అన్వేషించండి

IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి

IRCTC Compensation : ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం ఇచ్చే పథకాన్ని నిలిపివేనట్టు IRCTC తెలిపింది. ఐదేళ్ల క్రితం నుంచే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పింది.

IRCTC Compensation : ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం ఇచ్చే పథకాన్ని ఐదేళ్ల క్రితమే నిలిపివేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద వార్తా సంస్థ పీటీఐ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా రైల్వే మొత్తం క్యాటరింగ్ అండ్ టూరిజం కార్యకలాపాలను నిర్వహించే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించింది. ఇది ప్రస్తుతం టిక్కెట్ బుకింగ్, ప్రైవేట్ రైళ్లను కూడా నిర్వహిస్తోంది.

IRCTC ప్రకారం, ఈ పథకం కింద, అక్టోబర్ 4, 2019 నుండి ఫిబ్రవరి 16, 2024 వరకు ప్రయాణీకులకు రూ.26లక్షలు పరిహారంగా అందించింది. అందిన సమాచారం ప్రకారం, 2023-24 సంవత్సరంలో ప్రయాణీకులకు మొత్తం రూ.15.65 లక్షల పరిహారం అందించింది. IRCTC, ఆర్టీఐకి ప్రతిస్పందిస్తూ, “ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై పరిహారం అందించే పథకం ఫిబ్రవరి 15, 2024 నుండి నిలిపివేశాం” అని స్పష్టం చేసింది. అందుకు గల కారణాలు గోప్యంగా ఉంచామని, వెల్లడించలేమని తెలిపింది.

ఆర్టీఐ ప్రత్యుత్తరం ప్రకారం, IRCTC రెండు తేజస్ రైళ్లను నడుపుతోంది. అందులో ఒకటి న్యూఢిల్లీ నుండి లక్నో (అక్టోబర్ 4, 2019 నుండి), మరొకటి అహ్మదాబాద్ నుండి ముంబైకి (జనవరి 17, 2020 నుండి).  

2019 నుంచి IRCTC అందించిన నష్ట పరిహారం

2019-20లో రూ.1.78 లక్షలు, 2020-21లో సున్నా, 2021-22లో రూ.96,000, 2022-23లో రూ.7.74 లక్షలు, 2023-24లో రూ.15.65 లక్షలు ప్రయాణికులకు అందించినట్లు కార్పొరేషన్ తెలిపిందని ఆర్టీఐ చెప్పింది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఎంత పరిహారం అందుతుందన్న ప్రశ్నపై.. 60 నుంచి 120 నిమిషాల ఆలస్యానికి రూ.100,120 నుంచి 240 నిమిషాలు ఆలస్యమైతే రూ.250 పరిహారంగా అందజేశామని తెలిపింది. IRCTC రూల్స్ ప్రకారం, ట్రైన్ క్యాన్సిల్ అయితే, ప్రయాణీకులకు పూర్తి ఛార్జీలు తిరిగి చెల్లిస్తారు. ఆలస్యమైతే మాత్రం ప్రయాణీకులకు ఆహారం, నీటి సౌకర్యాలు కూడా అందిస్తారు.  

ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు ఇండియన్ రైల్వే అనేక సౌకర్యాలను అందిస్తుంది. దీని గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియకపోవచ్చు. రైలు టిక్కెట్‌తోనే మీరు అనేక ఉచిత సౌకర్యాలను కూడా పొందవచ్చు. భారతీయ రైల్వే స్టేషన్‌లో ఆహారం నుండి ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేస్తుంది. అయితే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే ప్రయాణికులు వివిధ రకాల సౌకర్యాలను పొందుతారు. అందులో ఫ్రీ బెడ్‌రోల్, మెడికల్ టెస్ట్, ఫుడ్, వెయిటింగ్ రూమ్ లాంటివి ఉంటాయి.

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మరింతగా విస్తరించాయి. వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తూ ముందుకుసాగుతున్నాయి. ఈ ఏడాది పలు రూట్లలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. వందేభారత్ రైళ్ల ద్వారా ప్రజలు సరికొత్త ప్రయాణ అనుభూతిని పొందుతున్నారు. భారతీయ రైల్వే సంస్థ 2024లో ఏకంగా 30కి పైగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. 2024 చివరి నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 136 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి.

Also Read : Year Ender 2024: ఈ ఏడాది ఉద్యోగాల కోతను చూస్తే భయమేస్తుంది - గ్లోబల్‌ కంపెనీల్లో మేజర్‌ లేఆఫ్స్‌

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
Heart Attack : గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
SSMB 29: ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
Heart Attack : గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
SSMB 29: ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
Rohit Sharma Records: 37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Embed widget