అన్వేషించండి

monsoon update 2025: మరింత ముందుగా నైరుతి రుతుపవనాలు, కూల్ న్యూస్ చెప్పిన ఐఎండీ

Monsoon Update:అనుకున్నదాని కంటే ముందుగానే భారత్‌కు నైరుతి రుతుపవనాలు రానున్నాయని ఐఎండీ చెప్పింది. రేపు లేదా ఎల్లుండి అండమాన్‌ను తాకనున్నాయి.

Monsoon Update: ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న టైంలో ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న టైం కంటే ముందే రుతుపవనాలు వచ్చేస్తున్నట్టు వెల్లడించింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు నిజంగా ఇది మంచి గుడ్ న్యూస్. మే 30 నాటికి దేశంలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అంతకంటే ముందుగానే వచ్చేస్తున్నట్టు మారిన వాతావరణం బట్టీ ఐఎండీ స్పష్టం చేసింది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా అనుకున్న అంచనాలు కంటే నాలుగు రోజులు ముందుగానే వచ్చేస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మే  15 తర్వాత అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఉన్న అనుకూల వాతావరణం చూస్తే ఈ రెండు రోజుల్లోనే వర్షావరణం ప్రారంభంకానుందని స్పష్టమవుతుంది. 

రేపు లేదా ఎల్లుండి ఉదయం అండమాన్‌కు తాకనున్న రుతుపవనాలు... 25 తర్వాత ఎప్పుడైనా కేరళను తాకబోతున్నాయి. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడతాయని చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో గతేడాది కంటే ఎక్కువ వర్షాలు పడతాయని లెక్కలు వేస్తున్నారు. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత మధ్య భారత వాతావరణ శాఖ పెచ్చిన గుడ్ న్యూస్ రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నింపింది. కేరళలో రుతుపవనాల రాక భారతదేశంలో వర్షాకాలం ప్రారంభంగా పరిగణిస్తారు. వ్యవసాయానికి ఈ సీజన్ చాలా ముఖ్యమైంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న వస్తాయి. కానీ ఈసారి మాత్రం చాలా ముందుగానే వస్తున్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

2020 సంవత్సరంలో భారతదేశంలో జూన్ 1న, 2021 సంవత్సరంలో జూన్ 3న, 2022 సంవత్సరంలో మే 29న, 2023 సంవత్సరంలో జూన్ 8న, 2024 సంవత్సరంలో మే 30న రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం వారం రోజులు ముందుగానే వస్తున్నట్టు లెక్కలు వేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ దంచి కొడుతోంది. సాయంత్రం నాలుగు తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ అకాల వర్షాలు రైతులకు చాలా నష్టం కలిగించాయి. ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget