అన్వేషించండి

Tamilnadu News: తమిళనాడులో దారుణం - పిల్లల చదువుల కోసం బస్సుకు ఎదురెళ్లి మరీ మహిళ ఆత్మహత్య

Tamilnadu News: పిల్లల చదువుల కోసం ఫీజులు కట్టలేని ఓ మహిళ.. బస్సుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య చేసుకుంది. అలా చేసుకుంటే డబ్బులతో పాటు పిల్లకు ప్రభుత్వమే చదువు చెప్పిస్తుందని ఆమె ఇలా చేసుకుంది.   

Tamilnadu News: భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాగా చదివించింది. అయితే అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్, కుమారుడు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. అయితే కుమారుడి ఫీజు కట్టేందుకు మహిళ దగ్గర డబ్బులు లేవు. ఎవరిని అప్పు అడిగినా ఇవ్వలేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగినా, అలా జరిగి చనిపోయినా సర్కారు డబ్బులు ఇస్తుందని.. అలాగే పిల్లలకు ఫ్రీగా చదువులు కూడా చెప్పిస్తుందని చెప్పారు. తను చనిపోతే పిల్లల భవిష్యత్తు అయినా బాగు పడుతుందని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ ఆలోచనతోనే వేగంగా వస్తున్న ఓ బస్సుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్య చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన 39 ఏళ్ల పాపతి భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. అయితే ఈమెకు ఇద్దరు పిల్లు కూడా ఉన్నారు. కుమార్తె, కుమారుడితో కలిసి ఆమె స్థానికంగా నివాసం ఉంటోంది. స్థానిక కలెక్టర్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తాను ఎంత కష్టపడి అయినా సరే పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. అందుకోసమే దొరికిన పని చేసుకుంటూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రస్తుతం ఆమె కుమార్తె ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. కుమారుడు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. కుమారుడికి కళాశాల ఫీజు కట్టేందుకు తన దగ్గర డబ్బులు లేవు. అయితే తెలిసిన వాళ్లను, స్నేహితులందరినీ పాపతి అప్పు అడిగింది. కానీ ఏ ఒక్కరూ సాయం చేయలేదు. అయితే తనకు తెలిసిన ఓ మనిషి ఓ తప్పుడు ఆలోచన చేసి ఆమెకు చెప్పింది. నీవు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వమే వారికి ఫ్రీగా చదువు చెప్పిస్తుందని వివరించింది. అమాయకురాలైన పాపతి అది నిజమనుకుని తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. తన చావుతోనైనా పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తుందని భావించింది. 


ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి మరీ ఢీకొంది. ఈ ఘటనలో పాపతి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.. ఈ ఘటనను ముందుగా అనుకోకుండా జరిగిన ప్రమాదంగా భావించారు. కానీ ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే తన తల్లిపై వస్తున్న వార్తలన్నీ అబద్ధం అని తన ఫీజు కట్టేందుకు బంధువులు సాయం చేశారని పాపతి కుమారుడు చెప్పాడు. మరోవైపు పోలీసుల దర్యాప్తులో మాత్రం ఓ మనిషి చెప్పిన మాటలు విన్న ఆమె కావాలనే ఆత్మహత్య చేసుకుందని వివరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP DesamNikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Telugu University: తెలుగు వర్శిటీ పేరు మార్పుపై బీజేపీ విమర్శలు - మహనీయుడ్ని అవమానించారని ఆగ్రహం
తెలుగు వర్శిటీ పేరు మార్పుపై బీజేపీ విమర్శలు - మహనీయుడ్ని అవమానించారని ఆగ్రహం
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
Tamannaah: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
Sourav Ganguly: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Embed widget