం క్యాటరింగ్ అండ్ టూరిజం కార్యకలాపాలను నిర్వహించే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించింది. ఇది ప్రస్తుతం టిక్కెట్ బుకింగ్, ప్రైవేట్ రైళ్లను కూడా నిర్వహిస్తోంది.

IRCTC ప్రకారం, ఈ పథకం కింద, అక్టోబర్ 4, 2019 నుండి ఫిబ్రవరి 16, 2024 వరకు ప్రయాణీకులకు రూ.26లక్షలు పరిహారంగా అందించింది. అందిన సమాచారం ప్రకారం, 2023-24 సంవత్సరంలో ప్రయాణీకులకు మొత్తం రూ.15.65 లక్షల పరిహారం అందించింది. IRCTC, ఆర్టీఐకి ప్రతిస్పందిస్తూ, “ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై పరిహారం అందించే పథకం ఫిబ్రవరి 15, 2024 నుండి నిలిపివేశాం” అని స్పష్టం చేసింది. అందుకు గల కారణాలు గోప్యంగా ఉంచామని, వెల్లడించలేమని తెలిపింది.

ఆర్టీఐ ప్రత్యుత్తరం ప్రకారం, IRCTC రెండు తేజస్ రైళ్లను నడుపుతోంది. అందులో ఒకటి న్యూఢిల్లీ నుండి లక్నో (అక్టోబర్ 4, 2019 నుండి), మరొకటి అహ్మదాబాద్ నుండి ముంబైకి (జనవరి 17, 2020 నుండి).  

2019 నుంచి IRCTC అందించిన నష్ట పరిహారం

2019-20లో రూ.1.78 లక్షలు, 2020-21లో సున్నా, 2021-22లో రూ.96,000, 2022-23లో రూ.7.74 లక్షలు, 2023-24లో రూ.15.65 లక్షలు ప్రయాణికులకు అందించినట్లు కార్పొరేషన్ తెలిపిందని ఆర్టీఐ చెప్పింది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఎంత పరిహారం అందుతుందన్న ప్రశ్నపై.. 60 నుంచి 120 నిమిషాల ఆలస్యానికి రూ.100,120 నుంచి 240 నిమిషాలు ఆలస్యమైతే రూ.250 పరిహారంగా అందజేశామని తెలిపింది. IRCTC రూల్స్ ప్రకారం, ట్రైన్ క్యాన్సిల్ అయితే, ప్రయాణీకులకు పూర్తి ఛార్జీలు తిరిగి చెల్లిస్తారు. ఆలస్యమైతే మాత్రం ప్రయాణీకులకు ఆహారం, నీటి సౌకర్యాలు కూడా అందిస్తారు.  

ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు ఇండియన్ రైల్వే అనేక సౌకర్యాలను అందిస్తుంది. దీని గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియకపోవచ్చు. రైలు టిక్కెట్‌తోనే మీరు అనేక ఉచిత సౌకర్యాలను కూడా పొందవచ్చు. భారతీయ రైల్వే స్టేషన్‌లో ఆహారం నుండి ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేస్తుంది. అయితే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే ప్రయాణికులు వివిధ రకాల సౌకర్యాలను పొందుతారు. అందులో ఫ్రీ బెడ్‌రోల్, మెడికల్ టెస్ట్, ఫుడ్, వెయిటింగ్ రూమ్ లాంటివి ఉంటాయి.

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మరింతగా విస్తరించాయి. వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తూ ముందుకుసాగుతున్నాయి. ఈ ఏడాది పలు రూట్లలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. వందేభారత్ రైళ్ల ద్వారా ప్రజలు సరికొత్త ప్రయాణ అనుభూతిని పొందుతున్నారు. భారతీయ రైల్వే సంస్థ 2024లో ఏకంగా 30కి పైగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. 2024 చివరి నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 136 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి.

Also Read : Year Ender 2024: ఈ ఏడాది ఉద్యోగాల కోతను చూస్తే భయమేస్తుంది - గ్లోబల్‌ కంపెనీల్లో మేజర్‌ లేఆఫ్స్‌

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
CWG Ajaya Babu: తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget