అన్వేషించండి

Who Do Not Speak Hindi Should Leave India : దేశంలో ఉండాలంటే హిందీ మాట్లాడాల్సిందే ! ఈ బీజేపీ మంత్రి అదే చెబుతున్నారు !

దేశంలో ఉండాలంటే హిందీ మాట్లాడాల్సిందేనని యూపీ బీజేపీ మంత్రి సంజయ్ నిషాద్ తేల్చి చెప్పారు. ఇటీవల దక్షిణాదిలో హిందీపై జరుగుతున్న చర్చ రచ్చ అవుతున్న సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

 

హిందీ భాషపై దక్షిణాదిలో ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. హిందీ జాతీయ భాష కాదని దక్షిణాది తారలు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదన కూడా అదే. కానీ కేంద్రం మాత్రం.. హిందీని రాష్ట్రాల్లో నేర్చుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా  సినిమాల ప్రభంజనంలో దక్షిణాది సినిమాలు డబ్బింగ్‌ అయి రికార్డు వసూళ్లు సాధిస్తు్న్నాయి. ఈ క్రమంలో యూపీ బీజేపీ మంత్రి సంజయ్ నిషాద్..  హిందీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడటం రాని వాళ్లు దేశ విడిచి వెళ్లిపోవాలన్నారు. 

“భారతదేశంలో నివసించాలనుకునే వారు హిందీని ప్రేమించాలి. మీరు హిందీని ఇష్టపడకపోతే, మీరు విదేశీయుడిగా లేదా విదేశీ శక్తులతో ముడిపడి ఉన్నారని అనుకుంటాం.  మేము ప్రాంతీయ భాషలను గౌరవిస్తాము, కానీ ఈ దేశం ఒకటి, మరియు భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం, భారతదేశం 'హిందూస్థాన్' అంటే హిందీ మాట్లాడే వారి ప్రదేశం. హిందుస్థాన్ హిందీ మాట్లాడని వారికి చోటు కాదు. వాళ్ళు ఈ దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళాలి” అని సంజయ్ నిషాద్ స్పష్టం చేశారు. 

బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.  ఒకే దేశం - ఒకే భాష అంటూ.. గతంలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.  దేశ ప్రజలందరూ విధిగా హిందీ నేర్చుకోవాలన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విాదాస్పదం అయ్యాయి.  రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమని.. హిందీ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా తేల్చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమేనని తన చాయిస్ కూడా  చెప్పేశారు.    మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలు గన్న ‘‘ఒకే దేశం, ఒకే భాష’’ నినాదాన్ని నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల కూడా ఆయన అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. 

అమిత్ షా  వ్యాఖ్యలపై  దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి.  దక్షిణాది నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  బలవంతంగా హిందీని తమపై రుద్దుతున్నారని.. తమ మాతృభాషలు ప్రమాదంలో పడతాయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మరింత రెచ్చగొట్టేలా హిందీ మాట్లాడలేని వాళ్లు విదేశీ శక్తులని.. దేశం విడిచి వెళ్లాలని వ్యాఖ్యలు చేస్తున్నారు.   యూపీ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై సహజంగానే దక్షిణాదిలో విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.  దీన్ని బీజేపీ నేతలు ఎలా సమర్తించుకుంటారో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget