By: Ram Manohar | Updated at : 09 Jul 2023 10:24 AM (IST)
వందేభారత్ ట్రైన్లు ఇకపై కాషాయ రంగులో కనిపించనున్నాయి. (Image Credits: Twitter)
Vande Bharat Express:
రంగు మారింది..
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల రంగుని మార్చేసింది రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై అందుబాటులోకి వచ్చే వందేభారత్ ట్రైన్లు ఇదే రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త కాషాయ వందేభారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని Integral Coach Factoryలో ఉంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో 25 రకాల డిజైన్లతో వందేభారత్ ట్రైన్లు తయారు చేశారు. ఇవన్నీ సర్వీస్లు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్లో ఉంచారు. 28వ వందేభారత్ ట్రైన్కి మాత్రం ట్రయల్ బేసిస్లో ఇలా రంగు మార్చారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సేఫ్టీ మెజర్స్ని పరిశీలించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్లో చేసిన మార్పులుచేర్పులనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరవాత ఆయన కీలక వివరాలు వెల్లడించారు. దేశ త్రివర్ణ ప్రతాకం నుంచి స్ఫూర్తి పొంది వందేభారత్కి కాషాయ రంగు వేసినట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
"ఇది మేకిన్ ఇండియా కాన్సెప్ట్. అంటే...ఇంజనీర్లు, టెక్నీషియన్లు అంతా ఇండియాకు చెందిన వాళ్లే. ఇప్పటికే కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫీల్డ్ యూనిట్ల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నాం. ఏసీలు ఎలా పని చేస్తున్నాయి..? టాయిలెట్లు శుభ్రంగా ఉంటున్నాయా లేదా అన్న వివరాలు అడుగుతున్నాం. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే వందేభారత్ ట్రైన్లలో మార్పులు చేస్తున్నాం. డిజైన్లోనూ మార్పులు జరుగుతున్నాయి"
- అశ్వినీ వైష్ణవ్, రైల్వేమంత్రి
Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023
టికెట్ ధరలు తగ్గింపు..
రైల్వే బోర్డ్ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. వందేభారత్తో పాటు అన్ని AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైళ్ల టికెట్ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25% మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ 50% కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే...ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగం మరింత పెంచేందుకు టికెట్ ధరల్ని తగ్గించినట్టు వివరించింది. ఈ ధరలు తగ్గించే అధికారం జోనల్ రైల్వేస్కే అప్పగించింది రైల్వే శాఖ. అయితే..బేసిక్ ఫేర్పైనే ఈ 25% తగ్గింపు ఉంటుంది. మిగతా ఛార్జీలు..అంటే రిజర్వేషన్ ఛార్జ్లు, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జ్, GST ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే ప్రకటించింది. ఈ తగ్గింపు కేవలం ఏసీ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రైన్లకు మాత్రమే వర్తిస్తుంది. టికెట్ బేస్ ఫేర్పై 25% తగ్గింపు లభిస్తుంది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే...గత నెల రోజుల్లో 50% తక్కువ ఆక్యుపెన్సీ నమోదైన రైళ్లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎండ్ టు ఎండ్ జర్నీకే కాకుండా మధ్య స్టేషన్లలో దిగిపోయే వారు కూడా 25% తగ్గింపుతో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ స్కీమ్ కొనసాగే అవకాశాలున్నాయి.
Also Read: GSTN: 'జీఎస్టీ' నెట్వర్క్ ఇక మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి! దర్యాప్తు సంస్థలకు ప్రయోజనం
Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్
PGCIL: పీజీసీఐఎల్లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
/body>