![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు, ముస్లిం విద్యార్థి చెంపదెబ్బ ఘటనపై సీరియస్
Supreme Court: ముజఫర్నగర్లో ముస్లిం విద్యార్థి చెంప దెబ్బ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
![యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు, ముస్లిం విద్యార్థి చెంపదెబ్బ ఘటనపై సీరియస్ Supreme Court Asks UP Govt To Appoint IPS Officer To Probe Student Slapping Case, Says 'Should Shake Conscience' యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు, ముస్లిం విద్యార్థి చెంపదెబ్బ ఘటనపై సీరియస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/25/0f681e5cb20e3c9e80a3eb66f4ea3bd21695635040991517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Muzaffarnagar Student Slapping Case:
ముజఫర్నగర్ ఘటనపై విచారణ..
యూపీలోని ముజఫర్నగర్లో ఓ ప్రైవేట్ స్కూల్లో మహిళా టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సంచలనమైంది. నెల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ కొసనాగుతూనే ఉంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్నే వణికించిందని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో యూపీ ప్రభుత్వాన్నీ మందలించింది. ఈ కేసు విచారణకు వెంటనే ఓ IPS అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ IPS అధికారి దీనిపై నివేదిక రూపొందించి కోర్టుకి సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాధిత బాలుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని, మిగతా విద్యార్థులతోనూ మాట్లాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
"ఇది చాలా తీవ్రమైన విషయం. ఓ వర్గానికి చెందిన విద్యార్థిని టార్గెట్ చేసి తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టించడం సహించరానిది. ఇదేనా చదువంటే..? ఆ బాధిత విద్యార్థి చదువు బాధ్యత అంతా ప్రభుత్వానిదే. నిజంగా ఓ వర్గానికి చెందిన విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా కొట్టించారన్న ఆరోపణలు నిజమే అయితే కచ్చితంగా ఇది రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుంది"
- సుప్రీంకోర్టు
ప్రభుత్వ తీరుపై అసహనం..
ఈ కేసు విచారణలో ప్రభుత్వం తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. FIR నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. జస్టిస్ పంకజ్ మిథాల్తో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండి పడింది. విద్యాహక్కు చట్టం కింద కచ్చితంగా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఓ వర్గానికి చెందిన విద్యార్థిపై ఇలాంటి దాడి జరిగిందంటే కచ్చితంగా అక్కడ నాణ్యమైన విద్య అందడం లేదనే పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఇదీ జరిగింది..
గత నెలలో యూపీలోని ముజఫర్నగర్లోని ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఓ ముస్లిం విద్యార్థిని ఓ హిందూ విద్యార్థితో కొట్టించింది మహిళా టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖబర్పూర్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోలో టీచర్ ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్లో ఉన్న విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని కొట్టాలని ఆదేశించింది. టీచర్ చెప్పినట్టుగానే విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని చెంపపై కొట్టారు. ఇలా కొడుతూ ఉండగా చైర్లో కూర్చున్న టీచర్ "ఇంకా గట్టిగా కొట్టండి" అంటూ ఆర్డర్ వేసింది. ఓ స్టూడెంట్ చెంపమీద కొట్టినా ఆగకుండా...నడుముపైన కొట్టండి అంటూ కుర్చీలో కూర్చుని ఆర్డర్లు వేసింది ఆ మహిళా టీచర్.
Also Read: రూమ్లో ఫుల్గా ఏసీ పెట్టుకుని పడుకున్న డాక్టర్, చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)