అన్వేషించండి

రోడ్డు ప్రమాదంలో ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ మృతి, సైక్లింగ్ చేస్తుండగా ఢీకొట్టిన కార్

Avtar Saini Death: ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Intel India Ex Chief Avtar Saini Death: ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఓ టౌన్‌షిప్‌లో సైక్లింగ్ చేస్తుండగా ఓ క్యాబ్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 5.50 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. నెరూల్ ఏరియాలో పామ్ బీచ్ రోడ్‌లో తన స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తుండగా క్యాబ్ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్యాబ్ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడికక్కడే పడిపోయిన అవతార్ సైనీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చెంబూర్‌లో ఉంటున్నారు.  Intel 386,486 మైక్రోప్రాసెసర్స్‌ తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెంటియమ్ ప్రాసెసర్ డిజైన్‌ తయారీలోనూ ఆయన పని చేశారు. క్యాబ్ డ్రైవర్‌పై పోలీసులు FIR నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌ కేసు పెట్టారు.మిగతా సైక్లిస్ట్‌లు ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమయ్యారు. క్యాబ్‌ డ్రైవర్‌ని పోలీసులకు అప్పగించారు. మూడేళ్ల క్రితం అవతార్ సైనీ భార్య చనిపోయారు. అప్పటి నుంచి ఆయన ఒక్కరే ఉంటున్నారు. కూతురు, కొడుకు అమెరికాలో ఉంటున్నారు. వచ్చే నెల సైనీ కూడా అమెరికాకి వెళ్లాల్సి ఉంది. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ గోకుల్ వి సుబ్రహ్మణ్యం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఇంటెల్‌కి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. 1982 నుంచి 2004 మధ్య కాలంలో అవతార్ సైనీ ఇంటెల్ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

"ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్ అవతార్ సైనీ మృతి మాకెంతో విచారం కలిగించింది. భారత్‌లో ఇంటెల్ R&D సెంటర్‌ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. కంపెనీకి ఎన్నో విలువైన సలహాలు అందించిన ఆయన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం"

- గోకుల్ వి సుబ్రహ్మణ్యం, ఇంటెల్ ఇండియా ప్రెసిడెంట్ 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget